29, నవంబర్ 2022, మంగళవారం

 నాన్న కూ కన్నీళ్లు ఉంటాయి


💠 నాన్న మనకోసం ఏం చేశాడో

ఏం కోల్పోయాడో మనకు తెలియదు..!


💠 జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.

 

💠 ఎందుకంటే..  నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్య కి అసలు చెప్పడు. అమ్మ లా ప్రేమ ను బయటికి చూపించడం నాన్న కు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.

 

💠 ఎప్పుడూ పనేనా ? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.

 

💠 మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. 

💠 వృద్ధాప్యం ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.

 

💠 తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్న కు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు. మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ.

 

💠 ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా? నాన్న కూడా ఏడుస్తాడు.😰 కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు.

 

💠 పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. నాన్న అన్నీ అమ్ముకుని, అంతా అయిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. నా కోసం నేను ఏదీ దాచుకోలేదే.... అనుకుంటాడు.

 

💠నిజానికి నేను అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు.


ప్రతి నాన్న కు 

అంతా రామ మయం ...🙏


చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ           నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.


బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో

పడుకోబెట్టిన వెంటనే పాడిన

పాట -

రామాలాలీ - మేఘశ్యామా లాలీ


మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు -

శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.


మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా


వినకూడని మాట వింటే అనాల్సిన మాట -

రామ రామ


భరించలేని కష్టానికి పర్యాయపదం -

రాముడి కష్టం .


తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు


కష్టం గట్టెక్కే తారక మంత్రం

శ్రీరామ .


విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .


అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట -

అన్నమో రామచంద్రా


వయసుడిగిన వేళ అనాల్సిన మాట -

కృష్ణా రామా !


తిరుగులేని మాటకు - రామబాణం 


సకల సుఖశాంతులకు - రామరాజ్యం .


ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన


ఆజానుబాహుడి పోలికకు - రాముడు


అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 


రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .


చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -

Rama killed Ravana ;


Ravana was Killed by Rama .


ఆదర్శ దాంపత్యానికి సీతారాములు


గొప్ప కొడుకు - రాముడు


అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు


గొప్ప విద్యార్ధి రాముడు

(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .


మంచి మిత్రుడు- రాముడు

(గుహుడు చెప్పాడు).


పిబరే రామ రసం - 


రామాయణ సారం అంతా ఒక్క ప్రవచనం లో అద్భుతంగా చెప్పిన శ్రీ చాగంటి వారు 


మంచి స్వామి రాముడు

(హనుమ చెప్పారు).


సంగీత సారం రాముడు

(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం

(పిబరే రామరసం)

సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)


కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .


రామాయణం పలుకుబళ్లు


మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .


తెలుగులో కూడా అంతే .


ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని

అడిగినట్లే ఉంటుంది ...


చెప్పడానికి వీలుకాకపోతే -

అబ్బో అదొక రామాయణం .


జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే

సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .


ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -

అదొక పుష్పకవిమానం


కబళించే చేతులు , చేష్టలు

కబంధ హస్తాలు .


వికారంగా ఉంటే -

శూర్పణఖ


చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).


పెద్ద పెద్ద అడుగులు వేస్తే -

అంగదుడి అంగలు.


మెలకువలేని నిద్ర

కుంభకర్ణ నిద్ర


పెద్ద ఇల్లు

లంకంత ఇల్లు .


ఎంగిలిచేసి పెడితే -

శబరి


ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు


అల్లరి మూకలకు నిలయం

కిష్కింధ కాండ


విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -

అగ్ని పరీక్షలే .


పితూరీలు చెప్పేవారందరూ -

మంథరలే.


సాయం చేసినపుడు- ఉడుత భక్తి..

కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..

 గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని


యుద్ధమంటే రామరావణ యుద్ధమే .


ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -

(రావణ కాష్టాలే .)


కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది

(ఇది విచిత్రమయిన ప్రయోగం ).


సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు


ఒంటిమిట్టది ఒక కథ ..

భద్రాద్రిది ఒక కథ

అసలు రామాయణమే మన కథ .

అది రాస్తే రామాయణం

చెబితే మహా భారతం


అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు

అది ఒక జీవన విధానం


అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు


రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు


|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||


ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.

ఓం నమఃశివాయ! నమః ఓం నమఃశివాయ! ఓం నమఃశివాయ! ///


రుద్ర శబ్దార్ధములు అనేకములున్నవి


1,రుతం(దం) సంసారదుఃఖం ద్రావయతీతి రుద్ర: సంసార దుఃఖమును నాశనం చేయువాడు రుద్రుడు -(రుదంద్రావయతీతి రుద్ర:) 


2,రోదయతి సర్వమన్త కాలమితి రుద్ర: 

ప్రళయకాలమున అందరినీ దుః ఖంపజేయువాడు రుద్రుడు.... 


3. రుతౌ నాదాంతే ద్రవతి - ద్రావయతీతి రుద్ర:

నాదము యొక్క చివర ద్రవింప జేయువాడు రుద్రుడు... 


4. రుత్వా వేదరూపయ, ధర్మాదీ నవలోకయతి ప్రాయతీతివా.... 

వేదరూపంలో ధర్మమును పొందింప జేయువాడు రుద్రుడు... రుద్ర:


5. రుత్యా-వాగ్రూపయా, వాచ్యం ప్రాపయతీతి రుద్ర: వాగ్రూపము చే అర్థప్రతీతిని పొందించువాడు రుద్రుడు.... 


6. రుత్వా - ప్రణవరూపయా, స్వాత్మానం ప్రాపయతీతి రుద్ర: 

ప్రణవరూపమున తనను పొందింపజేయు వాడు రుద్రుడు... 


7. రుద్రోరౌతీతి సత్యే రోరూపమాణో ద్రవతి - ప్రవిశతి మర్యాతి రుద్ర:

సత్యరూపమున మనుష్యులను ప్రవేశించువాడు రుద్రుడు.... 


8. రుతిం శబ్దం వేదాత్మానం బ్రహ్మణీ దదాతి కల్పాదావితి

కల్పాదియందు బ్రహ్మకు వేదములనిచ్చేవాడు రుద్రుడు... 


9. దుఃఖ, దుఃఖహేతువులను పోగొట్టువాడు రుద్రుడు అని...


!!!వాయువీయసంహిత!!

1. *మూలవిరాట్ 🚩 భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.

 

2. ప్రదక్షిణ 🚩 మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.


 3. ఆభరణాలతో దర్శనం 🚩 ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.


 4. కొబ్బరి కాయ 🚩 ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.


 5.మంత్రాలు 🚩 ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.


6. *గర్భగుడి 🚩 గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.


7.అభిషేకం* 🚩 విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.


8. *హారతి 🚩 పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.


9. *తీర్థం 🚩 ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


10. *మడి 🚩 తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_


                              లోకాః సమస్తాః

                                సుఖినోభవంతు

                         సర్వే జనాః సుఖినోభవంతు

            రైల్వే ప్రయాణికులకు భరోసా 

రాజమండ్రికి చెందిన వెంకటేశ్వరరావు దంపతులు విజయవాడలో ఉంటున్న తన కూతురి దగ్గరకు వెళ్లి ఆమె బాగోగులు చూసి విజయవాడ నుంచి బిలాస్‌పూర్‌కు మరో రైల్లో బయలుదేరారు. విజయవాడలోని వెంకటేశ్వరరావు కుమార్తె మూడుగంటల తర్వాత తల్లిదండ్రుల క్షేమ సమాచారం కోసం ఫోన్‌చేయగా ఫోన్‌ రింగవుతున్నా కాల్‌ లిఫ్టు చేయలేదు. వెంటనే ఆమె రైల్వే హెల్ప్‌లైన్‌ 182కు ఫోన్‌చేసి విషయం చెప్పి తన తల్లిదండ్రుల క్షేమ సమాచారాన్ని తెలియజేయాలని కోరింది. వెంటనే రైల్వే అధికారులు సంబంధిత సిబ్బందికి వెంకటేశ్వరరావు వెళ్లే రైలు సమాచారాన్ని తెలపగా ఖాజీపేటలో రైల్వే అధికారులు ఆయన దగ్గరకు వెళ్లి వారితో ఫోన్‌లో విజయవాడలోని ఆయన కుమార్తెతో మాట్లాడించారు. దీంతో కుమార్తెకు వూరట లభించింది. 


హౌరా-యశ్వంత్‌పూర్‌ రైల్లో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న ఓ విద్యార్థిని హిజ్రాలు ఏడిపించసాగారు. విద్యార్థి హిజ్రాల వేధింపులు భరించలేకపోవడాన్ని సాటి ప్రయాణికుడు గమనించాడు. వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 182కు ఫోన్‌చేసి సమాచారాన్ని అందించాడు. రైలు ఏలూరు వెళ్లగానే ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది హిజ్రాలుండే బోగి ఎక్కి వారిని అదుపులోనికి తీసుకున్నారు. 


మండవల్లి, న్యూస్‌టుడే


భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 182 హెల్ప్‌లైన్‌ నంబరును ఏర్పాటు చేసింది. విపత్తులు, ఆపద సమయాల్లో ప్రయాణికులు ఈ నంబరుకు ఫోన్‌చేస్తే వెనువెంటనే సాయం అందుతుంది. ఇటీవల బెంగళూరు స్టేషన్‌లో ఒకే కుటుంబానికి చెందిన 30 మంది తప్పిపోయిన సంఘటనలో సైతం ఇది ఎంతగానో ఉపయోగపడింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలోని రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌)కు అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికులు ఆ నంబరుకు కాల్‌ చేసిన వెంటనే అది ఏ డివిజన్‌లో ప్రయాణిస్తుందో, ఏ రైల్వే స్టేషన్‌లో నిలుస్తుందనే సమాచారం మొత్తం జీపీఎస్‌ ద్వారా తెలుస్తుంది. రైలు తరువాత నిలిచే స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ సిబ్బందికి సమాచారం వెళుతుంది. ఆర్పీఎఫ్‌ సిబ్బందికి వెళ్లే ఈ కాల్‌ రికార్డు కావడంతో ప్రతి కాల్‌కు ఎటువంటి పరిష్కారం చూపారనే విషయం సైతం సిబ్బంది నోట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది కాల్‌ వచ్చిన రైలు బోగీకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. 


ఎలాంటి సమస్యకైనా పరిష్కారం.. 

మనం రిజర్వేషన్‌ చేసుకున్న సీట్లో వేరొకరు కూర్చున్నా వెంటనే 138 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. బోగీల్లొ ఎవరైనా అనుమానితులుగా ఉన్నా, మరుగుదొడ్లలో నీరు రాకున్నా, దుర్వాసన వస్తున్నా, ఫ్యాన్లు తిరగకపోయినా.. లైట్లు వెలుగకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. తోటి ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, హిజ్రాలు, ఆకతాయిల వేధింపుల ఎక్కువైనా ఫోన్‌చేసి తక్షణ పరిష్కారం పొందవచ్చు. రైల్లో మన లగేజీ మరచిపోయి.. దిగిపోయిన సందర్భంలో సైతం ఫోన్‌చేస్తే అవతలి స్టేషన్‌లో లగేజిని పొందవచ్చు. 


ఏ సమయంలోనైనా.. ఎవరైనా.. 

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 182 ఉచిత హెల్‌లైన్‌ నంబరు 24గంటలు అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు ఏ సమయంలో అయినా ఫోన్‌చేసి సహాయాన్ని పొందవచ్చు. ఈ నంబరుకు రైల్లో ప్రయాణించే ప్రయాణికులతోపాటు ఎవరైనా  ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణంలో అనారోగ్యం సంభవించినా.. 182 ఫోన్‌చేసి సత్వర పరిష్కారం పొందవచ్చు.





    


అరుంధతీ (నక్షత్రం) ఎందుకు పూజ నీయమైంది?

ఈ ప్రశ్న నేటిదికాదు, నాటిదేనని చెబుతున్నది ‘సూత సమ్హితా శౌనకాది మహర్షి గణాలకు ఒకసారి ఇదే సందేహం కలిగింది. దీనిని వారు త్రికాలవేత్త సమస్త పురాణ వ్యాఖ్యానదక్షుడు అయినటువంటి సూతుని ముందుంచగా, ఆయన ‘అరుంధతీ దేవి ప్రాముఖ్యతను ఇలా వివరించాడు.
“అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతీ తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం!!’

అనగా అరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది. ఈ అయిదుగురు స్త్రీ మూర్తులు సదా వందనీయులని తెలుస్తున్నది. అరుంధతిదేవి పతివ్రతలో అగ్రగామి. ఈమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుందని ‘నైమిసమ్హితా పేర్కొంటోంది. అసక్తికరమైన అరుంధతి జన్మవౄత్తాంతాన్ని ఇపుడు మీకు చెప్పబోతున్నాను అన్నాడు సూత మహాముని.
ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవితయైన ఒక కన్యను, వర్ణింపనలవికాని ఒక  సుందరుని సృష్టించాడు. ఆ కన్య పేరు ‘సంధ్యా. యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సాయపదమని చెబూతూ బ్రహ్మ ఆ యువకునికి -
అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా!! అంటూ

అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు సమ్మోహన బాణాలను అందించాడు. బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా, బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న ‘సంధ్యా ను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపించి మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు. తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో ‘సంధ్యా చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలచి పయనమై పోయింది. అపుడు బ్రహ్మ వశిష్టమహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు ‘శివా మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెడలిపోయాడు. సంధ్య తదేకనిష్టలో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మని కోరగా, ఆమె “ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే’ వరాన్ని అనుగ్రహించమంది. శివుడు ఆమె లోకోపకార దృష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య ‘నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదౄష్టిలో చూచినట్లయితే, వారు నపుంసకులుగా మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేకమందికి కామవికారాని కల్గించాను. కాబట్టి ఈ దేహం నశించిపోవాలీ అని కోరింది. శివుడు ‘తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యురాలివై శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో! అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.
శివాజ్ణ్జగా సంధ్యా శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుండి తిరిగి జన్మించింది. సంస్కౄత భాషలో ‘అరుం’ అంటె అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ అంటె ధరించినది అనే అర్థం వున్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె ‘అరుంధతీ అనబడింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి వశిష్టునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది. ఈ దంపతులకు పుట్టినవాడే ‘శక్తీ. శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. అరుంధతిని మనవారు ‘ఆరని జ్యోతీ అని ‘అరంజ్యోతీ అని పిలుస్తూంటారు. విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనమలు, మునిమనమలు గురించి ప్రస్తావించబడివుంది.

అరుంధతీ నూతన దంపతులకు ఇచ్చే దీవెనలు ఏమిటి? అంటే, కొత్త పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్థి మండలంలో వున్న వశిష్టుని తారకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. దీనివెనుక ఒక ప్రధాన కారణమున్నది. వశిష్ట, అరుంధతీ ద్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారారూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది. వీరిద్దర్ని సందర్శించడం వలన దంపతులకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, సౌభాగ్యములు కలుగుతాయి.

 సాధారణంగా శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. 

✳️ అందుకు సంబంధించిన ఒక అధ్బుతమైన కధ ఉంది.
అదేమిటంటే....?

✳️ ఒకప్పుడు దేవతలకు "రామేశ్వరం" అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. 

✳️ 'రామస్య ఈశ్వరః' అని అంటే రామునికి ఈశ్వరుడు (ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం (శివుడే గొప్పవాడని) చెబుతుంది. 

✳️ శివ ధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? 

✳️ విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. విషయం చెప్పారు, మీరు మరియు శివుడిలో ఎవరు గొప్ప!? అని అడిగారు. 

✳️ దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఇంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది. రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రామునికి అధికారి. "నాకంటే శివుడే గొప్పవాడు" అని అన్నాడు విష్ణువు. 

✳️ ఈ విష్ణువు వినయంతోనో, అహంభావం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనో, మొహమాటం తోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి, తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహించడానికి ఏముంది? "రాముడే ఈశ్వరుడుగా గలవాడు అంటే  (విష్ణువు) తనకు అధికారి అని, "విష్ణువు తనకంటే గొప్ప అని అన్నాడు శివుడు"..

✳️ వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని, దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు - "రామేశ్వరుడంటే రాముడొకడూ, ఈశ్వరుడొకడు అని అర్దం కాదయ్య, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారు. 

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్ ||

✳️ అసలు వీళ్ళిద్దరికి బేధం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. 

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః || 

✳️ శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే, వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది..✅

✳️ శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి. ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం 
శివనామస్మరణ చేస్తాడు. 

🙏వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.🙏


🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏🌺🪷✍️


శ్రీ పరమేశ్వర మాతృకావర్ణ మాలాస్తోత్రమ్ 🙏
సేకరణ: బృహత్‌స్తోత్ర రత్నాకరం నుండి......

🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️

అ॥ 
అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణితగుణగణ అమృతశివ, 

ఆ॥ 
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ, 

ఇ॥
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ, 

ఈ॥
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవసేవిత పాద శివ, 

ఉ॥ 
ఉరగాది ప్రియభూషణ శంకర నరకవినాశ నటేశ శివ, 

ఊ॥ 
ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ,

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

ఋll 
ఋగ్వేద శ్రుతిమౌళి విభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ,

ౠll 
ౠపమనాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్త్వ శివ,

ఌll లింగస్వరూప సర్వబుధప్రియ మంగళమూర్తి మహేశశివ, 

ౡll
ౡతాధీశ్వర రూపప్రియశివ వేదాంత ప్రియవేద్యశివ,

ఏ॥
ఏకానేకస్వరూప విశ్వేశ్వర యోగిహృది ప్రియవాస శివ,

ఐll
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ,

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

ఓll
ఓంకార ప్రియ ఉరగవిభూషణ హ్రీంకారాది మహేశశివ,

ఔ॥ 
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ, 
 
అం॥ 
అంబరవాస చిదంబరనాయక తుంబురునారద సేవ్యశివ, 

అఃll 
ఆహారప్రియ ఆదిగిరీశ్వర భోగాదిప్రియ పూర్ణశివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

కll 
కమలాక్షార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాంతిశివ,

ఖll 
ఖడ్గశూలమృగ ఢక్కాద్యాయుధ విక్రమరూప విశ్వేశశివ, 

గll
గంగాగిరిసుతవల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ, 

ఘll 
ఘాతకభంజన పాతకనాశన గౌరిసమేత గిరీశ శివ, 

జ॥ 
ఙఙాశ్రిత శ్రుతిమౌళివిభూషణ వేదస్వరూప విశ్వేశశివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

చll 
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశశివ,

ఛII 
ఛత్ర కిరీట సుకుండలశోభిత పుత్రప్రియ భువనేశ శివ, 

జ॥ 
జన్మజరా మృతినాశన కల్మషరహిత తాపవినాశ శివ, 

ఝll
ఝంకారాశ్రయ భృంగిరిటప్రియ ఓంకారేశ మహేశశివ,

ఞll
జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల దీనజనప్రియ దీపశివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

టII 
టంకాద్యాయుధధారణ సత్వర హ్రీంకారాది సురేశ శివ,

ఠll
ఠంకస్వరూపా సహకారోత్తమ వాగీశ్వర వరదేశ శివ,

డ॥
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదీశ శివ,

ఢ॥ 
ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్యశివ,

ణll 
నళినవిలోచన నటనమనోహర అళికుల భూషణ అమృత శివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

త॥ 
తత్త్వమసీత్యాది వాక్యస్వరూపక నిత్యానంద మహేశశివ,

థ॥ 
స్థావరజంగమభువనవిలక్షణ భావుకమునివర సేవ్యశివ,

దll
దుఃఖవినాశన దళితమనోన్మన చందనలేపితచరణ శివ,

ధ॥ 
ధరణీధరశుభ ధవళవిభాస్వర ధనదాదిప్రియదానశివ,

న॥ 
నానామణిగణభూషణ నిర్గుణ నటనజన ప్రియనాట్య శివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

ప॥
పన్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశశివ,

ఫll
ఫాలవిలోచన భానుకోటి ప్రభ హాలాహలధర అమృతశివ, 

బll 
బంధవినాశన బృహదీశామర స్కందాది ప్రియ కనకశివ

భ॥ 
భస్త్మవిలేపన భవభయనాశన విస్మయరూప విశ్వేశశివ,

మ॥ 
మన్మథనాశన మధుపాన ప్రియ సుందరపర్వతవాసశివ,

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

యll 
యతిజనహృదయనివాసిత ఈశ్వర విధివిష్ణ్వాది సురేశశివ,

ర॥ 
రామేశ్వర రమణీయ ముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ, 

లll 
లంకాధీశ్వర సురగణసేవిత లావణ్యామృత లసిత శివ, 

వ॥ 
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూషశివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

శ॥ 
శాంతిస్వరూప జగత్త్రయ చిన్మయ కాంతిమతీ ప్రియ కనక శివ, 

షll 
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాది సమేతశివ, 

సll 
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుహృది ప్రియ వాసశివ,

హll 
హరపురుషోత్తమ అద్వైతామృత పూర్ణమురారి సుసేవ్యశివ,

ళ॥ 
ళాళితభక్తజనేశనిజేశ్వర కాళినటేశ్వర కామశివ, 

క్ష॥ 
క్షరరూపాది ప్రియాన్వితసుందర సాక్షి జగత్త్రయస్వామిశివ,

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

ఇతి శ్రీ సాంబసదాశివ మాతృకావర్ణమాలికాస్తోత్రమ్.

🙏 హరహర మహాదేవ🙏

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది - సోమనాథ్ ఆలయం🌹

🌸సోమనాథ్ ఆలయం. మొదటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది ఇది. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ముస్లింల దాడులతో నలిగిపోయినప్పటికీ ఈ ఆలయం.. మాత్రం పునర్ నిర్మాణంతో మళ్లీ ప్రాముఖ్యత సంతరించుకుంటూనే ఉంది. ఈ ఆలయంలో ఉన్న సోమేశ్వర లింగం ఒక అద్భుతంగా చెప్పుకోవాలి. ఈ లింగం వెనుక అంతుచిక్కని రహస్యం దాగుంది.

🌸గుజరాత్ లోని ప్రభాస పట్టణంలో సోమనాథ్ ఆలయం కొలువై ఉంది. త్రివేణి సంగమానికి దగ్గరలో ఉన్న ఈ సోమనాథ్ ఆలయ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలమని హిందువులు నమ్ముతారు.

🌸శివుడికి ఎంతో ప్రత్యేకమైన లింగాకారాల్లో మొదటి జ్యోతిర్లింగం ఇక్కడ కొలువుదీరింది. అయితే ఈ ఆలయం కేవలం జ్యోతిర్లింగ క్షేత్రంగానే కాదు.. రకరకాల రహస్యాలు, చరిత్రలను కలిగి ఉంది.

🌸ఈ ఆలయం వెనక దాగున్న నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

🌹12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి🌹

🌸ప్రముఖ ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో సోమనాథ్ ఆలయం ఒకటి. శివుడికి చాలా ప్రత్యేకమైనవి ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ముస్లిం ఆక్రమణదారులతో చాలా సందర్భాల్లో సుమారు ఆరేడుసార్లు సోమనాథ్ ఆలయం అపవిత్రంగా ధ్వసం చేయబడింది.

🌸కానీ ప్రతిసారి అదే ప్రాంతంలో పునర్ నిర్మించారు. చివరిసారిగా ఈ ఆలయాన్ని 1947 నుంచి 1957 వరకు ఐదేళ్లు నిర్మించారు. అప్పటి భారత రాష్ర్టపతి రాజేంద్రప్రసాద్ ఈ ఆలయాన్ని ప్రారంభించారు.

🌹గాలిలో తేలియాడే శివలింగం🌹

🌸సోమనాథ్ ఆలయంలో ఎవ్వరికీ అంతచిక్కని విచిత్రం ఉంది. అది చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం. ఆలయం మధ్యలో, భూమి లోపల ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది. గాలిలో తేలినట్టు ఉండే ఈ శివలింగం ఎవ్వరికైనా వర్ణించలేని ఒక అద్భుత దృశ్యం.

🌹లింగం ప్రత్యేకత🌹

🌸ఈ జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇదో  మహిమాన్విత శిల అని, ఇది బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగే శక్తి కలిగి ఉంది. ఈ రాయికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. కాబట్టి.. ఇది ఎలాంటి ఆధారం లేకుండా నిలబడి ఉందని చాలా మంది చెబుతూ ఉంటారు.

🌹సోమనాథ్ ఆలయ పురాణం🌹

సుల్తాన్ మహమ్మద్ ఇండియాకి వ్యతిరేకంగా మతయుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు సోమనాథ్ ఆలయాన్ని కూల్చేశారు. అలా కూల్చేయడం ద్వారా హిందువులను మహమ్మదీయులలోకి కలుపుకోవాలని భావించారు.

🌸పూర్వ శకం 1025 లో అక్కడికి చేరుకున్నాడు సుల్తాన్ మహమ్మద్. అయితే హిందువులంతా.. ఆలయంలోకి వెళ్లి..కాపాడండి అంటూ కేకలు పెట్టారు. అయినా 50 వేల మందిని చంపేసి, ఆలయాన్ని కూల్చేశారు.

🌹గొప్ప నిధి🌹

🌸ఆలయాన్ని కూల్చిన తర్వాత సుల్తాన్ మహమ్మద్ ఆలయంలోని నిధులన్నీ కాజేశారు. చాలా బంగారు, వెండి విగ్రహాలు, లెక్కలేనన్ని బంగారు, వెండి పాత్రలు అపహరించుకుపోయారు.

🌹త్రివేణి సంగమం🌹

🌸చరిత్ర ప్రకారం సోమనాథ్ పుణ్యక్షేత్రం త్రివేణి సంగమాన్ని కలుపుతూ నిర్మించారు. ఇక్కడ కపిల, హిరాణి, సరస్వతి నదుల కలయికతో త్రివేణి సంగమంగా పిలువబడుతుంది.

🌹పౌరాణిక జానపదాలు🌹

🌸చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మందిని పెళ్లి చేసుకుంటాడు. కానీ 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉంటూ మిగిలిన వాళ్లను నిర్లక్ష్యం చేస్తాడు.

🌸ఈ కారణంగా దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపిస్తాడు. దీంతో చంద్రుడు కాంతిని కొద్దికొద్దిగా కోల్పోతూ.. చివరికి ఒక రోజూ పూర్తీగా ప్రకాశాన్ని కోల్పోయి మాయమవుతాడు.

🌹చంద్రుడికి శివానుగ్రహం🌹

🌸అలా మాయమైన చంద్రుడు తర్వాత బ్రహ్మ సూచన మేరకు ప్రభాస తీర్థానికి చేరుకుని శివుడిని వేడుకుంటాడు. తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారించుకోవడానికి చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రాంతమే ఈ ప్రభాస తీర్ధము.

🌸ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలందరిని సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు.

🌹ఆలయ నిర్మాణం, పురాణాలు🌹

🌸పురాణాల ప్రకారం ఆలయాన్ని రకరకాలుగా నిర్మించినట్లు తెలుస్తోంది. చంద్రుడు సోమనాథ్ ఆలయాన్ని బంగారంతో, తర్వాత రావణుడు వెండితో, తర్వాత శ్రీకృష్ణుడు గంధపు చెక్కతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

🌸మొదట జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్ ఆలయానికి ప్రాణ ప్రతిష్ట 10వ త్రేతాయుగం సమయంలో శ్రావణమాసంలో ప్రారంభమైందట.
అంటే మొదటగా ఈ ఆలయం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైనదనే సందర్భాన్ని స్కంద పురాణంలోని ప్రభాస ఖండం వివరిస్తోంది.

🌹వేదాలు, పురాణాలు🌹

🌸గుజరాత్ లోని నెలకొని ఉన్న సోమనాథ్ ఆలయంలో పురాణ, ఇతిహాసాలు దర్శనిమిస్తాయి. పురాతన ఆలయమైన ఇందులో అనేక పురాణగాధలు కళ్లకు కడతాయి.
భాగవతం, స్కంద పురాణం, శివ పురాణం వంటి ఆనవాళ్లు ఈ ఆలయంలో కనిపిస్తాయి.

🌹శాశ్వత పుణ్యక్షేత్రం🌹


🌸ఈ పురాతన ఆలయాన్ని అనేక సార్లు కూలగొట్టారు.. మళ్లీ పునర్ నిర్మించారు. ఇస్లాం రాజులు ఈ ఆలయాన్ని కూలగొడితే.. హిందూ రాజులు మళ్లీ పునర్ నిర్మించారు.
చివరిసారిగా 1947లో ఈ ఆలయాన్ని వల్లభాయ్ పటేల్ సందర్శించి.. మళ్లీ నిర్మించాలని నిర్ణయించారు. పటేల్ మరణం తర్వాత ఈ ఆలయ నిర్మాణం భారత ప్రభుత్వం చొరవతో పూర్తయింది.

🌹మహమ్మద్ గజిని🌹

🌸క్రీ. శ 1024 గజనీ మహమ్మద్ ధార్ ఎడారిగుండా ఈ ఆలయానికి చేరుకుని తన దండయాత్రలో భాగంగా మరోసారి సోమనాథ్ ధ్వంసం చేసాడు.
ఆలయం తిరిగి గుర్జర్ పరమకు చెందిన మాల్వా రాజైన భోజి, అన్‌హిల్వారాకు చెందిన చోళంకి రాజైన భీమ్‌దేవ్‌ లు క్రీ. శ 1026 నుంచి 1042ల మధ్య ఆలయ పునర్ నిర్మాణం జరిగింది.

🌸క్రీ.శ 1296 సోమనాథ్ ఆలయాన్ని మరోసారి సుల్తాన్ అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యాలు కూల్చేశాయి. మళ్లీ క్రీ శ 1308లో సౌరాష్ట్రా రాజైన మహీపాదావ సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు.

🌹ఔరంగజేబ్ 🌹

🌸క్రీ.శ. 1375లో సోమనాథ్ ఆలయాన్ని గుజరాత్ సుల్తాన్ మొదటి ముజాఫర్ షాహ్ కూల్చేశాడు. తర్వాత క్రీ శ 1451లో గుజరాత్ సుల్తాన్, క్రీ శ 1701లో మరోసారి ఈ ఆలయం కూల్చబడింది.

🌸క్రీ శ 1701లో ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ రాళ్లతో మసీదు నిర్మించాడు. తర్వాత క్రీ.శ 1783లో పూనా పేష్వా, నాగపూరుకు చెందిన భోన్స్‌లే, ఖోలాపూరుకు చెందిన చత్రపతి భోన్‌స్లే.. ఇండోరుకు చెందిన హోల్కార్ రాణి అహల్యాభాయి, గ్వాలియరుకు చెందిన శ్రీమంత్ పతిభువా అందరూ కలిసి ఆలయాన్ని మళ్లీ పునర్ నిర్మించారు.

🌹ఆలయ ప్రవేశానికి ప్రత్యేక అనుమతి🌹

🌸హిందువులు సోమనాథ ఆలయంలో ప్రవేశించడానికి ఎలాంటి నిబంధన లేదు. కానీ.. హిందువులు కాకుండా వేరే
మతస్థులు ఆలయంలో ప్రవేశించాలంటే.. ప్రత్యేక అనుమతి అవసరం. నిజమే.. ఇతర మతస్థులు ఆలయంలోకీ వెళ్లాలంటే.. ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి, వెళ్లడానికి సరైన కారణాలు చెప్పాలి, అలాగే అధికారులను ఒప్పిస్తేనే ఆలయ ప్రవేశానికి అర్హులవుతారు.

🌹ఆలయంలో నోటీస్🌹

🌸సోమనాథ్ ఆలయంలోని జ్యోతిర్లింగం హిందువులకు ప్రత్యేకమైనది. ఇటీవలే ఆలయం బయట నోటీస్ పెట్టారు. హిందువులు కాకుండా ఇతర మతస్థులు ఆలయంలో ప్రవేశించాలంటే.. ఆలయ జనరల్
మేనేజర్ తో పర్మిషన్ తీసుకోవాలని వివరిస్తూ ఈ నోటీస్ ఏర్పాటు చేశారు.
అనేకసార్లు ఈ ఆలయం మహమ్మదీయుల చేత కూల్చబడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.

🌹నిర్మాణ శైలి🌹

🌸చాళుక్యుల నిర్మాణ శైలిలో ప్రస్తుతం ఆలయ నిర్మాణం జరిగింది. 150 అడుగల ఎత్తులో ఆలయ శిఖరం ఉంటుంది. సోమనాథ్ ఆలయానికి ఉన్న కలశం బరువు 10 టన్నులు. 27 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభానికి ఉన్న జెండాను రోజుకి మూడు సార్లు మారుస్తారు.

🌹బాణ స్తంభం, మరో అద్భుతం🌹

🌸సోమనాథ్ ఆలయం నిర్మించిన
స్థలానికీ, దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ ఖండానికీ మధ్య భూభాగమన్నదే లేదు. ఈ విశేషాన్ని సంస్కృత భాషలో తెలియజేస్తున్న ఒక శాసనం అక్కడి బాణ స్తంభం లేదా యారో పిల్లర్ మీద చెక్కబడింది.

🌸వెయ్యి ఏళ్ల క్రితం ఈ బాణ స్తంభం అక్కడి సముద్రతీరాన ఉన్న రక్షణ కుడ్యముపై నిర్మించారు. ఈ బాణ స్థంభం ఉత్తర దక్షిణ
ధృవాల కేంద్ర బిందువుగా భావిస్తారు. 
చూశారుగా.. ఇది సోమనాథ్ ఆలయం వెనక ఉన్న ఆశ్చర్యకర, అంతుచిక్కని విషయాలు.


నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి,  కూర్చుని త్రాగండి.
2➕ వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా A. C.లో పడుకుంటే శరీరం పెరిగి లావై పోతారు.          
 3➕ 70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు నొప్పి తగ్గించే మాత్రలు ఏవీ కూడా అంతగా చేయవు.
4➕ కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.
5➕ అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలని అనారోగ్యం పాలు చేయటానికి వాడేవారు.
6➕ షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు త్రాగితే అమృతం వలే పనిచేస్తాయి.
7➕ పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో  బాగవుతారు.
8➕ దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు.
9➕ ఈ మంచి మాటలు, మంచివారికి, తమకు ఇష్టమైన మిత్రులకు, బంధువులకు మరియు గ్రూపులో తప్పక షేర్ చేయండి. ఈ విధంగా నైనా మనం ఒకరి జీవితం రక్షించిన వారమవుతాం. ......
         ధన్యవాదములు మీ శ్రేయోభిలాషి*


కాశి ఆలయ చరిత్ర*
 👉 కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం. 
👉 కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.
👉 క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం
👉 క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన
👉 క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం
👉 క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు
👉 క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి     👉 క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్   👉 క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం👉 క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు    👉 శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి    👉 క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు      👉 క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం       👉 క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం      👉 క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు  👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్  👉 కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం👉 ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు   👉 కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం    ల👉 184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.   👉 12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.  👉 కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.   👉 మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.     👉 కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.     👉 విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.
👉 ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.    👉 ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.    👉 2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి, కారణజన్ముడు, యుగపురుషుడు, మన హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.    శ్రీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభం అయిన తరువాత రోజూ 60 వేల మంది పైగా భక్తులు దర్శనానికి వస్తున్నారు.
🙏 ఈ మెసేజ్ చదివి ఊరుకోవడం కాకుండా మీకు వీలైనంత వరకు తప్పకుండా అందరికీ ఫార్వర్డ్ మరియు షేర్ చేయగలరు.




శివుని కి ఏ అభిషేకం వలన ఏం ఫలితములు ?

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును 
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును. 
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
 7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును  
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును. 
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
 11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. 
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
 14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.
 15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము తొలగుతుంది.
 16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
 17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న      లింగార్చనకు        ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది  (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన  అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా  బాగుంటుంది అన్న లింగార్చన).
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు. 
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది. 
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును. 
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవ byర్తివ్తము లభించును. 
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని  కలిగించును. 
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. 
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

సర్వేజనా సుఖినోభవంతు...









భస్మం ...!! 🎻🌹🙏 *

🌿కైలాసం నుండి శంకరుడు బ్రాహ్మణుని వేషములో ఒకనాడు రాముడి వద్దకు వెళ్లెను. రాముడు మీ యొక్క నామమును నివాసమును తెలుపుమని అడుగగా...

🌸 " నా పేరు శంభుడు నేను  కైలాసం నా యొక్క నివాసము అని రాముడికి చెప్పగా గ్రహించి అతనిని శంకరునిగా గ్రహించి రాముడు వీభూతి యొక్క మహిమ ను తెలుపవలసినదని అని అడుగగా శివుడు చెప్పసాగెను.  

      🌿 " రామా ! భస్మమహత్యమును చెప్పుటకు బ్రహాదులకు కూడా శక్యము కాదు. బట్టమీది చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచి వేయగలిగే శక్తి భస్మంనకు ఉన్నది. 

🌸 విభూతిని మూడు రేఖలుగా పెట్టుకున్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లగును.    
       
🌿 ముఖమున భస్మమును ధరించిన నోటి పాపములను (తిట్టుట, చెడు మాటలు పలుకుట, అభక్ష్యములను తినకూడదని పధార్థములను తినడం  అనుపాపములు). 

 🌸 చేతులపై ధరించిన చేతి పాపములను ( కొట్టటం మొ") హ్రదయముపై ధరించిన మనఃపాతకములను (దురాలోచనాలు మొదలైనవి) నాభిస్తానమున ధరించుట వలన వ్యబిచారది దోషములనూ.. 

🌿 పక్కలందు ధరించుటవలన పరస్త్రి స్పర్ష దోషములను పోగొట్టును పాపములను భర్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది. 

 🌸 కావున భస్మము అని పేరు దీనికి కలిగెను. భస్మము మీద పడుకొన్నను, తిన్ననూ, ఒంటికి పూసుకున్ననూ పాపములన్ని భస్మీభూతములు అగును. 

🌿 ఆయువు పెరుగును. గర్భిణి స్త్రీలకు సుఖ ప్రసవం కలిగించును సర్ప వృశ్చికాదీ దోషములను హరించును భూత పిశాదులను పారద్రోలును."            

🌸వశిష్ట వంశములో ధనంజయుడను  ఒక విప్రుడు ఉండెను అతనికి వందమంది భార్యలు  వందమంది కొడుకులు వారందరికి తన ధనాన్ని అంతా సమానంగా పంచిఇచ్చి..

🌿ఆ బ్రాహ్మణుడు గతించెను కొడుకులు అసూయతోను దురాశతోను ఒకరి ధనము కోసం  ఒకరు ఆశపడుచు తన్నుకోసాగిరి. 

🌸వారిలో కరణుడను కొడుకు శత్రు విజయము సాధించవలెనని గంగా తీరమునకు వెళ్లి స్నానం చేసి తపము చేయవలెననుకొని మునులసేవ చేయుచుండగా...

🌿 ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతియని ఒక నిమ్మపండుని తెచ్చి అక్కడ పెట్టెను.  దానిని వీడు వాసన చూసేను.అoదుకు మునులు గ్రహించి ఈగవై పొమ్మని శపించిరి.

🌸 వీడు వేడుకొనగా పూర్వస్మృతిని ఇచ్చిరి. అంతటా ఏడ్చుచు వెళ్లి జరిగిన విషయం భార్యకు చెప్పెను. 

🌿అతని భార్య పతివ్రత చాల విచారించెను. ఒకనాడు  ఈ సంగతి తెలిసి వాని సోదరులు పట్టి చంపిరి. అతని భార్య ఈగ దేహమును తీసుకోని అరుంధతి దగ్గరికి వెళ్లి ప్రార్ధింపగా ....

🌸 ఆమె మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని చల్లి కరుణుని బ్రతికించెను. 

🌿మరొకసారి దాయాదులు కరణుని చంపి యింటి ముందు పారవేసిరి. అతని భార్యయైన శుచిస్మిత భర్త దేహముతో వనములో తిరుగుచుండగా దధీచి ముని కనపడెను.  ఆమె ఆ మునికి విషయమంతా తెలిపి ప్రార్ధింపగా...

🌸 ఆయన భస్మముతో ఆ బ్రహ్మహత్యా పాపమును పరమశివుడు పోగొట్టెను. దానినే ఇతనిపై చల్లుచున్న అని చెల్లెను అతడు శాప విముక్తుడయి జీవించెను.

🌿 దేవతలు  కూడా భస్మ ప్రభావమును పొగిడిరి కరుణ దంపతులు దధీచి మునిని తమ ఇంటికి పిలిచి భోజనం పెట్టిరి.

🌸 అతడు వారిని దీవించి వెడలిపోయెను. ఆవుపేడ పిడుకలను శతారుద్రీయ (నమకము) మంత్రము చెప్పుచూ కాల్చి భస్మము చేయవలెను. మంత్రములు రాకున్నచో ప్రణవము ఉచ్చరించుచు ధరింపవలెను.

ఏ మంత్రము రానీ వారు 
 ఓం నమశ్శివాయ మంత్రముచే భస్మమును ధరించుట శ్రేష్టం  అని ''పద్మ పురాణము లో చెప్పబడినది...
          🚩🌞🙏🌹🎻




ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏

జగన్మాత చిరునామా..🙏

గుళ్లో విగ్రహానికి, ఇంట్లో పటానికి పూజలు చేస్తాం, నివేదనలు సమర్పిస్తాం. 
అంతే తప్ప అమ్మవారి అసలు రూపురేఖలేంటో, 
ఆ చల్లనితల్లి జాడేమిటో మనకు తెలీదు. 

భక్తిగా అర్చిస్తూ, కష్టాన్నీ సుఖాన్నీ చెప్పుకునే మన ఆరాధ్యదైవం అమ్మ చిరునామా ఎక్కడో, 
ఆ తల్లి తత్వమేంటో తెలుసుకుందాం...

మేరుపర్వతం మధ్యశిఖరంపై గల శ్రీమన్నగరానికి నాయకురాలిగా చింతామణి గృహంలో, 
పంచ బ్రహ్మాసనంపై అమ్మ ఆసీనురాలై ఉంటుందని ‘దేవీ భాగవతం’ చెబుతోంది. 

బ్రహ్మాండ పురాణంలోని లలితా సహస్రనామ స్తోత్రంలో సుమేరు శృంగ మధ్యస్థా, 
శ్రీమన్నగర నాయికా, చింతామణి గృహాంతస్థా, 
పంచ బ్రహ్మాసన స్థితా, మహా పద్మాటవీ సంస్థా, కదంబ వన వాసినీ, సుధా సాగర మధ్యస్థా- నామాలలో ఈ ప్రదేశాలన్నీ దేవీ నివాస స్థానాలుగా వర్ణించారు వ్యాసులవారు.

లలితాదేవి శరన్నవరాత్రుల వేళ మణిద్వీపంలో కొలువై ఉంటుంది. 
ఆ ద్వీపం ఎక్కడంటారా?! 
మనం ఉంటున్న ఈ భూమినుంచి వరుసగా 
ఏడు ఊర్ధ్వ లోకాలున్నాయి. 
వాటిలో సత్యలోకం అన్నిటికంటే పైనుంది. 
ఆ పైన వైకుంఠ కైలాసాలు, 
అంతకంటే పైన గోలోకం, 
ఆపైన మణిద్వీపం. 
ఇది అమృత సముద్రం మధ్యలో ఉంది. 
ఈ ద్వీపంలో ఉన్న చింతామణి గృహం అమ్మకు నివాస స్థానం. 
గొప్ప గొప్ప పద్మాలున్న అడవిలో, 
కడిమిచెట్ల తోటలో చింతామణులతో కట్టిన ఇల్లది. ఆ ఇంట్లో ఐదు శక్తులతో ఏర్పాటైన ఒక ఆసనంపై లలితాదేవి దర్శనమిస్తుందట. 
అమ్మని దర్శించుకోవాలంటే, ఈ ప్రదేశాలన్నీ దాటి వెళ్లాలి.

ఇంటిపక్కనున్న గుడికి వెళ్లడానికే అలసిపోయే మనం అంతదూరం ప్రయాణించడం కొంచెం 
కష్టమైన వ్యవహారమే. 
అయితే లలితా సహస్రనామ స్తోత్రంలోని 
️‘అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా’ ️నామాలు దారి చూపిస్తాయి. 

మనం అనుసరించే మార్గం బహిర్ముఖమైతే, 
అమ్మను చేరుకోవటం దుర్లభం. 
కానీ సాధకులు అంతర్ముఖులైతే మాత్రం తనలోనే అమ్మను దర్శించి, సేవించగలుగుతారు. 
చిత్తశుద్ధితో సాధనచేస్తే మనసులో లేనిపోని ఆలోచనలేవీ రావు. 
అప్పుడు ఆ మనసే అమృత సముద్రమై, 
అమ్మకు నివాసం అవుతుంది.

మేరుపర్వత మధ్యశిఖరాన అమ్మ ఉందనుకున్నాం కదా! ‘మేరు’ పదంలో- ‘మ- అ- ఈ- ర- ఉ’ అక్షరాలున్నాయి. 
వీటిలో మధ్యనున్న ‘ఈ’ అక్షరం అమ్మ నివాసం. 
‘ఈం’ అనే ఈ అక్షరమే ఐం, శ్రీం, హ్రీం, క్రీం, క్లీం మొదలైన  బీజాక్షరాలకు మూలం. 
దేవీ మంత్రం దీక్షగా జపిస్తే, 
అమ్మదర్శనం కోసం పరితపిస్తే.. 
అప్పుడు హృదయాలు బంగారు కొండలవుతాయి. కల్మషంలేని పవిత్ర హృదయమే మేరు పర్వతం. 
అది అమ్మకు నివాసం.

ఆ మణిద్వీపంలోని శ్రీమన్నగరానికి నాయకురాలు లలితాదేవి. 
‘శ్రీ’ అంటే శోభ, సంపద, శ్రేయస్సు, ఆనందం. 
మన శరీరంలోని ఐదు కర్మేంద్రియాలూ, 
ఐదు జ్ఞానేంద్రియాలకూ అధిదేవతలున్నారు. 
కనుకనే ‘దేహమే దేవాలయం’ అన్నారు పెద్దలు. నిత్యమూ ధార్మిక చింతన, ఆధ్యాత్మిక సాధన సాగినప్పుడు అందాకా నిద్రాణంగా ఉన్న శక్తులన్నీ మేలుకుంటాయి. 
అప్పుడు శరీరమనే శ్రీమన్నగరంలోనే భక్తులకు 
అమ్మ దర్శనమిస్తుంది.

మణిద్వీపంలో పద్మాలు విరబూసిన అడవి, 
కదంబ వనము ఉన్నాయి. 
లోకంలోని పద్మాలన్నీ సూర్యోదయంతో వికసించి, సూర్యాస్తమయంతో ముడుచుకుంటాయి. 
కానీ అవి మాత్రం ఎప్పుడూ వికసించే ఉంటాయి. 
ఆ విశిష్ట పద్మాల్లోనే నివాసం ఏర్పరచుకుంది అమ్మ. మన దేహంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న పద్మాలు యోగ సాధనవల్ల వికాసం పొందుతాయి. 
ఆనందమనే మకరందంతో ఉప్పొంగుతాయి. 
ఆ వికసిత మనసుల్లో లలితాదేవి కొలువుతీరి ఉంటుంది.

కడిమిచెట్టుకు ‘నీపము’ అని ఇంకో పేరుంది. 
అంటే అది జీవుడికి దేవుడితో తాదాత్మ్యం కలిగిస్తుందన్నమాట. 
కడిమిచెట్టు మేఘాలను ఆకర్షించి, వర్షాలను కురిపిస్తుందని విజ్ఞాన శాస్త్రం చెప్తోంది. 
నింగినుంచి నేలకు దిగివచ్చే దైవానుగ్రహానికి 
సంకేతం వర్షం. 
సన్మార్గంలో జీవించే వారికి దైవానుగ్రహం సిద్ధంగా ఉంటుందనే సత్యాన్ని కదంబవనం సూచిస్తోంది. 
ఈ సత్యాన్ని గుర్తించి, ప్రవర్తించేవారి మానస కదంబవనం అమ్మ నివాసం.

కల్పవృక్షం, కామధేనువుల్లానే కోరినవన్నీ ప్రసాదించేది చింతామణి. 
అలాంటి చింతామణులతో కట్టిన ఇల్లు అమ్మది. భక్తులకు కావలసినవన్నీ ఇచ్చే అమ్మవారి గుణమే 
ఆ తల్లి నివసించే ఇంటికి కూడా అబ్బింది. 
ఆ గుణాన్ని అలవరచుకుంటే, చింతామణీ మంత్రజప సాధన ఫలిస్తుంది. 
భక్తుల దివ్య దేహమే చింతామణి గృహమై అంతర్ముఖంగా అమ్మదర్శనం లభిస్తుంది. 

ఆ గృహంలో పంచబ్రహ్మాసనంపై కూర్చుని దర్శనమిస్తుంది లలితాదేవి. 
బ్రహ్మ అంటే శక్తి. 
ఐదు శక్తులతో ఏర్పాటైన ఆసనం అది. 
సృష్టి, స్థితి, లయం, తిరోధానం, (కనిపించకుండా ఉండటం) అనుగ్రహం- అనే ఐదు పనులను ఐదుపేర్లతో నిర్వహిస్తోంది అమ్మ. 
అందుకు సంకేతం పంచబ్రహ్మాసనం. 
సాధనవల్ల ఈ సత్యాన్ని గుర్తించిన భక్తుణ్ణి కామక్రోధాలు మొదలైన అరిషడ్వర్గాలు 
ఏమీ చేయలేవు.

మనకు అందకుండా ఎక్కడో దూరంగా ఉన్నదనిపించే అమ్మ నివాసం ఇక్కడే మనకు అందుబాటులోనే మనలోనే  ఉంది. 
సాధన వల్ల అది అనుభవానికి వస్తుంది. 
నిర్మలమైన మనసే అమ్మవారి అసలైన చిరునామా.
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
(సేకరణ)
💐#శుభమస్తు💐

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..


బిల్వ వృక్షానికి నమస్కరిస్తూ చదువుకోవలసిన శ్లోకం 🙏

బిల్వవృక్ష నమస్తేస్తు సాధన! 
మూలతో భవరూపాయ మధ్యతో మృడరూపిణే!
అగ్రతః శివరూపాయ పతైర్వేదస్స్వరూపిణే!
స్కందే వేదాంతరూపాయ తరురాజాయ తే నమః!! 
నమస్తే బిల్వతరయే భానుసోదరతే నమః! 
శివపూజోద్యతాభీష్ట సాధనాయ నమోనమః!!

🌿 బిల్వవృక్షం మూలంలో శివుడు భవుడు అనే పేరుతోను, - మధ్యంలో మృడ అనే పేరుతోను, - అగ్రము నందు శివ అనే పేరుతోను, - పత్రములందు వేదరూపం గాను, కాండము నందు వేదాంతరూపునిగాను, సూర్యునికి, సోదరస్వరూపము గాను ఉన్నటువంటి బిల్వవృక్షరాజమునకు నమస్కారము అని రెండు చేతులూ దోయిలించి నమస్కరించి ప్రదక్షిణ చేయాలి.


🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏















1, ఆగస్టు 2022, సోమవారం

 బ్రాహ్మణ భోజన ప్రియః 

బ్రాహ్మణులకు భోజనo పెడితే సకల దేవతలు సంతృప్తి చెందుతారట. దీన్నే అందరూ 'బ్రాహ్మణ భోజన ప్రియః' అని అపహాస్యం చేస్తారు. నిజానికి 'బ్రాహ్మణ'బహుజన ప్రియ' అని చాలా మంది ఎరుగరు. అసలు శ్లోకం ఏమిటంటే:

       " అలంకార ప్రియో విష్ణు 

          అభిషేక ప్రియః శివ 

          నమస్కార ప్రియః భాను 

          బ్రాహ్మణ భోజన ప్రియః"

 సాక్షాత్తూ పార్వతి దేవి చెప్పిన శ్లోకమిది. దీని అర్థము ఏమిటంటే "విష్ణువుకు అలంకారమంటే 

ఇష్టం, మరేమో శివునికి అభిషేకమంటే ఇష్టము. సూర్యనారాయణుడికి నమస్కారం ప్రీతి. బ్రాహ్మణునికి భోజనం ఇష్టమని కాదు ఇక్కడ కొశ్చెను, బ్రాహ్మణుడు తృప్తి చెందితే సమస్త దేవతలు సంతుష్టులౌతారట! మరేమో బ్రాహ్మణుడికి నాలుగు రుచికరమైన వంటకాలు వడ్డిస్తే ఆరగించి తృప్తిగా ' అన్నదాతా సుఖీ భవ' అని దీవిస్తాడు. భక్తులు శంకరుడిని కొలిస్తే, శంకరుడు నారాయణుడిని ధ్యానిస్తాడట. నారాయణుడు శివారాధన చేస్తాడట. హరిహరాదులు ఇరువురూ కలిసి 'బ్రాహ్మణుడిని'పూజిస్తారట! ఎందుకంటే బ్రాహ్మణులు గాయత్రి దేవి సత్పాత్ర బిడ్డలని, ముప్పూటలా వెయ్యి గాయత్రి జపం చేసి ఆ గాయత్రి మాతకు పరమాప్తులౌతారని"

      కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెడితే హరి హరాదులు సంతుష్టులై సకల కార్యాలు నెరవేరుతాయన్న మాట. అంతే కాని బ్రాహ్మణులు కడుపునిండా తినికూర్చుని  'బ్రేవ్' మని  త్రేలుస్తారని కాదు.

1. బ్రాహ్మణుడు పేదోడైతే 'కుచేలుడై' శ్రీ కృష్ణ సేవలను అందుకొంటాడు.

2. బ్రాహ్మణుడు అవమానింపబడితే ' చాణక్యుడై' పగ సాధిస్తాడు.

3. బ్రాహ్మణుడు కోపగిస్తే 'పరశురాముడై' గొడ్డలి పట్టి దుష్టులను నరికిపారేస్తాడు.

4. బ్రాహ్మణుడు విద్య నేర్చితే 'ఆర్య భట్టుడై'ప్రపంచానికి 'సున్న'నిస్తాడు. 

5. బ్రాహ్మణుడు వేదనాశనం చూస్తే 'శంకరుడై' వైదిక ధర్మ సంస్థాపన చేస్తాడు.

6. బ్రాహ్మణుడు రోగులను చూస్తే ' చరకుడై' లోకానికి ఆయుర్వేదాన్నిస్తాడు.

బ్రాహ్మణుడు తన జ్ఞానముతో విశ్వానికే పౌరోహితుడౌతాడు .

 ౧. బ్రాహ్మణ ధర్మం 'వేదము'

౨ .బ్రాహ్మణ కర్మ 'గాయత్రి'

౩ . బ్రాహ్మణ జీవనం 'త్యాగం'

౪ .బ్రాహ్మణ మిత్ర 'సుధాముడు'

౫.బ్రాహ్మణ క్రోధం 'పరశురాముడు'

౬ . బ్రాహ్మణ త్యాగం 'దధీచి'ఋషి 

౭ . బ్రాహ్మణ రాజు 'బాజీరావ్ పేష్వే మయూర వర్మ'

౮ . బ్రాహ్మణ ప్రతిజ్ఞ 'చాణక్య శపథం'

౯ . బ్రాహ్మణ బలిదానం 'మంగళ్ పాండే, చంద్ర శేఖర్ ఆజాద్'

౧౦ .బ్రాహ్మణ భక్తి 'రావణుడు'

౧౧ .బ్రాహ్మణ జ్ఞానం 'శంకర రామానుజ మధ్వ' ఆచార్య త్రయం.

౧౨ . బ్రాహ్మణ సమాజ సంస్కర్త 'మహర్షి దయానంద 

౧౩ . బ్రాహ్మణ రాజనీతి 'కౌటిల్యుడు'

౧౪ . బ్రాహ్మణ విజ్ఞానం 'ఆర్య భట్ట'

౧౫ . బ్రాహ్మణ గణితం' రామానుజo'

౧౬ . బ్రాహ్మణ క్రీడాకారులు 'జి ఆర్ విశ్వనాథ్, చంద్రశేఖర్, గవాస్కర్.

ఇదంతా ఎలా సాధ్యమైంది?

కర్మ, భక్తి, జ్ఞాన విజ్ఞానం, ధర్మ,శక్తి, యుక్తి, మూల్య విలువలు, బుద్ధి, కౌశలం, సంస్కార బలంతో,

1. బ్రాహ్మణ జన్మ 'విష్ణాంశ'

2. బ్రాహ్మణ బుద్ధి సకల సమస్యా పరిష్కారం.

3. బ్రాహ్మణ వాణి 'వేద విజ్ఞానం'

4. బ్రాహ్మణ దృష్టి 'సమతా మనోభావం'

5. బ్రాహ్మణ జాతి 'సంకట హరణo'

6. బ్రాహ్మణ కృప 'భవసాగరమును ఈదు సాధనం'

7. బ్రాహ్మణ కర్మ 'సర్వజనహితం'

8. బ్రాహ్మణ వాసం 'దేవాలయం'

9. బ్రాహ్మణ దర్శనం 'సర్వ మంగళ కరం'

10. బ్రాహ్మణ ఆశీర్వాదం 'సమస్త సుఖ వైభవ ప్రాప్తి'

11. బ్రాహ్మణ వరదానం 'మోక్ష ప్రాప్తి'

12. బ్రాహ్మణ అస్త్రం 'శాపం'

13. బ్రాహ్మణ శస్త్రం 'లేఖని'

14. బ్రాహ్మణ దానం 'సమస్త పాప విముక్తి'

15. బ్రాహ్మణ దక్షిణ'సప్త జన్మ పాప విమోచనం'

16. బ్రాహ్మణ ఘర్జన 'సర్వ భూత సంహారం'

17. బ్రాహ్మణ కోపం 'సర్వ నాశనo'

18. బ్రాహ్మణ ఐక్యత ?(అదే డౌటు)'సర్వ శక్తి వంతం!

జయ మహాకాల, జయ పరశురామ, జయగురుదత్త.

దయచేసి నిత్య కర్మానుష్టానము చేసే బ్రాహ్మణులందరూ ఈ సందేశాన్ని పంచుకోండి.


యలో వున్న యీ ఆలయం ప్రాచీనమైనది. 



విష్ణుపాద ఆలయానికి సమీపాన  తూర్పు ముఖంగా వున్నది. 



ఈ ఆలయంలో లెక్కకు

అందని సూర్యనారాయణ

మూర్తి విగ్రహాలు వున్నాయి


.  ఇక్కడ వున్న

సూర్యభగవానుడు , 

గుండె కు కవచాన్ని 

ధరించి సుందరంగా దర్శనమిస్తున్నాడు.



ఆలయ తూర్పు దిశలో

సూర్య గుండ తీర్ధం.

విష్ణు, బ్రహ్మ  ,పరమశివుడు

త్రిమూర్తులతో , సూర్యుడు, దుర్గ విగ్రహాలు యిక్కడ వున్నవి. 


ఇంకా కొన్ని సూర్యభగవానుడి ఆలయాలు గయలోను, గయను చుట్టిన ఊళ్ళలోను వున్నవి.


 ఆదిదేవ! నమస్తుభ్యం - ప్రసీద మమ భాస్కర |

 దివాకర! నమస్తుభ్యం - ప్రభాకర నమోస్తుతే.🙏🙏

[2:28 AM, 7/31/2022] +91 77081 95209: అనాయాసేన మరణం
 వినాదైన్యేన జీవనం.!
దేహన్తేతవ సాన్నిధ్యం
 దేహిమె పార్వతి పతే.!!

హే పార్వతీపతే.! పరమేశ్వరా.!!
హే లక్ష్మీపతే.! నారాయణా.!!

1 - నాకు ఆయాసం లేని మరణాన్ని ప్రసాదించు.!

 వాఖ్య:-  ఎందుకంటే మంచం మీద రోగములతో, మలమూత్రముల రొంపిలో పడి నెలలకొలది సంవత్సరాల కొలది ఉండీ మరణించడం చాలా దుర్భరమైనది.!  భార్యబిడ్డలు ఈసడించుకుంటారు.! బంధుమిత్రులు దగ్గరికిరారు.! అది నేను భరించ లేను.! నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను.! కావున అనాయసమైన మరణాన్ని ప్రసాదించు స్వామీ.!!

2 - దైన్యము లేని జీవనము ప్రసాదించు.!!

వాఖ్య:- నేను కోటీశ్వరుడిని కావాలని కోరుకోడం లేదు.! కూటికి లోటు లేకుండా చూడు చాలు.! నేను ఎవరికీ చేయి చాపకుండా ఉండాలి.! నేనే నలుగురికి ఇచ్చేటట్టుగా ఉండాలి.! నాకు దైన్యమైన జీవితం కాకుండా భాగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించు స్వామీ.!

3 - ఈ దేహం చాలి…
[2:38 AM, 7/31/2022] +91 77081 95209: జగన్మాత – జగత్పిత
      ➖➖➖

“వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”

మహాకవి కాళిదాసు రఘువంశం అనే కావ్యానికి మొదట ఈ మంగళ శ్లోకం రచించాడు. 

జగత్తుకు అనగా ప్రపంచానికి పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులవలె ఉన్నారు, అని ఆ మహాకవి అన్నాడు. 

ఇదేవిధంగా భగవత్ పాదులవారున్నూ 

మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః, బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్.

అని ఒకచోట సెలవిచ్చారు.

ఆవు అనే పదము ఉన్నది. ఇందు రెండు అక్షరాలు ఉన్నవి. ఈ రెండక్షరాలనూ వినంగానే మనస్సులో ఒక రూపం పొడగట్టుతుంది. ఆ పదము నిర్దేశించే వస్తువుయొక్క రూపం జ్ఞప్తికి వస్తుంది. ఈ రెండక్షరాలూ ఒక గుర్తు లేక సంకేతం. ఆవు అనగానే గోవు జ్ఞప్తికి వస్తుంది, లేదా ఆవును చూడంగానే దానికి సంకేతమైన ఆవు అనే మాట మనస్సుకు తట్టుతుంది. వీనికి అవినాభావసంబంధం. అనగా ఒక దానిని మరియొకటి విడనాడని చెలిమి…


[9:25 PM, 7/30/2022] +91 99082 55999: ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ సూర్య నారాయణ మూర్తి యే నమః,,శ్రీ స్వామి వారి ఆశీస్సులు పొంది అందరమూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని శ్రీసూర్యభగవానునిప్రార్ధిద్దాము🙏🪷
[9:25 PM, 7/30/2022] +91 99082 55999: 🙏🏻 జీవితంలో అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు :-* 🙏🏻

 1. BP: 120/80

 2. పల్స్: 70 - 100

 3. ఉష్ణోగ్రత: 36.8 - 37

 4. శ్వాస : 12-16

 5. హిమోగ్లోబిన్:
     పురుషులు -13.50-18
     స్త్రీ - 11.50 - 16

 6. కొలెస్ట్రాల్: 130 - 200

 7. పొటాషియం: 3.50 - 5

 8. సోడియం: 135 - 145

 9. ట్రైగ్లిజరైడ్స్: 220

 10. శరీరంలో రక్తం మొత్తం:
       PCV 30-40%

 11. చక్కెర స్థాయి:
      పిల్లలకు (70-130)
      పెద్దలు: 70 - 115

 12. ఐరన్: 8-15 మి.గ్రా

 13. తెల్ల రక్త కణాలు WBC:
      4000 - 11000

 14. ప్లేట్‌లెట్స్:
      1,50,000 - 4,00,000

 15. ఎర్ర రక్త కణాలు RBC:
      4.50 - 6 మిలియన్లు..

 16. కాల్షియం:
       8.6 - 10.3 mg/dL

 17. విటమిన్ D3:
      20 - 50 ng/ml

18. విటమిన్ B12:
    200 - 900 pg/ml

సీనియర్స్ అంటే 40/ 50/ 60 ఏళ్ల వారికి ప్రత్యేక చిట్కాలు:

1- మొదటి సూచన:
 మీకు దాహం లేదా ఆవశ్యకత అనిపించకపోయినా ఎల్లప్పుడూ నీరు త్రాగండి…, అతి పెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో చాలా వరకు శరీరంలో నీటి కొరత కారణంగా ఉంటాయి. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు త్రాగాలి.

2- రెండవ సూచన:
శరీరం నుండి మరింత ఎక్కువ పని చేయడానికి, శరీరం కదలాలి, నడక లేదా ఈత... లేదా ఏదైనా క్రీడ ద్వారా మాత్రమే.

3- మూడవ సూచన:
 తక్కువ తినండి...
ఎక్కువ ఆహారం కోసం తృష్ణ విడిచిపెట్టండి... ఎందుకంటే ఇది ఎప్పుడూ మంచి ఆరోగ్యాన్ని అందించదు. మిమ్మల్ని మీరు కోల్పోకండి, కానీ మొత్తాన్ని తగ్గించండి. ఎక్కువ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఆధారిత ఆహారాలను ఉపయోగించండి.

 4- నాల్గవ సూచన
 అత్యవసరమైతే తప్ప వీలైనంత వరకు వాహనాన్ని ఉపయోగించకండి... , మీరు ఎక్కడికైనా కిరాణా సామాన్లు తీసుకోవడానికి, ఎవరినైనా కలవడానికి... లేదా ఏదైనా పని కోసం మీ కాళ్లపై నడవడానికి ప్రయత్నించండి. ఎలివేటర్, ఎస్కలేటర్ ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి.

5- ఐదవ సూచన
 కోపం వదలండి...
 చింతించడం మానేయండి... విషయాలను పట్టించుకోకుండా ప్రయత్నించండి...
అవాంతరాలలో చిక్కుకోకండి.... అవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి మరియు ఆత్మ యొక్క వైభవాన్ని దూరం చేస్తాయి. సానుకూల వ్యక్తులతో మాట్లాడండి మరియు వారి మాటలు వినండి!

6- ఆరవ సూచన
 ముందు డబ్బు వదులుకో
మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండండి, నవ్వండి మరియు మాట్లాడండి!
డబ్బు జీవించడం కోసం సంపాదించబడింది, జీవితం డబ్బు కోసం కాదు.

7- ఏడవ సూచన
 మీ గురించి, మీరు సాధించలేనిది లేదా మీరు స్వంతం చేసుకోలేని దేని గురించి జాలిపడకండి.
 దానిని విస్మరించండి మరియు మరచిపోండి.

8- ఎనిమిదవ సూచన
డబ్బు, పదవి, పలుకుబడి, అధికారం, అందం, కులం మరియు ప్రభావం....
ఇవన్నీ మనిషిలో అహంకారాన్ని నింపేవే....
వినయం అనేది ప్రేమతో ప్రజలను మీకు దగ్గర చేస్తుంది.

9- తొమ్మిదవ సూచన
 మీ వెంట్రుకలు తెల్లగా మారినట్లయితే, అది జీవితాంతం అని కాదు. ఇది మెరుగైన జీవితానికి నాంది. ఆశాజనకంగా ఉండండి, జ్ఞాపకశక్తితో జీవించండి, ప్రయాణం చేయండి, ఆనందించండి. ప్రత్యేక జ్ఞాపకాలను చేసుకోండి!

10- పదో సూచన
మీ చిన్నారులను ప్రేమతో, సానుభూతితో కలవండి! వ్యంగ్యంగా ఏమీ అనకండి! మీ ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంచండి!
గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, వర్తమానంలో దాన్ని మరచిపోయి అన్నింటికి కట్టుబడి ఉండండి!

..జై హింద్..












8, ఏప్రిల్ 2018, ఆదివారం

జీవితం లో అనుభవాలు





• నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం.
• నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు, పిల్లలు లేని దంపతుల మధుర స్వప్నం.
• నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా, నీడే లేని వారికి అద్భుత స్వప్నం.
• నీ వద్ద ఉన్న చిరు సంపాదన, చిల్లి గవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం.
• ఆరోగ్యవంతమైన నీ జీవితం, రోగికి అమృతతుల్యమైన స్వప్నం.
• నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం.

👉 నీకు లభించినవాటిపట్ల కృతజ్ఞుతుడవై వుండు. సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావాలతో జీవించు. అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుదుంది. ఇది సత్యం.🙂

25, ఫిబ్రవరి 2018, ఆదివారం

COLLECTIONS OF FB


" సాక్షి మాత్రంగా సంసారజీవనం "
దుకాణానికి వెళతాము. ఒక్కడే యజమాని ఉంటాడు. రాకరకాల వస్త్రాలను గుమాస్తాలు చూపిస్తారు. విసుగు లేకుండా వర్ణిస్తారు . చివరకు ఒక్క వస్త్రం తీసుకుంటాం. బిల్లు ఇస్తారు. చెల్లించిన తరువాత," అయ్యా వెళ్ళండి ఇంకా కొనేవారు వస్తున్నారు చోటివ్వండి" అని అంటారు. ఆమాదిరి మానవుడు కూడా పని అయ్యేవరకూ అంటే వేద విహిత ధర్మం ఆచరించడం కోసం, సుఖలాభం కోసం, పుత్రా మిత్రులయందు, మమకారం ఉండవచ్చు. ఆ పనియ్యాక మమకారాన్ని ఆదరాన్ని వదులుకోవాలి మన ఇల్లు మన తల్లి మన కుక్క అనుకుంటే కుక్క చచ్చిపోయినా బాధ పడతాం. కాబట్టి అంతా ఈశ్వరరూపం అనుకోని తాను సాక్షిగా ఉంటే, క్రమంగా మనస్సు భగవంతుని పై లగ్నమైపోతుంది. బట్టల కొట్టుకు వచ్చిన జనుల మీద, యజమానికి ఎంత ఆదరం ఉందొ, అంతవరకే మనమూ సంసారం మీద ఆదరం పెట్టుకోవాలి. క్రమంగా ఈశ్వరుడు నేను ఒక్కటే అన్న ఐదవరకం భక్తీ మనకు సిద్దిస్తుంది .


------ శ్రీ కంచి పరమాచార్య. (collected from FB OF GRS post on 250218
సూర్య స్తోత్రం !
సంస్కృత వ్యాసభారతంలోని వేయి నామాలు కలిగిన సూర్యసహస్రనామస్తోత్రాన్ని నన్నయ గారు ఆంధ్రమహాభారతంలో కేవలం ఒక లయగ్రాహివృత్తంలో క్లుప్తీకరించి వ్రాసి, ఎల్లరూ నిత్యం పారాయణ చేసేందుకు వీలుగా, అరణ్యపర్వంలో నిక్షేపించారు. సూర్యపారాయణ వల్ల ఆయుర్ వృద్ధి కాగలదని ఆదిత్యహృదయం చెబుతున్నది.

లయగ్రాహి: 
"వారిరుహమిత్రు, నమరోరగ మునిద్యుచరచారణగణ ప్రణుత చారుగణు, లోకా
ధారు, అఖిలశ్రుతిశరీరు హరి, శంకర సరోరుహభవ ప్రతిమున్ దారుణతమిస్రా
వారణ మరీచి పరిపూరిత దిగంతరున్, భూరికరుణానిరతున్, సూరు, త్రిజగద్ర
క్షారతున్, సహస్రకరున్ కోరి భజియింపుము మనోరథఫలంబులగు భూరమణ నీకున్"
ధౌమ్యమహర్షి ధర్మరాజుతో, ఓ మహారాజా, పద్మాలకు మిత్రుడు, దేవతలు, పాములు, మునులు, ఆకాశంలో చరించేవారు, దేవ గాయకులైన చారణులు మొదలైనవారి చేత పూజింపబడేవాడు, సమస్త లోకాలకు ఆధారభూతుడు, సమస్తవేదరూపుడు, విష్ణువుతో, శివుడితో, బ్రహ్మదేవుడితో సమానుడు, ఘోరమైన చిమ్మచీకట్లను తన వేవెలుగులతో పోగొట్టి దిగంతరాలను ప్రకాశింపజేసేవాడు, గొప్ప దయాస్వరూపుడు, విజ్ఞాని, మూడులోకాలను రక్షించటానికి పూనిక గలవాడు, వేయికిరణాలు గలవాడైన సూర్యదేవుని, నీ మనోసిద్ధి కొరకై ప్రార్ధించుము అని చెబుతాడు.collected from FB OF Jajisarma  post on 250218
శివానందలహరి
7 వ శ్లోకం
(25-02-18)
" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:
పైశ్లోకాలలో చెప్పినట్లు శంకరులు తమ బుద్ధి ని శివ భక్తి యందు లగ్నం
చేసి, తమ మనస్సు, వాక్కు మొదలయిన ఇంద్రియాలకు కూడా ఇతర
విషయాలపై ఆసక్తి లేకుండా పరమ శివుని సేవాసక్తిని కల్పింౘుమని
ఈశ్వరుని ఈ శ్లోకంలో ప్రార్థించారు.
శ్లో". మనస్తే పాదాబ్జే - నివసతు వచః స్తోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం - శ్రుతిరపికథాకర్ణనవిధౌ,
తవధ్యానే బుద్ధి - ర్నయనయుగళం మూర్తి విభవే
పరగ్రంథాన్ కైర్వా - పరమశివ ! జానే పరమతః !!
పదవిభాగం:
మనః,తే,పాదాబ్జే - నివసతు - వచః - స్తోత్రఫణితౌ - కరః - - చ -
అభ్యర్చాయామ్ - శ్రుతిః , అపి ,కథాకర్ణనవిధౌ, తవ, ధ్యానే, బుద్ధిః
నయనయుగళం - మూర్తి విభవే - పరగ్రంథాన్ - కైః - వా - పరమశివ -
జానే - పరమ్ - అతః.
తాత్పర్యము:
ఓ పరమశివా ! నామనస్సు నీ పాద పద్మము నందూ, నావాక్కు
నీ స్తోత్రాలు పాఠమునందూ, నా చేయి నీ సేవయందూ , నాచెవి నీ కథలను
వినుటయందూ , నా బుద్ధి నిన్ను ధ్యానింౘుటయందూ, నా కన్నులు నీ
దివ్య మంగళ విగ్రహాన్ని దర్శింౘుటయందూ, లగ్నమై యుండు గాక.
ఈ విధంగా,నామనస్సు, వాక్కు, హస్తము, చెవి, నేత్రము, బుద్ధి అనే
ఇంద్రియాలు ఆరూనూ, నీ సేవా కథాకర్ణన ధ్యాన ము లందే లగ్నములై
యుండగా,నేను ఇంక వేటితో ఇతర గ్రంథాలను తెలుసుకోడానికి
ప్రయత్నిస్తాను ? ఆ ఇతర గ్రంథాలలో సైతం , నీ తత్వమే ప్రతిపాదింప
బడి వుంటుంది. కాబట్టి ఇతర గ్రంథాలను ౘూడవలసిన అవసరమే నాకు
ఉండదని భావము.
వివరణ:
ఆరు ఇంద్రియాలనూ శంకరుని కైంకర్యానికి వినియోగిస్తే , ఇతర గ్రంథాలను
ౘూడవలసిన పనిలేదని శంకరులవారి కృపాభి భాషణం.
భాగవతంలో ప్రహ్లాదుడు కూడా ,మన శరీరం లోని సర్వేంద్రియాలూ
భగవత్సేవలో పాలు పంౘుకోవాలనీ, అప్పుడే అవి సార్థకము లవుతాయనీ
ఇలా చెప్పాడు.సూది లాంటి పర్వతం పై శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం...


భక్తుల రక్షణార్ధం, వారి కోరిక మీద భగవంతుడు అర్చామూర్తిగా అనేక చోట్ల వెలిశాడని అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వరస్వామి వెలిసిన జమలాపురం క్షేత్రం. ఈ ప్రాంతాన్ని ఇదివరకు సూచీగిరి అనేవారు. అంటే సూదిలాగా వున్న పర్వతం. నిటారుగా వుండే ఈ చిన్ని కొండని ఎక్కటానికి చాలా కష్టపడాల్సి వచ్చేదిట. పూర్వం జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారని, ఆయన కోరిక మీద శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ వెలిశాడనీ అంటారు. స్ధల పురాణం ప్రకారం జాబాలి మహర్షి దశరధ మహారాజు కొలువులో గురు స్ధానంలో వున్నారు. ఆయనకి శ్రీరాముడంటే అత్యంత ప్రేమ.



సూది లాంటి పర్వతం పై శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం…

సీ". కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీ నాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
తే" దేవదేవుని చింతించు దినము దినము

క్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి హరిఁ జేరుమనియెడి తండ్రి తండ్రి!!


collected from FB OF munneswara enamundrum  post on 250218

సూది లాంటి పర్వతం పై శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం...
భక్తుల రక్షణార్ధం, వారి కోరిక మీద భగవంతుడు అర్చామూర్తిగా అనేక చోట్ల వెలిశాడని అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వరస్వామి వెలిసిన జమలాపురం క్షేత్రం. ఈ ప్రాంతాన్ని ఇదివరకు సూచీగిరి అనేవారు. అంటే సూదిలాగా వున్న పర్వతం. నిటారుగా వుండే ఈ చిన్ని కొండని ఎక్కటానికి చాలా కష్టపడాల్సి వచ్చేదిట. పూర్వం జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారని, ఆయన కోరిక మీద శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ వెలిశాడనీ అంటారు. స్ధల పురాణం ప్రకారం జాబాలి మహర్షి దశరధ మహారాజు కొలువులో గురు స్ధానంలో వున్నారు. ఆయనకి శ్రీరాముడంటే అత్యంత ప్రేమ.
collected from FB OF OUR CULTURE AND TRADITION post on 250218

తస్మై శ్రీ గురవే నమః పూజ్యగురుదేవులు షణ్ముఖుల భాగవత ప్రవచన మకరందాలు 24 th ఫిబ్రవరి.
దేవకీ వసుదేవలకు కృష్ణుడు బ్రహము మరియు పుత్రుడు అనే భావం,నంద యశోద లకు మాత్రం పుత్రుడనే భావం మాత్రమే.ఇరువురూ ముక్తి పొందారు.
భాగవత శైలి యోగశైలి.నందయశోదలు మొత్తం వ్రేపల్లె వారు కృష్ణుని మన వాడు అనుకోని ముక్తిని పొందారు.
ఒకసారి నందుడు మధుర కు కప్పం కట్టడానికి వెళ్లారు.అక్కడ ఆయన వచ్చారని తెలిసి వసుదేవుడు కలిశారు వీరు ఇరువురూ మంచి స్నేహబంధవ్యాలు ఉన్నవారు ఆనందం తో నీకు కుమారుడు కలిగాడు ట కదా అని నందుణ్ణి అడుగారు.అవును నాకు మంగళమే. నీ వార్తలు విన్నాను నీ సంతానం మొత్తము గతించారు అని కడపటి గా ఆడశిశువు కూడా పోయింది అని దిగులు పడకు ప్రారభ్డాలు ఇవన్నీ అని నందుడు అంటుంటే బయటపడకుండా వసుదేవుడు విన్నాడు.నా పిల్లాడు రోహిణీ ఎలా ఉన్నారు అని అడిగితే బాగున్నారు అని నందుడు అన్నారు .వెంటనే నందుడు నువ్వు బాధ పడకు నా సంతానం మన అందరికే సంతానమే అన్నాడు. ఇక్కడి నుంచి మీరు తొందరగా వెళ్లిపోవాలని దుష్ట శక్తులు ని కంసుడు అన్ని ప్రాంతాల్లో పంపాడు అని చెప్తాడు వసుదేవుడు.
సరే అని నందుడు బయలుదేరారు ఆయన వెళ్ళేటప్పటికే అక్కడ ఘోరం జరిగింది ఇది కృష్ణలీలల్లో మొదటి లీల
పూతన పిల్లల్ని హతమార్చే ఒకానొక దుష్టశక్తి ఈవిడ కి బాలఘాతిని అని పేరు.ఈవిడ ఇప్పటికే చాలా మంది పిల్లలుని భక్షించింది. కానీ శ్రీకృష్ణుని దగ్గరకు మాత్రం రూపం మార్చుకుని వెళ్ళింది ఎలా అంటే భగవంతుడు దగ్గరకు వెళ్ళినప్పుడు మడి కట్టుకున్నట్లు.అందంగా తయారయ్యింది అన్ని ఇళ్లు వెతుక్కుంటూ వెళ్తోంది.నన్దవ్రజం వారు కూడా ఈమె ఎవరో కొత్తఆవిడ లా ఉండే అనుకుంటున్నారు.సరిగ్గా కృష్ణ గృహానికి వచ్చేటప్పటికి నాదం లా ఏడ్చారు శ్రీకృష్ణులవారు.
నందగృహమున బాలుని నాద మొకటి
విని ప్రమోదించి సుందరీవేష
యగుచు.
ఆమె ను చూడంగానే బాలికలను మట్టుపెట్టే ఒకానొక దుష్టశక్తి లా గ్రహించారు.నిద్రిస్తున్నట్లు నటిస్తున్న పిల్లవాడిని ఉయ్యాలలో తీసి ఒళ్ళో పెట్టుకుంది.చక్కగా అలంకరించుకున్న ఆమె ఎవరా అని ఆలోచించే లోపలే స్తన్యం ఇవ్వడం మొదలు పెట్టింది.ఆ స్తన్యం తో పాటుగా ఆమె ప్రాణాలు కూడా తాగటము మొదలు పెట్టారు.ఆ పాలు తాగే విధానం ఎలా అంటే ఆమె శరీరంలో నాడులన్ని లాగపడుతున్నాయి.అది తట్టుకోలేక ఆమె అసలు శరీరం గ్రహించింది.యోజనమ్మున్నర శరీరం గల ఆమె పడిపోయే సరికి అనేక వృక్షాలు పైన పడిపోయింది ఆ చప్పుడు కి అందరూ వచ్చారు.రోహిణీ, యశోద లు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో అని ఆందోళన పడి వచ్చేటప్పటికి ఆమె పైన ఆడుకుంటూ కనిపించారు.అమ్మయ్య అనుకోని యశోద.ఎత్తుకొని ఉన్న కృష్ణునికి గండం గడిచింది అని దిష్తి తీసి నారాయణ లీల అనుకుంటున్నారు.
ఈ దిష్తి తీసే సందర్భంగా 8 శ్లోకాలు వస్తాయి మంత్ర సమానమయినవి. అవి పిల్లలకు తీసేటప్పుడు చదివితే మంచిది.ఆ నామాలు రక్షించుగాక అంటారు నారాయణ భట్టాద్రి.
*కృష్ణుడు విషాన్ని పుచ్చుకున్న లీలలు వింటే మన బాధలు పోతాయి*
ఈ విధంగా స్వామి కి గోవు తోక తో ను ,గోమాత గిట్టల వల్ల వచ్చే ధూళి తో,గోమూత్రం తో,గోవు పీడకల ను కాల్చినప్పుడు వచ్చే భస్మం తో దిష్తి తీశారు.
గోభక్తుడు గోవిందుని అనుగ్రహానికి పాత్రుడు.
ఈ నామాలు చెప్తూ తీశారు
*ఇవి విష్ణు నామ మంత్రరాసి.

పుట్టుక లేని శ్రీహరి నీ పాదాలు రక్షించు గాక
కౌస్తుభదారి నీ మోకాళ్ళు రక్షించు గాక
యజ్ఞరూపుడు నీ వూరువులు రక్షించు గాక
అచ్యుతుడు నీ నడుము ను రక్షించు గాక
హాయగ్రీవుడు నీ ఉదరాన్ని రక్షించు గాక
సర్వశక్తి మంతు డైన శ్రీహరి నీ హృదయాన్ని రక్షించు గాక
సర్వాతర్యామీ నీ వకఃస్థలం ని రక్షించు గాక
సూర్యరూపుడైన నారాయణస్వామి నీ కంఠాన్ని రక్షించు గాక
సర్వవ్యాపాకమైన విష్ణువు నీ చేతులు రక్షించు గాక
త్రివిక్రముడు నీ నోటి ని రక్షించు గాక
సర్వనియామకుడు నీ శిరస్సు ను రక్షించు గాక
చక్రపాణి నీ ముందు రక్షించు గాక
గదాదారి నీ వెనుక రక్షించు గాక
ధనుర్ధారి మధుసూదనుడు ఒక పక్క నిన్ను రక్షించు గాక
ఖడ్గము పట్టుకున్న విష్ణువు మరోపక్క రక్షించు గాక
శంకదారి అయిన శ్రీహరి దిక్కులమూలలలో నిన్ను రక్షించు గాక
వామనుడు పైన రక్షించు గాక
గరుడవాహనుడు అయిన హరి నిన్ను నెల పై రక్షించు గాక
పరిపూర్ణుడయిన హరి నిన్ను సర్వత్రా రక్షించు గాక
ఆడుకుంటున్న నిన్ను గోవిందుడు రక్షించు గాక
నిద్రిస్తున్న నిన్ను మాధవుడు రక్షించు గాక
పరిగెడుతున్న నిన్ను వైకుంఠవాసి రక్షించు గాక
కూర్చున్న నిన్ను శ్రీయహ్పతి రక్షించు గాక
తింటున్న నిన్ను యజ్ఞభోక్త రక్షించు గాక

సర్వాగ్రహ భయంకరుడైన నారాయణ స్వామి నిన్ను ఎల్లవేళలా రక్షించు గాక
ఒకటి నుంచి 14 దాకా వచ్చే బాల బాధల్ని బాలాగ్రహదోషములంటారు
*బడికి పంపే పిల్లలకు విష్ణు నామాలు చెప్పించండి వారి బ్రతుకులు బాగుపడతాయి*
ఇలా అందరూ దిష్టి తీసి కవచ భావన చేశారు.ఈ లోపల నందుడు వచ్చి వసుదేవుడు చెప్పింది నిజమే ఆయన కి గొప్ప శక్తులు వచ్చ్హాఏమో అనుకున్నాడు
ఇప్పుడు సమస్య అంత పెద్ద శరీరం ఎక్కడ తగలెయ్యాలి అనుకోని చివరికి గొడ్డళ్లతో ఆ శరీరాన్ని నరికి అన్ని కలిపి దహనం చేశారు.ఆశ్చర్యం గా సుగంధద్రవ్యాల వాసనలు ఆ శరీరం నుంచి వస్తున్నాయి.ఎందుకంటే శరీరం పవిత్రమైపోయింది.స్వామి స్పర్శ మాత్రము చేత ఆ పూతన పాపము మొత్తం పోయింది.చిన్నికృష్ణ పాదాలు చేతులు తగిలాయి.
లోకం లో ఎవరికి నమస్కారం చేస్తారో వారు నమస్కరించే పాదాలు.అవి ఎప్పుడు భక్తుల హృదయాల్లో ఎప్పుడూ చెక్కు చెదరకుండా వుంటాయి.
అలాంటి స్వామి కి స్తన్యమిచ్చిన తల్లు ఎంత సద్గతి పొందుతుందో ఆ రాక్షసి కూడా సద్గతి పొందుతుంది
ఇదంతా విష్ణు అనుగ్రహం అని ఎవరి పనిలో వారు వుంటున్నారు.
కృష్ణ లీలలు ఇంకా చెప్పమని పరీక్షిన్మహారాజు శుకయోగేంద్రుడు ని అడుగగా
ఒక రోజు కృష్ణుడు బోర్లపడినప్పుడు జరిగేటప్పుడు జరిగే వేడుక చేస్తున్నారు.అన్నీ చెయ్యాల్సినవి చేసి ఉయ్యాల లో పడుకోబెట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.ఆ ఉయ్యాల కి దగ్గరలో బరువైన పదార్థాలు కల బండి ఉంది.తనమెత్తనైన బుజ్జిపాదాల తో ఆ బండి ని తన్నారు.పెద్దపెద్ద పాత్రలు ఇతరము ల తో ఉంది ఆ బండి.ఇటు వచ్చిన వారి అతిధి సత్కారాలు తో ఉన్ననందుడు మొదలు వారు ఆ చప్పుడు వినంగానే వచ్చి పిల్లాడికి ఏమైందో చూస్తున్నారు.అమ్మయ్య ఇంకో గండం గడిచింది పిల్లాడికి ఏమి అవ్వలేదు అనుకుంటూ ఉంటే అక్కడ ఉన్న పిల్లలు మాకు తెలుసు ఏమి అయిందో కృష్ణుడే ఆ బండి ని తన్నాడు అని చెప్పారు.
పిల్లలు కదా చిన్నదాన్ని పెద్దింతలు గా చెప్తారు వాడు అలా ఎలా చేస్తాడు లే అని యశోదా దేవి వాళ్ళు అనుకున్నారు.

శా. బాలుండెక్కడ ? బండి యెక్కడ ? నభోభాగంబుపై( జేడ్పడం
గాలం దన్నుట యెక్క ? డ

ఇంతలో స్వామి ఏడవడం మొదలు పెట్టారు.అప్పుడు యశోదా దేవి
అలసితివి కదన్న! యా కొంటివి కదన్న మంచి అన్న! ఏడ్పు మనుమన్న అని ఆమె స్తన్యమిచ్చినది ఏమి ఎరగనట్లే వున్నాడు పిల్లవాడు.
ఒకసారి యశోద కృష్ణుని ఒళ్ళో పెట్టుకొని ఆడిస్తో౦ది.
ఒక్కసారిగా బరువు అయిపోయాడు.పర్వత బరువులా ఉన్న స్వామి ని కింద పరుపు మీద పడుకోబెట్టినది యశోదా. అప్పుడు సుడిగాలి ఒకళ్లకు ఒకళ్ళు కనపడనంత గా దుమ్ము తో.గాలి తెరిపికి రాంగానే పిల్లాడు కనపడపోయే సరికి అందరూ ఆందోళన తో గాలి పిల్లాన్ని ఎక్కడికి అయినా తీసుకెళ్లిందేమో అని అనుకుంటుండగా పెద్ద శబ్దం వచ్చింది.అక్కడ కి వెళ్ళ౦గానే పెద్దరాయి మీద రాక్షసుడు శవం ఉంది.త్రునావృత్తుడనే రాక్షసుడు సుడిగాలి రూపం లో వచ్చి పిల్లాణ్ణి తీసుకెల్దామనుకుంటే గట్టి గా మెడ పట్టుకొని ఆ రాక్షసుడు ని స్వామి ఉంటే ఆ బరువు కు ఆ రాక్షసుడు కింద పడిపోయాడు.గరిమ సిద్ధి ఇది
ఎప్పుడయితే అతని ప్రాణాలు పోయాయో అతను ది పెద్ద శరీరం పక్కన స్వామి చిన్న గా ఇక్కడ నారాయణ భట్టాద్రి ఒక నల్లని కొండ మీద నీలమణి ని ఎలా తీసారో అలా స్వామి ని తీశారు అని వర్ణించారు.అమ్మయ్య మృత్యువు నుంచి బయటపడ్డాడు అని అందరూ అనుకున్నారు.
ఇప్పటి వరకు మూడు అసురసంహార లీలలు అయ్యాయి.
ఒక్కసారి స్వామి కి పాలు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆవాలిస్తాడు అప్పుడు ఆ నోటి లో సమస్త బ్రహ్మాన్దాలు గోచరించాయి ఇది బ్రమ అనుకుంది.యశోదమ్మ.
కృష్ణుని విశ్వరూపావతారం
పరిమితము గా ఉండటం ఆయన యోగమాయ.అపరిమితము గా ఉండడం ఆయన విశ్వరూపం.పరిమితము గా ఉన్న అపరిమితమును ఎప్పుడు తగ్గించలేదు.అర్జునునికి విశ్వరూపం చూపించినప్పుడు కూడా నీ దృష్టి ని మార్చుకో అని అన్నారు.భగవంతుడు రూపు మార్చుకోలేదు చూసే వాడి చూపు మార్చారు.
వసుదేవుడు గర్గుని ని నామకరణ సంస్కారం చెయ్యమని నన్దవ్రజానికి పంపారు.గర్గభాగవతము కూడా చాలా బాగుంటుంది.
బాలుడయి ఉన్న ఆ పరంజ్యోతి ఎక్కడ ఉన్నాడో అని వెతుక్కుంటూ వస్తున్నారు.నందుడు ఆయన రాకకు సంతోషించి మీరు జ్యోతిష్యం లో మీరు దిట్ట మా పిల్లలకు నామకరణం చేయండి అని అడిగాడు.పేరు పెట్టాలి అనే సంకల్పం పెట్టించుకోవాలనే స్వామి దే.
ఆడుకుంటున్న పిల్లల్లో నల్లనయ్య ను ఎత్తుకొని ముద్దులాడుతుంటే నందుడు పేరు పెట్టాలి అని గుర్తుచేసాడు. వసుదేవుడు కూడా నన్దవ్రజం లొనే పేరు పెడితే మంచిది అన్నట్లు గర్గునకు చెప్పి పంపుతాడు.
పేరు పెట్టేముందు ఇలా అబతున్నాడు.ఇతడు తెలుపు,ఎరుపు,పసుపు వర్ణాలు తో పూర్వము వున్నాడు ఇప్పుడు నల్లని వర్ణము తో వున్నాడు.
*కలియుగము లో తరింపిజేటానికి కృష్ణావతము లో వస్తున్నారు*
మీ అబ్బాయి కి అనేకనామాలు అనేక రూపాలు ఉంటాయి.అవి నాకు తెలుసు.
నామార్థవిచారణ చేస్తే ఇది అంతా పరబ్రహ్మ కు తెలిసిన నామమే అని తెలిసి మనకు బ్రహ్మ జ్ఞానం నామస్మరణ వల్ల జరుగుతుంది.

అనేక నామాలు గల తనకి ఏ పేరు కావాలో స్ఫురింప చేశారు.వెంటనే కృష్ణా అని నామకరణం చేశారు గర్గ్లుల వారు.
కృష్ణా అంటే సచ్చిదానంద స్వరూపం.

కృష్ణా అంటే తనవైపుకు లాగేవాడు.అంటే తనవైపుకి ఆకర్షించే వాడు ఎలా అంటే ఆకర్షింపబడే వాడు మళ్ళీ బైటకి రాలేడు అంటే ముక్తి పొందుతాడు.
కర్షకుడు పని చెయ్యాలంటే ముందు కలుపుమొక్కలు లాగేస్తాడు.తర్వాత పండిస్తాడు.
మన దగ్గర నిస్సారవంతమైన ఒక పంట ఇంకోటి బండతనం,కలుపుమొక్కలు.వాటిని తీసేసి మృదువు చేసి అప్పుడు పంటపండించాలి.ఇలాంటి పంట మనలో ఉంటే ముందు బండతన్నాన్ని తీసేసి,కలుపు మొక్కలు ఏరి,జ్ఞాన బీజాలు వేసి బ్రతుకు ను పండిస్తాడు.

కృష్ణుడు అంటే కాల స్వరూపుడు.
కోట్లకొలది విష్ణు నామాలు పలికితే ఎంత పుణ్యమో కృష్ణ అని ఒకసారి పలికితే అంత పుణ్యం.
*మంత్రశాస్త్ర నామాల్లో ముఖ్యమైనది శ్రీకృష్ణశరణం మమ*

నారాయణుని ఆశ్రయించిన వారిని,దేవతల్ని ఆసురులు ఏమి చెయ్యలేకపోయారు ఎలాగో ఈ కృష్ణపరమాత్మ పై ఎవరు ప్రీతి పొందుతారో వారిని ఎవరూ బాధించలేరు.
కృష్ణ స్వామి పెద్దవాడు అవుతున్నారు.
తల్లులకి కూడా ఒక చోట ఉండకుండా అడవుల్లోకి ,వీధుల్లోకి వెళ్లిపోతున్నాడు
ఇప్పుడు తోటిపిల్లల తోఆడుకునే వయస్సు వచ్చింది.వెన్న మీగడలు దొంగిలించి తమతో పాటుగా కోతులకి కూడా పంచుతున్నాడు
ఒకసారి గోపకాంతలు కృష్ణుడు అల్లరి తట్టుకోలేక వాళ్ళమ్మ గారి దగ్గరకు వెళ్లారు.బాగా అల్లర్జ్ చేస్తున్నాడు అని. ఆవిడ నవ్వి ఊరుకుంది.ఏంటి నవ్వు
తున్నావు మా ఇంట్లో పాలు ,వెన్న దొంగిలిస్తు౦టే అంటే నేనెలానమ్మను అంది యశోదా.పోనీ వచ్చాడే అనుకోండి పిల్లలకి అందేట్లు ఎట్లా పెడుతున్నారు అని
మళ్ళీ అన్నమయ్య ప్రస్తావన
|| కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని ||

చ|| బాయిట బారవేసిన పాలు వెన్నలును | చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు |
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక | పాయక దూరేరేల ప్రతిలేని బిడ్డను 

ఇలా కృష్ణలీలలు కొన్ని చెప్పారు.
ఒకసారి బలరాముడు వచ్చి అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అని అంటే కృష్ణుని యశోద. ఎందుకు తిన్నావని నిలదీయగా అప్పుడు కృష్ణుడు
అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాఁ కొంటినో వెఱ్ఱినో
నమ్మంజూడకు వీరి మాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ

రిమ్మాగ్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీ యాస్య గం
ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.!

వీళ్ళందరి మాటలు న మ్మద్దని కృష్ణుడంటే నోరు తెరవమని అమ్మ అంటే నోరు తెరిచాడు.
స్వామి నోటిలో ఉన్న భువనభణ్డంములు చూసింది మహాయోగి కి లభించాల్సిన యోగం లభించింది.బ్రహ్మని ఒకే రకమైన స్థితి లో ఉంది యశోదా దేవికి.యశోదా దేవి స్తోత్రం చేస్తుంది.ఆమె కి విశ్వరూప దర్శనమయ్యింది.ఆ నోట్లో అన్ని చూసినప్పుడే ఆమె కి పరిస్థితి అర్ధం అయ్యింది.వెంటనే ఆమె కు మళ్ళీ మాయ ఆవహింపచేశారు కృష్ణ స్వామి.సత్యాన్ని తట్టుకొనే స్థితి రావాలి కదా ఆమె కు.మళ్ళీ పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకొని లాలించడం మొదలు పెట్టింది.
ఇది విన్న పరీక్షిన్మహారాజు భాష్పములతో బ్రహ్మము ను ఒళ్ళో పెట్టుకుంది ఏమి చేసింది అయ్యా అని అంటే
వసువుల్లోఒకడైన ద్రోణుడు, ఆయన భార్య ధరా వారిని భూలోకానికి వెళ్ళండి అని బ్రహ్మ అంటే పరమాత్మ ని తల్లిదండ్రులు గా లాలించే భాగ్యం వస్తే మేము భూలోకానికి వెళ్తాము అన్నారు ట .మీకు ఆ భాగ్యం లభిస్తుంది అని అన్నారు ట వాళ్ళే నంద,యశోద లు.
రేపు ఇంకా ఎన్ని లీలలు చూపిస్తారో కృష్ణుడు అని అంటూ గురువు గారు ప్రవచనము ముగించారు.
సర్వము శ్రీ గురుచరణారవిందార్పణ మస్తూ

collected from blog of samavedam shanmukha sarma post on 250218

తస్మై శ్రీ గురవే నమః పూజ్యగురుదేవులు షణ్ముఖుల భాగవత ప్రవచన మకరందాలు 23 rd ఫిబ్రవరి.
*ఈ కలి లో జీవులకు ఒకే ఒక దిక్కు కృష్ణకధ .దానివల్ల మనం తరించగలం*
కృష్ణావతార లక్ష్యం ఏమిటి ఈ అవతారం ఒక లక్ష్యం తో రాలేదు .అనేక లక్ష్యాల సమాహారం అయిన పరిపూర్ణ అవతారం.
భూమి గర్వించి రాజుల రూపంలో ఉన్న రాక్షసుల యొక్క భారాన్ని తట్టుకోలేకపోయింది.బ్రహ్మ తో భూదేవి అధర్మాన్ని భరించలేను అని చెప్పగా బ్రహ్మ,రుద్రాది దేవతలు క్షీరసాగరం దగ్గరకు వెళ్ళి ప్రార్ధించారు.జగన్నాథుని పురుషసూక్తం మంత్రముల తో స్తుతించారు.బ్రహ్మ స్తుతించి సమాధిస్థితి కి వెళ్లారు.ఆ స్థితిలో నారాయణ వచనం వినపడింది.ఆ వచనాన్ని దేవతలందరికీ చెప్తున్నారు బ్రహ్మదేముడు.భూదేవి ఎందుకు వచ్చింది అన్నవిషయం నారాయణునికి ముందే తెలుసు.ఇప్పుడు ఆయన జగతి ని ఉద్ధరించడానికి ఉద్భవిస్తున్నారు.నారాయణ స్వామి పుట్టే యదువంశం లో దేవతలు కూడా భిన్న భిన్న అంశలు పుట్టాలి.నారాయణుడు వసుదేవ గృహం లో అవతరిస్తారు.ఆ విషయం తో భూమాత సంతోషిస్తుంది.బ్రహ్మ కూడా తన నెలవుకు వెళ్తారు.
యాదవులకు రాజధాని మధుర.ఇది మోక్షపట్టణం ఎందుకంటే నారాయణుడు నిత్య సన్నిహితుడు కనుక.నారాయణ స్వామి అవతరించె ముందు కూడా హరిధామం మరియ మోక్ష ధామం.
*కంచీ, అయోధ్యా ,మధుర , మాయా ,కాశీ , అవంతికా , ఇవి నగరములు మరియు మోక్షపట్టణములు*
ఆ మధుర లో సూరసేనుని పుత్రుడు వసుదేవుడు.ఆయన దేవకుని కుమార్తె దేవకి ని వివాహమాడాడు.దేవకుని సోదరుడు ఉగ్రసేనుడి పుత్రుడు కంసుడు.తను స్వయంగా రధం నడుపుతూ ఒక ఆకాశవాణీ వినపడింది.
ఓ అవివేకి ఎవరి అష్టమ గర్భ సంతానం వల్ల నీకు చావు రాసిపెట్టి ఉందొ ఆమె ను కూర్చోబెట్టి రథాన్ని తోలుతున్నావు.అది విన్నవెంటనే ఆమెను జుట్టు పట్టుకుని ఖడ్గం తో చంపబోతుంటే వసుదేవుడు కంసుడు తో చూసావా ఆ అమ్మాయి ని ఇప్పుడే పెళ్లి అయ్యింది .పెళ్లి పచ్చదనం ఆ శరీరంలో కనపడుతోంది.
వావిఁ జెల్లెలు గాని పుత్రికవంటి దుత్తమురాలు; సం
భావనీయచరిత్ర; భీరువు; బాల; నూత్నవివాహ సు
శ్రీవిలాసిని; దీన; కంపితచిత్త; నీ కిదె మ్రొక్కెదన్;
కావవే; కరుణామయాత్మక; కంస! మానవవల్లభా
నీకు ఈమె వల్ల మరణం అని ఆకాశ వాణి చెప్పలేదు.అష్ఠ్డ సంతానం వల్ల కదా అందుకని తొలిచూలు నుంచి సంతానం ని నీకప్పజెప్తాము అని అనగానే ఇది ఔచిత్యం గానే ఉందని విడిచి పెట్టి ఎవరి మానాన వాళ్ళువుంటుండగా ప్రధమ సంతానాన్ని వసుదేవుడు కంసునికి ఇచ్చారు సత్యనీతి గల ఉత్తముడు.ఆ సత్యనిష్ఠ కి కంసుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈయన పుట్టినప్పుడు దేవతలు కుసుమవృష్తీ కురిపించారు ఎందుకంటే నారాయణ స్వామి ఈయన కి సంతానం అవుతారని.
సమత్వం,సత్యానిష్ఠఉన్న వాడు వసుదేవుడు. ఆతని సత్యానిష్ఠ కి ఆశ్చర్య పోయి పెద్దగా నవ్వి ఆ అబ్బాయి ని ఇచ్చి నాకు 8 వ సంతానం వల్ల కదా తీసుకో అని
ఇక్కడ నారాయణ భట్టాద్రి దుష్థానామపి ధీర అంటే దుష్టులకు కూడా అప్పుడప్పుడు కరుణ వస్తుంటుంది.
ఆరుగురు మేనల్లుళ్ల తో ఆడుకుంటూ హాయిగా ఉంటున్న కంసుడు దగ్గరకు నారదుడు వచ్చి నందవ్రజం లో అందరూ దేవాంశ సంభూతులు ట అందులో నీ ఆరుగురు మేనల్లుళ్లు కూడా ట.మీరు రాక్షసులు .వాళ్ళందరూ నిన్ను మట్టుపెట్టడానికి ప్రణాళికలు వేస్తున్నారు.నీవాళ్లందరూ రాక్షస సంభూతులు వాళ్ళందరూ దేవాంశసంభూతులు.ఆ మాట వినంగానే వెంటనే ఉగ్రసేనుణ్ణి బంధించి తాను రాజు అయ్యాడు.యాదవులను మట్టుపెట్టసాగాడు.
యాదవ,భోజ,అందక వంశీయుల రాజ్యాలకు ప్రభువు అయ్యాడు.అప్పుడు దేవకి ని వసుదేవుని చెరసాలలో బందించాడు.అంతే కాదు తన ఆరుగురు మేనల్లుళ్లను నిర్దయగా సంహరించాడు.

నారాయణ స్వామి తనదయిన ప్రణాళిక మొదలు పెట్టారు.మాయ ని పిలిచి నా అంశ అయిన ఆదిశేషుడు దేవకి గర్భం లో సప్తమ గర్భం గా వున్నాడు ఆ తేజాన్ని జాగ్రత్తగా తీసి వ్రజం లో ఉన్న వసుదేవ పత్నుల్లో ఒకరైన రోహిణి దేవి గర్భం లో ప్రవేశపెట్టాలి.ఇంకోటి నువ్వు యశోద గర్భం లో ఉద్భవించాలి.అదే సమయంలో నేను దేవకి గర్భం లో ఉద్భవిస్తాను.
నువ్వు నా సోదరివి యోగమాయ *పద్మనాభ సహోదరి*నిన్ను అందరూ కొలుస్తుంటారు.నీకు అనేక శక్తి పీఠాలు ఉంటాయి.నీ దివ్య నామాలు కొన్ని ఉన్నాయి *ఇవి స్మరించే వారిని నువ్వు కాపాడతావు దుర్గేతి భద్రకాలెతి,విజయా విష్ణావేతి చ కుముదా చండికా కృష్ణా మాధవి కన్యకేతిచ మాయ నారాయనీ,ఈశాని శారదేతి అంబికేతి చ*

ఇలా చెప్పారు ప్రణాళిక జరిగింది.యోగమాయ రోహిణి గర్భాన ఆ గర్భాన్ని ప్రవేశ పెట్టింది.కంసుని ఆక్రమణ లో చెల్లాచెదురు అయిన వాళ్లలో రోహిణి ఒకరు.అందరూ దేవకి కి గర్భవిచ్చిన్నం అయింది అనుకున్నారు.తర్వాత కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చింది డేవదేవుని గర్భం లోమొస్తోంది కనుక తేజస్సు తో మెరిసి పోతూఉంది .అది చూసి కంసుడు కూడా భయపడ్డారు.ఆయనకు సింహం ప్రవేశించిన గుహ ని చూస్తున్నట్లు గా అనిపిస్తోంది.ఆయన నిద్ర లేని వాడు లా ఉంటున్నాడు.అష్టమ గర్భం అని విష్ణువు అని ఆలోచనలతో .ఏ పని చేస్తున్న ప్రపంచం విష్ణుమయం గా కనపడుతోంది.
అంతన బ్రహ్మాది దేవతలు చెరసాలలో వచ్చి గర్భం లో ఉన్న స్వామి ని చూడడానికి విచ్చేశారు .బ్రహ్మా గారు స్తుతి చేశారు అది అవతార స్తుతి .
*దేవకి గర్భ గుడి లో ఉన్న కృషునకు నమస్కారం చేశారు*

*సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం
సత్యస్య యోనిం నిహితంచ సత్యే
సత్యస్య సత్యమ్‌ ఋత సత్య నేత్రం
సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాహ*
సత్యనారాయణ రూపం ఉన్న మహిమాన్వితమైన స్తుతి.
ఆయన్ని పొందటానికి మార్గం సత్యమే.సత్యమే గొప్ప ప్రాప్తి గా కలవాడు.నిష్కపటత్వమే సత్యం.మూడు కాలాల్లోను ఏ మార్పు లేని వాడు.సత్యమునకు కారణమైనటువంటి వాడు.అనగా పంచభూతాలకు కారణమైనటు వంటి వాడు.వీటికంటే పరమార్థ స్వరూపంగా ఉన్నటువంటి వాడు.ఈ వర్ణించిన సత్యమే తన ఆత్మ రూపం గా గల్గిన వాడు.అటువంటి నిన్ను శరణువేడుతున్నామయ్యా..
ఈ శ్లోకంలో ఆయన్నగురించి ఆయన్ని పొందటానికి కావాల్సినవి చెప్పిన బ్రహ్మదేమునకు నమస్కారం.
ఇది నిత్యపారాయణ యోగ్యం అయిన శ్లోకం.
నీ అవతారం సత్పురుషులకు ఆనందం కలుగజేస్తుంది.
దుర్మార్గులకు అమంగళము కలుగజేయును.
*ఇప్పుడు కూడా ఆ అవతారం సత్పురుషులకి ఆనందం దుర్మార్గులకు అమంగళం కలుగజేస్తుంది*
నీ అవతార మూర్తి పాదాలు ఎవరు ఆశ్రయిస్తారో వారు సంసార బాధలనుండి విముక్తి పొందుతారు.
ఈ సంసారాన్ని దూడ కాలిగిట్ట ఎంత ఉందో ఆ మేర దాటేస్తారు.
*ప్రకృతి కి లొంగిన జన్మలు జీవుడివి .ప్రకృతి ని లొంగదీసుకున్నజన్మ ఈశ్వరావతారం*
మాయాకాలాలకు లొంగిపోని ఈశ్వర అవతారం నువ్వు.ఆ అవతారాలకు నమస్కరిస్తున్నాను.అని బ్రహ్మ స్తుతి చేశారు.అలా అదృశ్య దేహాలతో దేవతలు నమస్కరించి స్తుతించి వాళ్ళు వెళ్లిపోయారు.
ఇంక సమయం సమీపించినది. శ్రావణబహుళ అష్ఠమి.అర్ధరాత్రి సమయం ఒక్కసారి వాతావరణ మార్పు ప్రకృతి నిర్మలం గా ఉంది.అప్పుడే కాదు శ్రద్హ పెడితే మన హృదయం లో అవతరిస్తాడు.దుష్టుల్ని శిక్షించి శిష్టులను రక్షిస్తాడు.
సంభవామి యుగే యుగే..
మళ్ళీ త్యాగరాజు ప్రస్తావన
ఎవరీకయ్య ఈ అవతారము.
మంగళకరమైన కాలము వచ్చింది.పుట్టుక లేని వాడి పుట్టిన నక్షత్రం అంటే బ్రహ్మ అధిష్ఠాన దేవత గా ఉన్న రోహిణీ నక్షత్రం.దిక్కులు ప్రసన్నమైపోయాయి.గగనం నిర్మలం గా ఉంది.సమస్త ప్రాణకోటి అపరిమితమైన ఆనందం తో ఉన్నాయి.సరస్సు లో కలువాలు వికసించినాయి.తుమ్మెదలు విహరిస్తున్నాయి.ఆ సమయంలో అగ్నిహోత్ర గృహాల్లో యజ్ఞఅగ్నిలు చక్కగా ప్రకాశిస్తూఉన్నాయి.ఒక్క రాక్షసులకు మాత్రం ఎదో తెలియని దిగులు గా ఉంది.అప్సరస నాట్యాలు,కిన్నెర గానాలు,దేవతలు మునులు పుష్పవానలు కురిపిస్తుంటే,మేఘాలు మంగళవాయిద్యాలు గా గర్జిస్తుంటే

స్వచ్ఛంబులై పొంగె జలరాసు లేడును;
గలఘోషణముల మేఘంబు లుఱిమె;
గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె;
దిక్కులు మిక్కిలి తెలివిఁ దాల్చెఁ;
గమ్మని చల్లని గాలి మెల్లన వీఁచె;
హోమానలంబు చెన్నొంది వెలిఁగెఁ;
గొలఁకులు కమలాళికులములై సిరి నొప్పెఁ;
బ్రవిమలతోయలై పాఱె నదులు;
వర పుర గ్రామ ఘోష యై వసుధ యొప్పె;
విహగ రుత పుష్ప ఫలముల వెలసె వనము;
లలరుసోనలు గురిసి ర య్యమరవరులు;
దేవదేవుని దేవకీదేవి గనఁగ.
అన్నమయ్య కీర్తన ప్రస్తావన..

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు
పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకి నందను గనియె॥
నవ్వుతూ చూసింది అయ్యా దేవకీ దేవి.జగత్తు ను ఆనందిపచేసే వాడు పుడుతున్నప్పుడు ఆ తల్లి ఆనందం గానే ఉంటుంది.తల్లి కి కూడా ప్రసవవేదన ఇవ్వ లేదు.

తమద్భుతం బాలకమమ్బుజేక్షణం చతుర్భుజం శఙ్ఖగదాద్యుదాయుధమ్
శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం పీతామ్బరం సాన్ద్రపయోదసౌభగమ్
ఆ బాలుడు చతుర్భుజాలతో శ౦కచక్ర
గథాధరములు ధరించి పాదములు మొదలుకొని శిరస్సు వరకు సర్వభరణములు ధరించి శ్రీవత్సము,కౌస్తుభము,వనమాల,వక్షస్థలం లో లక్ష్మీ తో సహా బాలుడు కనపడ్డాడు.
ఎంత చక్కగా వర్ణించారు శుక యోగేంద్రుడు
అలాంటి కృష్ణుని ఆవిర్భావం
సాధారణంగా నీలి వస్తువుల నుంచి తెల్లని వెన్నెల రాదు.కానీనీలి చంద్రుడు అయిన క్రిష్ణుని నుంచి తెల్లని చల్లని కాంతులొస్తున్నాయి.
శ్రీ కృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ
శ్రీకృష్ణ పరమాత్మ కీ జై.జై శ్రీ కృష్ణా🙏
నువ్వు ఎవరో నాకు తెలుసు.నేరుగా వచ్చిన పరమపురుషుడవు.నీ అసలు స్వరూపం కేవలం ఆనంద స్వరూపం.అటువంటి వాడవు మా ముందు గోచరించడం ఎంత అదృష్టమో స్వామి అని నమస్కరించాడు వసుదేవుడు.దేవకి దేవి చూస్తూ ఆనందపరవసురాలు అయి నువ్వు కంటి ముందు కనపడే ఆధ్యాత్మవిష్ణువు.కృష్ణుడంటేనే విష్ణువు.వున్నవాడు ఉన్నట్లు వస్తే నే కృష్ణుడు.నీది పరిమిత శరీరం కాదు.నిర్గుణ,నిర్వికారుడవు అలాంటి నువ్వు ఉద్భవించావు.
నీ రూపాన్నీ ఉపసంహరించుకో ఇది అలౌకికము.దీన్ని చూస్తే మా పుత్రుడనిపించట్లేదు.చేతులు ఎత్తి నమస్కరించి స్తుతించాలనిపిస్తోంది.కాబట్టి ప్రాకృత రూపం లో రా స్వామి అంటే వాళ్ళని ఆశీర్వదిస్తూ ఇదంతా మీకు గతజన్మ గుర్తు కోసం చేసాను.మీరు స్వయంభూ మన్వంతరం లో వసుదేవుడు ప్రజాపతి సుతకుడు ఆమె పేరు పృష్ణని.బ్రహ్మ అనతి చే తపస్సు చేస్తే ఆ ఫలితంగా నేను ప్రత్యేక్షము అయితే నన్ను సంతానం గా కోరుకున్నరు.అప్పుడు పృష్తీవ్రతుడు అనే పేరుతో మీకు సంతానం గా పుట్టాను.నన్ను సంతానం గా పొందాలి అనే మీ తీవ్రమైన కోరిక ఒక సారి తీరలేదు.రెండో జన్మ లో అదితి,కశ్యపులయ్యారు అపుడు నేను వామను నయ్యను.ఆ మీరే ఇప్పుడు దేవకి వసుదేవులయ్యారు.ఇంక కృష్ణావతారమొస్తే తర్వాత మీరు రారు .మీరు నా పై బ్రహ్మ భావన,ప్రేమ రెండు కలవారు అయి మోక్షము పొందుతారు అని చెప్పి ఏమి తెలియని చిన్న శిశువు గా మారిపోయారు.
పైగా ప్రణాళిక మొత్తం చెప్పారు నందవ్రజం లో మాయ శిశువు ను ఇక్కడ కి తీసుకు రావడం తనని యశోద తనయుడిగా అక్కడ ఉంచడం.
యోగమాయ ప్రభావం వల్ల ఆయన చేతులకు కాళ్లకు ఉన్నగొలుసులు తెగిపోయాయి.చెరసాల తాళాలు విడిపోయాయి.అప్పటివరకు కంటి మీద కునుకు లేని భటులు చివరకు కంసుడు తో సహా అందరూ నిద్రపోయారు.వసుదేముడు తట్టలో పిల్లాన్ని పెట్టుకుని వెళ్తుంటే ఆనందము తో మబ్బులు పట్టి పుష్పవృష్తీ కురిపిస్తున్నాయి.యమునా కూడా తీవ్రత తగ్గించి వసుదేవుని కాళ్ళు కదిగేంత మేరలో ఉంచింది ఎందుకంటే భగవానుని తీసుకొస్తున్నారు.వసుదేవుడు నన్దవ్రజంన్లో మాయ ని తీసుకొని కృష్ణపరమాత్మ ని అక్కడ యశోద పుత్రుని గా పెట్టి తిరిగి వచ్చారు.ఇక్కడ ఆడ శిశు జనన వార్త విని పుడతాడు అని చెప్పి ఆడ శిశువు గా పుట్టాడు మాయవి అని కోపించి కంసుడు చంపదానికి రాగా దేవకి ఆడపిల్లని వదిలెయ్యమని ప్రార్ధింపగా వినని కంసుడు ఆ పసిపిల్లను విసిరేయగా అష్ఠ్డ భుజాలతో ,ధనస్సు,సూలముయోగ మాయ ప్రత్యెక్షమయి నిన్ను మట్టుపెట్టే నీ శత్రువు ఇక్కడే ఎక్కడో పుట్టాడు అని చెప్పినది.
కంసుడు నిరంతర విష్ణు ధ్యానం చేసాడు కాబట్టే ముక్తి .
కంసుని ధ్యానం పైన యోగం కోసం ఇంక అన్వేషణ *అందుకే భయయోగి కంసుడు*
అప్పుడు కంసుడు దేవకి ,వసుదేవుడు తోఆ విష్ణు వు నన్ను మోసం చేశాడు .మీ గర్భం లో కాక వేరే చోట పుట్టాడు. నన్ను క్షమించండి అని చాల ప్రియమైన మాటలు అంటే ...వాళ్ళు కూడా క్షమించాము అని అన్నారు.తర్వాత కంసుడు అసురశక్తులని పిలిచి ఈ ప్రదేశం లో ఉన్నఅప్పుడే పుట్టిన పిల్లలను మట్టుపెట్టండి అన్నారు.అక్కడ మధుర లో పుట్టిన శిశువు యొక్క సంస్కారములు నందుడు విప్రులను పిలిచి చేయించారు .
*హిందూ మతం అంటే జీవుణ్ణి సంస్కరించే సాధన*
ఆ తర్వాత ఉత్సవం జరుగుతుంది వ్రేపల్లె మొత్తం
*అప్పుడు దేవకీ వసుదేవలకు ఉత్సవం ఇప్పుడు మన అందరికి మహోత్సవం*
అందరి ఇళ్లు శోభాయమనం గా ఉన్నాయి.ఆవులను అలంకారాలు చేశారు.ఆడ మగ వాళ్ళు అందరూ నందుని ఇంటికి బయలు దేరారు.అన్ని మంగళకరము గా ఉన్నాయి ఎందుకంటే అక్కడ హరి వున్నాడు కనుక హరి ఉన్న చోట సిరి ఉంటుంది కదా.నందవ్రజం లో అందరూ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది.
*కృషుడు ఉన్న హిందూమతం లో
చిరాకు, కోపాలు,ఏడుపులు వుండవు*
ఆడవాళ్ళు స్నానము చేయించి దిష్టి చుక్క పెట్టి హరిరక్ష అన్నారు. ఉయ్యాలలో వేసారు.

జోజో కమలదళేక్షణ!
జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా!
జోజో పల్లవకరపద!
జోజో పూర్ణేందువదన! జోజో యనుచున్
అలా జోలతో నిద్ర పోతున్నా రు.
అలా నిద్ర పోతున్న శ్రీకృష్ణ లీలలను రేపటి నుండి విందాం.పరమాత్మ తో ఆడుకుందాము అనటం తో ప్రవచనము ముగిసింది.

సర్వము శ్రీ గురుచరణారవిందార్పణ మస్తూ
జై శ్రీ కృష్ణ 🙏

గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం తస్మై శ్రీ గురవే నమః పూజ్యగురుదేవులు షణ్ముఖుల భాగవత ప్రవచన మకరందాలు 24
దేవకీ వసుదేవలకు కృష్ణుడు బ్రహము మరియు పుత్రుడు అనే భావం,నంద యశోద లకు మాత్రం పుత్రుడనే భావం మాత్రమే.ఇరువురూ ముక్తి పొందారు.
భాగవత శైలి యోగశైలి.నందయశోదలు మొత్తం వ్రేపల్లె వారు కృష్ణుని మన వాడు అనుకోని ముక్తిని పొందారు.
ఒకసారి నందుడు మధుర కు కప్పం కట్టడానికి వెళ్లారు.అక్కడ ఆయన వచ్చారని తెలిసి వసుదేవుడు కలిశారు వీరు ఇరువురూ మంచి స్నేహబంధవ్యాలు ఉన్నవారు ఆనందం తో నీకు కుమారుడు కలిగాడు ట కదా అని నందుణ్ణి అడుగారు.అవును నాకు మంగళమే. నీ వార్తలు విన్నాను నీ సంతానం మొత్తము గతించారు అని కడపటి గా ఆడశిశువు కూడా పోయింది అని దిగులు పడకు ప్రారభ్డాలు ఇవన్నీ అని నందుడు అంటుంటే బయటపడకుండా వసుదేవుడు విన్నాడు.నా పిల్లాడు రోహిణీ ఎలా ఉన్నారు అని అడిగితే బాగున్నారు అని నందుడు అన్నారు .వెంటనే నందుడు నువ్వు బాధ పడకు నా సంతానం మన అందరికే సంతానమే అన్నాడు. ఇక్కడి నుంచి మీరు తొందరగా వెళ్లిపోవాలని దుష్ట శక్తులు ని కంసుడు అన్ని ప్రాంతాల్లో పంపాడు అని చెప్తాడు వసుదేవుడు.

సరే అని నందుడు బయలుదేరారు ఆయన వెళ్ళేటప్పటికే అక్కడ ఘోరం జరిగింది ఇది కృష్ణలీలల్లో మొదటి లీల
పూతన పిల్లల్ని హతమార్చే ఒకానొక దుష్టశక్తి ఈవిడ కి బాలఘాతిని అని పేరు.ఈవిడ ఇప్పటికే చాలా మంది పిల్లలుని భక్షించింది. కానీ శ్రీకృష్ణుని దగ్గరకు మాత్రం రూపం మార్చుకుని వెళ్ళింది ఎలా అంటే భగవంతుడు దగ్గరకు వెళ్ళినప్పుడు మడి కట్టుకున్నట్లు.అందంగా తయారయ్యింది అన్ని ఇళ్లు వెతుక్కుంటూ వెళ్తోంది.నన్దవ్రజం వారు కూడా ఈమె ఎవరో కొత్తఆవిడ లా ఉండే అనుకుంటున్నారు.సరిగ్గా కృష్ణ గృహానికి వచ్చేటప్పటికి నాదం లా ఏడ్చారు శ్రీకృష్ణులవారు.

నందగృహమున బాలుని నాద మొకటి
విని ప్రమోదించి సుందరీవేష
యగుచు.
ఆమె ను చూడంగానే బాలికలను మట్టుపెట్టే ఒకానొక దుష్టశక్తి లా గ్రహించారు.నిద్రిస్తున్నట్లు నటిస్తున్న పిల్లవాడిని ఉయ్యాలలో తీసి ఒళ్ళో పెట్టుకుంది.చక్కగా అలంకరించుకున్న ఆమె ఎవరా అని ఆలోచించే లోపలే స్తన్యం ఇవ్వడం మొదలు పెట్టింది.ఆ స్తన్యం తో పాటుగా ఆమె ప్రాణాలు కూడా తాగటము మొదలు పెట్టారు.ఆ పాలు తాగే విధానం ఎలా అంటే ఆమె శరీరంలో నాడులన్ని లాగపడుతున్నాయి.అది తట్టుకోలేక ఆమె అసలు శరీరం గ్రహించింది.యోజనమ్మున్నర శరీరం గల ఆమె పడిపోయే సరికి అనేక వృక్షాలు పైన పడిపోయింది ఆ చప్పుడు కి అందరూ వచ్చారు.రోహిణీ, యశోద లు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో అని ఆందోళన పడి వచ్చేటప్పటికి ఆమె పైన ఆడుకుంటూ కనిపించారు.అమ్మయ్య అనుకోని యశోద.ఎత్తుకొని ఉన్న కృష్ణునికి గండం గడిచింది అని దిష్తి తీసి నారాయణ లీల అనుకుంటున్నారు.
ఈ దిష్తి తీసే సందర్భంగా 8 శ్లోకాలు వస్తాయి మంత్ర సమానమయినవి. అవి పిల్లలకు తీసేటప్పుడు చదివితే మంచిది.ఆ నామాలు రక్షించుగాక అంటారు నారాయణ భట్టాద్రి.
*కృష్ణుడు విషాన్ని పుచ్చుకున్న లీలలు వింటే మన బాధలు పోతాయి*
ఈ విధంగా స్వామి కి గోవు తోక తో ను ,గోమాత గిట్టల వల్ల వచ్చే ధూళి తో,గోమూత్రం తో,గోవు పీడకల ను కాల్చినప్పుడు వచ్చే భస్మం తో దిష్తి తీశారు.
గోభక్తుడు గోవిందుని అనుగ్రహానికి పాత్రుడు.
ఈ నామాలు చెప్తూ తీశారు
*ఇవి విష్ణు నామ మంత్రరాసి.
పుట్టుక లేని శ్రీహరి నీ పాదాలు రక్షించు గాక
కౌస్తుభదారి నీ మోకాళ్ళు రక్షించు గాక
యజ్ఞరూపుడు నీ వూరువులు రక్షించు గాక
అచ్యుతుడు నీ నడుము ను రక్షించు గాక
హాయగ్రీవుడు నీ ఉదరాన్ని రక్షించు గాక
సర్వశక్తి మంతు డైన శ్రీహరి నీ హృదయాన్ని రక్షించు గాక
సర్వాతర్యామీ నీ వకఃస్థలం ని రక్షించు గాక
సూర్యరూపుడైన నారాయణస్వామి నీ కంఠాన్ని రక్షించు గాక
సర్వవ్యాపాకమైన విష్ణువు నీ చేతులు రక్షించు గాక
త్రివిక్రముడు నీ నోటి ని రక్షించు గాక
సర్వనియామకుడు నీ శిరస్సు ను రక్షించు గాక
చక్రపాణి నీ ముందు రక్షించు గాక
గదాదారి నీ వెనుక రక్షించు గాక
ధనుర్ధారి మధుసూదనుడు ఒక పక్క నిన్ను రక్షించు గాక
ఖడ్గము పట్టుకున్న విష్ణువు మరోపక్క రక్షించు గాక
శంకదారి అయిన శ్రీహరి దిక్కులమూలలలో నిన్ను రక్షించు గాక
వామనుడు పైన రక్షించు గాక
గరుడవాహనుడు అయిన హరి నిన్ను నెల పై రక్షించు గాక
పరిపూర్ణుడయిన హరి నిన్ను సర్వత్రా రక్షించు గాక
ఆడుకుంటున్న నిన్ను గోవిందుడు రక్షించు గాక
నిద్రిస్తున్న నిన్ను మాధవుడు రక్షించు గాక
పరిగెడుతున్న నిన్ను వైకుంఠవాసి రక్షించు గాక
కూర్చున్న నిన్ను శ్రీయహ్పతి రక్షించు గాక
తింటున్న నిన్ను యజ్ఞభోక్త రక్షించు గాక
సర్వాగ్రహ భయంకరుడైన నారాయణ స్వామి నిన్ను ఎల్లవేళలా రక్షించు గాక

ఒకటి నుంచి 14 దాకా వచ్చే బాల బాధల్ని బాలాగ్రహదోషములంటారు
*బడికి పంపే పిల్లలకు విష్ణు నామాలు చెప్పించండి వారి బ్రతుకులు బాగుపడతాయి*
ఇలా అందరూ దిష్టి తీసి కవచ భావన చేశారు.ఈ లోపల నందుడు వచ్చి వసుదేవుడు చెప్పింది నిజమే ఆయన కి గొప్ప శక్తులు వచ్చ్హాఏమో అనుకున్నాడు 
ఇప్పుడు సమస్య అంత పెద్ద శరీరం ఎక్కడ తగలెయ్యాలి అనుకోని చివరికి గొడ్డళ్లతో ఆ శరీరాన్ని నరికి అన్ని కలిపి దహనం చేశారు.ఆశ్చర్యం గా సుగంధద్రవ్యాల వాసనలు ఆ శరీరం నుంచి వస్తున్నాయి.ఎందుకంటే శరీరం పవిత్రమైపోయింది.స్వామి స్పర్శ మాత్రము చేత ఆ పూతన పాపము మొత్తం పోయింది.చిన్నికృష్ణ పాదాలు చేతులు తగిలాయి.
లోకం లో ఎవరికి నమస్కారం చేస్తారో వారు నమస్కరించే పాదాలు.అవి ఎప్పుడు భక్తుల హృదయాల్లో ఎప్పుడూ చెక్కు చెదరకుండా వుంటాయి.
అలాంటి స్వామి కి స్తన్యమిచ్చిన తల్లు ఎంత సద్గతి పొందుతుందో ఆ రాక్షసి కూడా సద్గతి పొందుతుంది
ఇదంతా విష్ణు అనుగ్రహం అని ఎవరి పనిలో వారు వుంటున్నారు.

కృష్ణ లీలలు ఇంకా చెప్పమని పరీక్షిన్మహారాజు శుకయోగేంద్రుడు ని అడుగగా
ఒక రోజు కృష్ణుడు బోర్లపడినప్పుడు జరిగేటప్పుడు జరిగే వేడుక చేస్తున్నారు.అన్నీ చెయ్యాల్సినవి చేసి ఉయ్యాల లో పడుకోబెట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.ఆ ఉయ్యాల కి దగ్గరలో బరువైన పదార్థాలు కల బండి ఉంది.తనమెత్తనైన బుజ్జిపాదాల తో ఆ బండి ని తన్నారు.పెద్దపెద్ద పాత్రలు ఇతరము ల తో ఉంది ఆ బండి.ఇటు వచ్చిన వారి అతిధి సత్కారాలు తో ఉన్ననందుడు మొదలు వారు ఆ చప్పుడు వినంగానే వచ్చి పిల్లాడికి ఏమైందో చూస్తున్నారు.అమ్మయ్య ఇంకో గండం గడిచింది పిల్లాడికి ఏమి అవ్వలేదు అనుకుంటూ ఉంటే అక్కడ ఉన్న పిల్లలు మాకు తెలుసు ఏమి అయిందో కృష్ణుడే ఆ బండి ని తన్నాడు అని చెప్పారు.

పిల్లలు కదా చిన్నదాన్ని పెద్దింతలు గా చెప్తారు వాడు అలా ఎలా చేస్తాడు లే అని యశోదా దేవి వాళ్ళు అనుకున్నారు.

శా. బాలుండెక్కడ ? బండి యెక్కడ ? నభోభాగంబుపై( జేడ్పడం
గాలం దన్నుట యెక్క ? డ
ఇంతలో స్వామి ఏడవడం మొదలు పెట్టారు.అప్పుడు యశోదా దేవి
అలసితివి కదన్న! యా కొంటివి కదన్న మంచి అన్న! ఏడ్పు మనుమన్న అని ఆమె స్తన్యమిచ్చినది ఏమి ఎరగనట్లే వున్నాడు పిల్లవాడు.
ఒకసారి యశోద కృష్ణుని ఒళ్ళో పెట్టుకొని ఆడిస్తో౦ది.

ఒక్కసారిగా బరువు అయిపోయాడు.పర్వత బరువులా ఉన్న స్వామి ని కింద పరుపు మీద పడుకోబెట్టినది యశోదా. అప్పుడు సుడిగాలి ఒకళ్లకు ఒకళ్ళు కనపడనంత గా దుమ్ము తో.గాలి తెరిపికి రాంగానే పిల్లాడు కనపడపోయే సరికి అందరూ ఆందోళన తో గాలి పిల్లాన్ని ఎక్కడికి అయినా తీసుకెళ్లిందేమో అని అనుకుంటుండగా పెద్ద శబ్దం వచ్చింది.అక్కడ కి వెళ్ళ౦గానే పెద్దరాయి మీద రాక్షసుడు శవం ఉంది.త్రునావృత్తుడనే రాక్షసుడు సుడిగాలి రూపం లో వచ్చి పిల్లాణ్ణి తీసుకెల్దామనుకుంటే గట్టి గా మెడ పట్టుకొని ఆ రాక్షసుడు ని స్వామి ఉంటే ఆ బరువు కు ఆ రాక్షసుడు కింద పడిపోయాడు.గరిమ సిద్ధి ఇది
ఎప్పుడయితే అతని ప్రాణాలు పోయాయో అతను ది పెద్ద శరీరం పక్కన స్వామి చిన్న గా ఇక్కడ నారాయణ భట్టాద్రి ఒక నల్లని కొండ మీద నీలమణి ని ఎలా తీసారో అలా స్వామి ని తీశారు అని వర్ణించారు.అమ్మయ్య మృత్యువు నుంచి బయటపడ్డాడు అని అందరూ అనుకున్నారు.
ఇప్పటి వరకు మూడు అసురసంహార లీలలు అయ్యాయి.
ఒక్కసారి స్వామి కి పాలు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆవాలిస్తాడు అప్పుడు ఆ నోటి లో సమస్త బ్రహ్మాన్దాలు గోచరించాయి ఇది బ్రమ అనుకుంది.యశోదమ్మ.
కృష్ణుని విశ్వరూపావతారం
పరిమితము గా ఉండటం ఆయన యోగమాయ.అపరిమితము గా ఉండడం ఆయన విశ్వరూపం.పరిమితము గా ఉన్న అపరిమితమును ఎప్పుడు తగ్గించలేదు.అర్జునునికి విశ్వరూపం చూపించినప్పుడు కూడా నీ దృష్టి ని మార్చుకో అని అన్నారు.భగవంతుడు రూపు మార్చుకోలేదు చూసే వాడి చూపు మార్చారు.
వసుదేవుడు గర్గుని ని నామకరణ సంస్కారం చెయ్యమని నన్దవ్రజానికి పంపారు.గర్గభాగవతము కూడా చాలా బాగుంటుంది.
బాలుడయి ఉన్న ఆ పరంజ్యోతి ఎక్కడ ఉన్నాడో అని వెతుక్కుంటూ వస్తున్నారు.నందుడు ఆయన రాకకు సంతోషించి మీరు జ్యోతిష్యం లో మీరు దిట్ట మా పిల్లలకు నామకరణం చేయండి అని అడిగాడు.పేరు పెట్టాలి అనే సంకల్పం పెట్టించుకోవాలనే స్వామి దే.
ఆడుకుంటున్న పిల్లల్లో నల్లనయ్య ను ఎత్తుకొని ముద్దులాడుతుంటే నందుడు పేరు పెట్టాలి అని గుర్తుచేసాడు. వసుదేవుడు కూడా నన్దవ్రజం లొనే పేరు పెడితే మంచిది అన్నట్లు గర్గునకు చెప్పి పంపుతాడు.
పేరు పెట్టేముందు ఇలా అబతున్నాడు.ఇతడు తెలుపు,ఎరుపు,పసుపు వర్ణాలు తో పూర్వము వున్నాడు ఇప్పుడు నల్లని వర్ణము తో వున్నాడు.
*కలియుగము లో తరింపిజేటానికి కృష్ణావతము లో వస్తున్నారు*
మీ అబ్బాయి కి అనేకనామాలు అనేక రూపాలు ఉంటాయి.అవి నాకు తెలుసు.
నామార్థవిచారణ చేస్తే ఇది అంతా పరబ్రహ్మ కు తెలిసిన నామమే అని తెలిసి మనకు బ్రహ్మ జ్ఞానం నామస్మరణ వల్ల జరుగుతుంది.
అనేక నామాలు గల తనకి ఏ పేరు కావాలో స్ఫురింప చేశారు.వెంటనే కృష్ణా అని నామకరణం చేశారు గర్గ్లుల వారు.
కృష్ణా అంటే సచ్చిదానంద స్వరూపం.
కృష్ణా అంటే తనవైపుకు లాగేవాడు.అంటే తనవైపుకి ఆకర్షించే వాడు ఎలా అంటే ఆకర్షింపబడే వాడు మళ్ళీ బైటకి రాలేడు అంటే ముక్తి పొందుతాడు.
కర్షకుడు పని చెయ్యాలంటే ముందు కలుపుమొక్కలు లాగేస్తాడు.తర్వాత పండిస్తాడు. 
మన దగ్గర నిస్సారవంతమైన ఒక పంట ఇంకోటి బండతనం,కలుపుమొక్కలు.వాటిని తీసేసి మృదువు చేసి అప్పుడు పంటపండించాలి.ఇలాంటి పంట మనలో ఉంటే ముందు బండతన్నాన్ని తీసేసి,కలుపు మొక్కలు ఏరి,జ్ఞాన బీజాలు వేసి బ్రతుకు ను పండిస్తాడు.
కృష్ణుడు అంటే కాల స్వరూపుడు.
కోట్లకొలది విష్ణు నామాలు పలికితే ఎంత పుణ్యమో కృష్ణ అని ఒకసారి పలికితే అంత పుణ్యం.
*మంత్రశాస్త్ర నామాల్లో ముఖ్యమైనది శ్రీకృష్ణశరణం మమ*
నారాయణుని ఆశ్రయించిన వారిని,దేవతల్ని ఆసురులు ఏమి చెయ్యలేకపోయారు ఎలాగో ఈ కృష్ణపరమాత్మ పై ఎవరు ప్రీతి పొందుతారో వారిని ఎవరూ బాధించలేరు.
కృష్ణ స్వామి పెద్దవాడు అవుతున్నారు.
తల్లులకి కూడా ఒక చోట ఉండకుండా అడవుల్లోకి ,వీధుల్లోకి వెళ్లిపోతున్నాడు
ఇప్పుడు తోటిపిల్లల తోఆడుకునే వయస్సు వచ్చింది.వెన్న మీగడలు దొంగిలించి తమతో పాటుగా కోతులకి కూడా పంచుతున్నాడు
ఒకసారి గోపకాంతలు కృష్ణుడు అల్లరి తట్టుకోలేక వాళ్ళమ్మ గారి దగ్గరకు వెళ్లారు.బాగా అల్లర్జ్ చేస్తున్నాడు అని. ఆవిడ నవ్వి ఊరుకుంది.ఏంటి నవ్వు 
తున్నావు మా ఇంట్లో పాలు ,వెన్న దొంగిలిస్తు౦టే అంటే నేనెలానమ్మను అంది యశోదా.పోనీ వచ్చాడే అనుకోండి పిల్లలకి అందేట్లు ఎట్లా పెడుతున్నారు అని
మళ్ళీ అన్నమయ్య ప్రస్తావన
ప|| కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని ||

చ|| బాయిట బారవేసిన పాలు వెన్నలును | చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు |
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక | పాయక దూరేరేల ప్రతిలేని బిడ్డను 
ఇలా కృష్ణలీలలు కొన్ని చెప్పారు.
ఒకసారి బలరాముడు వచ్చి అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అని అంటే కృష్ణుని యశోద. ఎందుకు తిన్నావని నిలదీయగా అప్పుడు కృష్ణుడు

అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాఁ కొంటినో వెఱ్ఱినో

నమ్మంజూడకు వీరి మాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ

రిమ్మాగ్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీ యాస్య గం
ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.!
వీళ్ళందరి మాటలు న మ్మద్దని కృష్ణుడంటే నోరు తెరవమని అమ్మ అంటే నోరు తెరిచాడు.

స్వామి నోటిలో ఉన్న భువనభణ్డంములు చూసింది మహాయోగి కి లభించాల్సిన యోగం లభించింది.బ్రహ్మని ఒకే రకమైన స్థితి లో ఉంది యశోదా దేవికి.యశోదా దేవి స్తోత్రం చేస్తుంది.ఆమె కి విశ్వరూప దర్శనమయ్యింది.ఆ నోట్లో అన్ని చూసినప్పుడే ఆమె కి పరిస్థితి అర్ధం అయ్యింది.వెంటనే ఆమె కు మళ్ళీ మాయ ఆవహింపచేశారు కృష్ణ స్వామి.సత్యాన్ని తట్టుకొనే స్థితి రావాలి కదా ఆమె కు.మళ్ళీ పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకొని లాలించడం మొదలు పెట్టింది.
ఇది విన్న పరీక్షిన్మహారాజు భాష్పములతో బ్రహ్మము ను ఒళ్ళో పెట్టుకుంది ఏమి చేసింది అయ్యా అని అంటే 
వసువుల్లోఒకడైన ద్రోణుడు, ఆయన భార్య ధరా వారిని భూలోకానికి వెళ్ళండి అని బ్రహ్మ అంటే పరమాత్మ ని తల్లిదండ్రులు గా లాలించే భాగ్యం వస్తే మేము భూలోకానికి వెళ్తాము అన్నారు ట .మీకు ఆ భాగ్యం లభిస్తుంది అని అన్నారు ట వాళ్ళే నంద,యశోద లు.
రేపు ఇంకా ఎన్ని లీలలు చూపిస్తారో కృష్ణుడు అని అంటూ గురువు గారు ప్రవచనము ముగించారు.
సర్వము శ్రీ గురుచరణారవిందార్పణ మస్తూ
Image may contain: 2 people
Image may contain: 9 people, people smiling
Like
మధురమ్ |
రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్