29, నవంబర్ 2022, మంగళవారం

 నాన్న కూ కన్నీళ్లు ఉంటాయి


💠 నాన్న మనకోసం ఏం చేశాడో

ఏం కోల్పోయాడో మనకు తెలియదు..!


💠 జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.

 

💠 ఎందుకంటే..  నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్య కి అసలు చెప్పడు. అమ్మ లా ప్రేమ ను బయటికి చూపించడం నాన్న కు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.

 

💠 ఎప్పుడూ పనేనా ? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.

 

💠 మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. 

💠 వృద్ధాప్యం ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.

 

💠 తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్న కు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు. మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ.

 

💠 ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా? నాన్న కూడా ఏడుస్తాడు.😰 కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు.

 

💠 పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. నాన్న అన్నీ అమ్ముకుని, అంతా అయిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. నా కోసం నేను ఏదీ దాచుకోలేదే.... అనుకుంటాడు.

 

💠నిజానికి నేను అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు.


ప్రతి నాన్న కు 

అంతా రామ మయం ...🙏


చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ           నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.


బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో

పడుకోబెట్టిన వెంటనే పాడిన

పాట -

రామాలాలీ - మేఘశ్యామా లాలీ


మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు -

శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.


మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా


వినకూడని మాట వింటే అనాల్సిన మాట -

రామ రామ


భరించలేని కష్టానికి పర్యాయపదం -

రాముడి కష్టం .


తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు


కష్టం గట్టెక్కే తారక మంత్రం

శ్రీరామ .


విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .


అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట -

అన్నమో రామచంద్రా


వయసుడిగిన వేళ అనాల్సిన మాట -

కృష్ణా రామా !


తిరుగులేని మాటకు - రామబాణం 


సకల సుఖశాంతులకు - రామరాజ్యం .


ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన


ఆజానుబాహుడి పోలికకు - రాముడు


అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 


రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .


చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -

Rama killed Ravana ;


Ravana was Killed by Rama .


ఆదర్శ దాంపత్యానికి సీతారాములు


గొప్ప కొడుకు - రాముడు


అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు


గొప్ప విద్యార్ధి రాముడు

(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .


మంచి మిత్రుడు- రాముడు

(గుహుడు చెప్పాడు).


పిబరే రామ రసం - 


రామాయణ సారం అంతా ఒక్క ప్రవచనం లో అద్భుతంగా చెప్పిన శ్రీ చాగంటి వారు 


మంచి స్వామి రాముడు

(హనుమ చెప్పారు).


సంగీత సారం రాముడు

(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం

(పిబరే రామరసం)

సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)


కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .


రామాయణం పలుకుబళ్లు


మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .


తెలుగులో కూడా అంతే .


ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని

అడిగినట్లే ఉంటుంది ...


చెప్పడానికి వీలుకాకపోతే -

అబ్బో అదొక రామాయణం .


జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే

సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .


ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -

అదొక పుష్పకవిమానం


కబళించే చేతులు , చేష్టలు

కబంధ హస్తాలు .


వికారంగా ఉంటే -

శూర్పణఖ


చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).


పెద్ద పెద్ద అడుగులు వేస్తే -

అంగదుడి అంగలు.


మెలకువలేని నిద్ర

కుంభకర్ణ నిద్ర


పెద్ద ఇల్లు

లంకంత ఇల్లు .


ఎంగిలిచేసి పెడితే -

శబరి


ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు


అల్లరి మూకలకు నిలయం

కిష్కింధ కాండ


విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -

అగ్ని పరీక్షలే .


పితూరీలు చెప్పేవారందరూ -

మంథరలే.


సాయం చేసినపుడు- ఉడుత భక్తి..

కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..

 గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని


యుద్ధమంటే రామరావణ యుద్ధమే .


ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -

(రావణ కాష్టాలే .)


కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది

(ఇది విచిత్రమయిన ప్రయోగం ).


సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు


ఒంటిమిట్టది ఒక కథ ..

భద్రాద్రిది ఒక కథ

అసలు రామాయణమే మన కథ .

అది రాస్తే రామాయణం

చెబితే మహా భారతం


అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు

అది ఒక జీవన విధానం


అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు


రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు


|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||


ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.

ఓం నమఃశివాయ! నమః ఓం నమఃశివాయ! ఓం నమఃశివాయ! ///


రుద్ర శబ్దార్ధములు అనేకములున్నవి


1,రుతం(దం) సంసారదుఃఖం ద్రావయతీతి రుద్ర: సంసార దుఃఖమును నాశనం చేయువాడు రుద్రుడు -(రుదంద్రావయతీతి రుద్ర:) 


2,రోదయతి సర్వమన్త కాలమితి రుద్ర: 

ప్రళయకాలమున అందరినీ దుః ఖంపజేయువాడు రుద్రుడు.... 


3. రుతౌ నాదాంతే ద్రవతి - ద్రావయతీతి రుద్ర:

నాదము యొక్క చివర ద్రవింప జేయువాడు రుద్రుడు... 


4. రుత్వా వేదరూపయ, ధర్మాదీ నవలోకయతి ప్రాయతీతివా.... 

వేదరూపంలో ధర్మమును పొందింప జేయువాడు రుద్రుడు... రుద్ర:


5. రుత్యా-వాగ్రూపయా, వాచ్యం ప్రాపయతీతి రుద్ర: వాగ్రూపము చే అర్థప్రతీతిని పొందించువాడు రుద్రుడు.... 


6. రుత్వా - ప్రణవరూపయా, స్వాత్మానం ప్రాపయతీతి రుద్ర: 

ప్రణవరూపమున తనను పొందింపజేయు వాడు రుద్రుడు... 


7. రుద్రోరౌతీతి సత్యే రోరూపమాణో ద్రవతి - ప్రవిశతి మర్యాతి రుద్ర:

సత్యరూపమున మనుష్యులను ప్రవేశించువాడు రుద్రుడు.... 


8. రుతిం శబ్దం వేదాత్మానం బ్రహ్మణీ దదాతి కల్పాదావితి

కల్పాదియందు బ్రహ్మకు వేదములనిచ్చేవాడు రుద్రుడు... 


9. దుఃఖ, దుఃఖహేతువులను పోగొట్టువాడు రుద్రుడు అని...


!!!వాయువీయసంహిత!!

1. *మూలవిరాట్ 🚩 భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.

 

2. ప్రదక్షిణ 🚩 మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.


 3. ఆభరణాలతో దర్శనం 🚩 ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.


 4. కొబ్బరి కాయ 🚩 ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.


 5.మంత్రాలు 🚩 ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.


6. *గర్భగుడి 🚩 గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.


7.అభిషేకం* 🚩 విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.


8. *హారతి 🚩 పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.


9. *తీర్థం 🚩 ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


10. *మడి 🚩 తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_


                              లోకాః సమస్తాః

                                సుఖినోభవంతు

                         సర్వే జనాః సుఖినోభవంతు

            రైల్వే ప్రయాణికులకు భరోసా 

రాజమండ్రికి చెందిన వెంకటేశ్వరరావు దంపతులు విజయవాడలో ఉంటున్న తన కూతురి దగ్గరకు వెళ్లి ఆమె బాగోగులు చూసి విజయవాడ నుంచి బిలాస్‌పూర్‌కు మరో రైల్లో బయలుదేరారు. విజయవాడలోని వెంకటేశ్వరరావు కుమార్తె మూడుగంటల తర్వాత తల్లిదండ్రుల క్షేమ సమాచారం కోసం ఫోన్‌చేయగా ఫోన్‌ రింగవుతున్నా కాల్‌ లిఫ్టు చేయలేదు. వెంటనే ఆమె రైల్వే హెల్ప్‌లైన్‌ 182కు ఫోన్‌చేసి విషయం చెప్పి తన తల్లిదండ్రుల క్షేమ సమాచారాన్ని తెలియజేయాలని కోరింది. వెంటనే రైల్వే అధికారులు సంబంధిత సిబ్బందికి వెంకటేశ్వరరావు వెళ్లే రైలు సమాచారాన్ని తెలపగా ఖాజీపేటలో రైల్వే అధికారులు ఆయన దగ్గరకు వెళ్లి వారితో ఫోన్‌లో విజయవాడలోని ఆయన కుమార్తెతో మాట్లాడించారు. దీంతో కుమార్తెకు వూరట లభించింది. 


హౌరా-యశ్వంత్‌పూర్‌ రైల్లో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న ఓ విద్యార్థిని హిజ్రాలు ఏడిపించసాగారు. విద్యార్థి హిజ్రాల వేధింపులు భరించలేకపోవడాన్ని సాటి ప్రయాణికుడు గమనించాడు. వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 182కు ఫోన్‌చేసి సమాచారాన్ని అందించాడు. రైలు ఏలూరు వెళ్లగానే ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది హిజ్రాలుండే బోగి ఎక్కి వారిని అదుపులోనికి తీసుకున్నారు. 


మండవల్లి, న్యూస్‌టుడే


భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 182 హెల్ప్‌లైన్‌ నంబరును ఏర్పాటు చేసింది. విపత్తులు, ఆపద సమయాల్లో ప్రయాణికులు ఈ నంబరుకు ఫోన్‌చేస్తే వెనువెంటనే సాయం అందుతుంది. ఇటీవల బెంగళూరు స్టేషన్‌లో ఒకే కుటుంబానికి చెందిన 30 మంది తప్పిపోయిన సంఘటనలో సైతం ఇది ఎంతగానో ఉపయోగపడింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలోని రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌)కు అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికులు ఆ నంబరుకు కాల్‌ చేసిన వెంటనే అది ఏ డివిజన్‌లో ప్రయాణిస్తుందో, ఏ రైల్వే స్టేషన్‌లో నిలుస్తుందనే సమాచారం మొత్తం జీపీఎస్‌ ద్వారా తెలుస్తుంది. రైలు తరువాత నిలిచే స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ సిబ్బందికి సమాచారం వెళుతుంది. ఆర్పీఎఫ్‌ సిబ్బందికి వెళ్లే ఈ కాల్‌ రికార్డు కావడంతో ప్రతి కాల్‌కు ఎటువంటి పరిష్కారం చూపారనే విషయం సైతం సిబ్బంది నోట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది కాల్‌ వచ్చిన రైలు బోగీకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. 


ఎలాంటి సమస్యకైనా పరిష్కారం.. 

మనం రిజర్వేషన్‌ చేసుకున్న సీట్లో వేరొకరు కూర్చున్నా వెంటనే 138 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. బోగీల్లొ ఎవరైనా అనుమానితులుగా ఉన్నా, మరుగుదొడ్లలో నీరు రాకున్నా, దుర్వాసన వస్తున్నా, ఫ్యాన్లు తిరగకపోయినా.. లైట్లు వెలుగకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. తోటి ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, హిజ్రాలు, ఆకతాయిల వేధింపుల ఎక్కువైనా ఫోన్‌చేసి తక్షణ పరిష్కారం పొందవచ్చు. రైల్లో మన లగేజీ మరచిపోయి.. దిగిపోయిన సందర్భంలో సైతం ఫోన్‌చేస్తే అవతలి స్టేషన్‌లో లగేజిని పొందవచ్చు. 


ఏ సమయంలోనైనా.. ఎవరైనా.. 

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 182 ఉచిత హెల్‌లైన్‌ నంబరు 24గంటలు అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు ఏ సమయంలో అయినా ఫోన్‌చేసి సహాయాన్ని పొందవచ్చు. ఈ నంబరుకు రైల్లో ప్రయాణించే ప్రయాణికులతోపాటు ఎవరైనా  ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణంలో అనారోగ్యం సంభవించినా.. 182 ఫోన్‌చేసి సత్వర పరిష్కారం పొందవచ్చు.





    


అరుంధతీ (నక్షత్రం) ఎందుకు పూజ నీయమైంది?

ఈ ప్రశ్న నేటిదికాదు, నాటిదేనని చెబుతున్నది ‘సూత సమ్హితా శౌనకాది మహర్షి గణాలకు ఒకసారి ఇదే సందేహం కలిగింది. దీనిని వారు త్రికాలవేత్త సమస్త పురాణ వ్యాఖ్యానదక్షుడు అయినటువంటి సూతుని ముందుంచగా, ఆయన ‘అరుంధతీ దేవి ప్రాముఖ్యతను ఇలా వివరించాడు.
“అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతీ తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం!!’

అనగా అరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది. ఈ అయిదుగురు స్త్రీ మూర్తులు సదా వందనీయులని తెలుస్తున్నది. అరుంధతిదేవి పతివ్రతలో అగ్రగామి. ఈమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుందని ‘నైమిసమ్హితా పేర్కొంటోంది. అసక్తికరమైన అరుంధతి జన్మవౄత్తాంతాన్ని ఇపుడు మీకు చెప్పబోతున్నాను అన్నాడు సూత మహాముని.
ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవితయైన ఒక కన్యను, వర్ణింపనలవికాని ఒక  సుందరుని సృష్టించాడు. ఆ కన్య పేరు ‘సంధ్యా. యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సాయపదమని చెబూతూ బ్రహ్మ ఆ యువకునికి -
అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా!! అంటూ

అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు సమ్మోహన బాణాలను అందించాడు. బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా, బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న ‘సంధ్యా ను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపించి మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు. తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో ‘సంధ్యా చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలచి పయనమై పోయింది. అపుడు బ్రహ్మ వశిష్టమహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు ‘శివా మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెడలిపోయాడు. సంధ్య తదేకనిష్టలో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మని కోరగా, ఆమె “ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే’ వరాన్ని అనుగ్రహించమంది. శివుడు ఆమె లోకోపకార దృష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య ‘నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదౄష్టిలో చూచినట్లయితే, వారు నపుంసకులుగా మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేకమందికి కామవికారాని కల్గించాను. కాబట్టి ఈ దేహం నశించిపోవాలీ అని కోరింది. శివుడు ‘తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యురాలివై శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో! అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.
శివాజ్ణ్జగా సంధ్యా శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుండి తిరిగి జన్మించింది. సంస్కౄత భాషలో ‘అరుం’ అంటె అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ అంటె ధరించినది అనే అర్థం వున్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె ‘అరుంధతీ అనబడింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి వశిష్టునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది. ఈ దంపతులకు పుట్టినవాడే ‘శక్తీ. శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. అరుంధతిని మనవారు ‘ఆరని జ్యోతీ అని ‘అరంజ్యోతీ అని పిలుస్తూంటారు. విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనమలు, మునిమనమలు గురించి ప్రస్తావించబడివుంది.

అరుంధతీ నూతన దంపతులకు ఇచ్చే దీవెనలు ఏమిటి? అంటే, కొత్త పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్థి మండలంలో వున్న వశిష్టుని తారకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. దీనివెనుక ఒక ప్రధాన కారణమున్నది. వశిష్ట, అరుంధతీ ద్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారారూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది. వీరిద్దర్ని సందర్శించడం వలన దంపతులకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, సౌభాగ్యములు కలుగుతాయి.

 సాధారణంగా శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. 

✳️ అందుకు సంబంధించిన ఒక అధ్బుతమైన కధ ఉంది.
అదేమిటంటే....?

✳️ ఒకప్పుడు దేవతలకు "రామేశ్వరం" అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. 

✳️ 'రామస్య ఈశ్వరః' అని అంటే రామునికి ఈశ్వరుడు (ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం (శివుడే గొప్పవాడని) చెబుతుంది. 

✳️ శివ ధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? 

✳️ విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. విషయం చెప్పారు, మీరు మరియు శివుడిలో ఎవరు గొప్ప!? అని అడిగారు. 

✳️ దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఇంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది. రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రామునికి అధికారి. "నాకంటే శివుడే గొప్పవాడు" అని అన్నాడు విష్ణువు. 

✳️ ఈ విష్ణువు వినయంతోనో, అహంభావం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనో, మొహమాటం తోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి, తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహించడానికి ఏముంది? "రాముడే ఈశ్వరుడుగా గలవాడు అంటే  (విష్ణువు) తనకు అధికారి అని, "విష్ణువు తనకంటే గొప్ప అని అన్నాడు శివుడు"..

✳️ వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని, దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు - "రామేశ్వరుడంటే రాముడొకడూ, ఈశ్వరుడొకడు అని అర్దం కాదయ్య, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారు. 

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్ ||

✳️ అసలు వీళ్ళిద్దరికి బేధం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. 

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః || 

✳️ శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే, వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది..✅

✳️ శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి. ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం 
శివనామస్మరణ చేస్తాడు. 

🙏వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.🙏


🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏🌺🪷✍️


శ్రీ పరమేశ్వర మాతృకావర్ణ మాలాస్తోత్రమ్ 🙏
సేకరణ: బృహత్‌స్తోత్ర రత్నాకరం నుండి......

🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️

అ॥ 
అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణితగుణగణ అమృతశివ, 

ఆ॥ 
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ, 

ఇ॥
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ, 

ఈ॥
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవసేవిత పాద శివ, 

ఉ॥ 
ఉరగాది ప్రియభూషణ శంకర నరకవినాశ నటేశ శివ, 

ఊ॥ 
ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ,

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

ఋll 
ఋగ్వేద శ్రుతిమౌళి విభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ,

ౠll 
ౠపమనాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్త్వ శివ,

ఌll లింగస్వరూప సర్వబుధప్రియ మంగళమూర్తి మహేశశివ, 

ౡll
ౡతాధీశ్వర రూపప్రియశివ వేదాంత ప్రియవేద్యశివ,

ఏ॥
ఏకానేకస్వరూప విశ్వేశ్వర యోగిహృది ప్రియవాస శివ,

ఐll
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ,

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

ఓll
ఓంకార ప్రియ ఉరగవిభూషణ హ్రీంకారాది మహేశశివ,

ఔ॥ 
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ, 
 
అం॥ 
అంబరవాస చిదంబరనాయక తుంబురునారద సేవ్యశివ, 

అఃll 
ఆహారప్రియ ఆదిగిరీశ్వర భోగాదిప్రియ పూర్ణశివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

కll 
కమలాక్షార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాంతిశివ,

ఖll 
ఖడ్గశూలమృగ ఢక్కాద్యాయుధ విక్రమరూప విశ్వేశశివ, 

గll
గంగాగిరిసుతవల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ, 

ఘll 
ఘాతకభంజన పాతకనాశన గౌరిసమేత గిరీశ శివ, 

జ॥ 
ఙఙాశ్రిత శ్రుతిమౌళివిభూషణ వేదస్వరూప విశ్వేశశివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

చll 
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశశివ,

ఛII 
ఛత్ర కిరీట సుకుండలశోభిత పుత్రప్రియ భువనేశ శివ, 

జ॥ 
జన్మజరా మృతినాశన కల్మషరహిత తాపవినాశ శివ, 

ఝll
ఝంకారాశ్రయ భృంగిరిటప్రియ ఓంకారేశ మహేశశివ,

ఞll
జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల దీనజనప్రియ దీపశివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

టII 
టంకాద్యాయుధధారణ సత్వర హ్రీంకారాది సురేశ శివ,

ఠll
ఠంకస్వరూపా సహకారోత్తమ వాగీశ్వర వరదేశ శివ,

డ॥
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదీశ శివ,

ఢ॥ 
ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్యశివ,

ణll 
నళినవిలోచన నటనమనోహర అళికుల భూషణ అమృత శివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

త॥ 
తత్త్వమసీత్యాది వాక్యస్వరూపక నిత్యానంద మహేశశివ,

థ॥ 
స్థావరజంగమభువనవిలక్షణ భావుకమునివర సేవ్యశివ,

దll
దుఃఖవినాశన దళితమనోన్మన చందనలేపితచరణ శివ,

ధ॥ 
ధరణీధరశుభ ధవళవిభాస్వర ధనదాదిప్రియదానశివ,

న॥ 
నానామణిగణభూషణ నిర్గుణ నటనజన ప్రియనాట్య శివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

ప॥
పన్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశశివ,

ఫll
ఫాలవిలోచన భానుకోటి ప్రభ హాలాహలధర అమృతశివ, 

బll 
బంధవినాశన బృహదీశామర స్కందాది ప్రియ కనకశివ

భ॥ 
భస్త్మవిలేపన భవభయనాశన విస్మయరూప విశ్వేశశివ,

మ॥ 
మన్మథనాశన మధుపాన ప్రియ సుందరపర్వతవాసశివ,

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

యll 
యతిజనహృదయనివాసిత ఈశ్వర విధివిష్ణ్వాది సురేశశివ,

ర॥ 
రామేశ్వర రమణీయ ముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ, 

లll 
లంకాధీశ్వర సురగణసేవిత లావణ్యామృత లసిత శివ, 

వ॥ 
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూషశివ, 

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

శ॥ 
శాంతిస్వరూప జగత్త్రయ చిన్మయ కాంతిమతీ ప్రియ కనక శివ, 

షll 
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాది సమేతశివ, 

సll 
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుహృది ప్రియ వాసశివ,

హll 
హరపురుషోత్తమ అద్వైతామృత పూర్ణమురారి సుసేవ్యశివ,

ళ॥ 
ళాళితభక్తజనేశనిజేశ్వర కాళినటేశ్వర కామశివ, 

క్ష॥ 
క్షరరూపాది ప్రియాన్వితసుందర సాక్షి జగత్త్రయస్వామిశివ,

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

⚜️ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ. 🔱

ఇతి శ్రీ సాంబసదాశివ మాతృకావర్ణమాలికాస్తోత్రమ్.

🙏 హరహర మహాదేవ🙏

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది - సోమనాథ్ ఆలయం🌹

🌸సోమనాథ్ ఆలయం. మొదటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది ఇది. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ముస్లింల దాడులతో నలిగిపోయినప్పటికీ ఈ ఆలయం.. మాత్రం పునర్ నిర్మాణంతో మళ్లీ ప్రాముఖ్యత సంతరించుకుంటూనే ఉంది. ఈ ఆలయంలో ఉన్న సోమేశ్వర లింగం ఒక అద్భుతంగా చెప్పుకోవాలి. ఈ లింగం వెనుక అంతుచిక్కని రహస్యం దాగుంది.

🌸గుజరాత్ లోని ప్రభాస పట్టణంలో సోమనాథ్ ఆలయం కొలువై ఉంది. త్రివేణి సంగమానికి దగ్గరలో ఉన్న ఈ సోమనాథ్ ఆలయ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలమని హిందువులు నమ్ముతారు.

🌸శివుడికి ఎంతో ప్రత్యేకమైన లింగాకారాల్లో మొదటి జ్యోతిర్లింగం ఇక్కడ కొలువుదీరింది. అయితే ఈ ఆలయం కేవలం జ్యోతిర్లింగ క్షేత్రంగానే కాదు.. రకరకాల రహస్యాలు, చరిత్రలను కలిగి ఉంది.

🌸ఈ ఆలయం వెనక దాగున్న నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

🌹12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి🌹

🌸ప్రముఖ ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో సోమనాథ్ ఆలయం ఒకటి. శివుడికి చాలా ప్రత్యేకమైనవి ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ముస్లిం ఆక్రమణదారులతో చాలా సందర్భాల్లో సుమారు ఆరేడుసార్లు సోమనాథ్ ఆలయం అపవిత్రంగా ధ్వసం చేయబడింది.

🌸కానీ ప్రతిసారి అదే ప్రాంతంలో పునర్ నిర్మించారు. చివరిసారిగా ఈ ఆలయాన్ని 1947 నుంచి 1957 వరకు ఐదేళ్లు నిర్మించారు. అప్పటి భారత రాష్ర్టపతి రాజేంద్రప్రసాద్ ఈ ఆలయాన్ని ప్రారంభించారు.

🌹గాలిలో తేలియాడే శివలింగం🌹

🌸సోమనాథ్ ఆలయంలో ఎవ్వరికీ అంతచిక్కని విచిత్రం ఉంది. అది చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం. ఆలయం మధ్యలో, భూమి లోపల ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది. గాలిలో తేలినట్టు ఉండే ఈ శివలింగం ఎవ్వరికైనా వర్ణించలేని ఒక అద్భుత దృశ్యం.

🌹లింగం ప్రత్యేకత🌹

🌸ఈ జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇదో  మహిమాన్విత శిల అని, ఇది బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగే శక్తి కలిగి ఉంది. ఈ రాయికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. కాబట్టి.. ఇది ఎలాంటి ఆధారం లేకుండా నిలబడి ఉందని చాలా మంది చెబుతూ ఉంటారు.

🌹సోమనాథ్ ఆలయ పురాణం🌹

సుల్తాన్ మహమ్మద్ ఇండియాకి వ్యతిరేకంగా మతయుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు సోమనాథ్ ఆలయాన్ని కూల్చేశారు. అలా కూల్చేయడం ద్వారా హిందువులను మహమ్మదీయులలోకి కలుపుకోవాలని భావించారు.

🌸పూర్వ శకం 1025 లో అక్కడికి చేరుకున్నాడు సుల్తాన్ మహమ్మద్. అయితే హిందువులంతా.. ఆలయంలోకి వెళ్లి..కాపాడండి అంటూ కేకలు పెట్టారు. అయినా 50 వేల మందిని చంపేసి, ఆలయాన్ని కూల్చేశారు.

🌹గొప్ప నిధి🌹

🌸ఆలయాన్ని కూల్చిన తర్వాత సుల్తాన్ మహమ్మద్ ఆలయంలోని నిధులన్నీ కాజేశారు. చాలా బంగారు, వెండి విగ్రహాలు, లెక్కలేనన్ని బంగారు, వెండి పాత్రలు అపహరించుకుపోయారు.

🌹త్రివేణి సంగమం🌹

🌸చరిత్ర ప్రకారం సోమనాథ్ పుణ్యక్షేత్రం త్రివేణి సంగమాన్ని కలుపుతూ నిర్మించారు. ఇక్కడ కపిల, హిరాణి, సరస్వతి నదుల కలయికతో త్రివేణి సంగమంగా పిలువబడుతుంది.

🌹పౌరాణిక జానపదాలు🌹

🌸చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మందిని పెళ్లి చేసుకుంటాడు. కానీ 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉంటూ మిగిలిన వాళ్లను నిర్లక్ష్యం చేస్తాడు.

🌸ఈ కారణంగా దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపిస్తాడు. దీంతో చంద్రుడు కాంతిని కొద్దికొద్దిగా కోల్పోతూ.. చివరికి ఒక రోజూ పూర్తీగా ప్రకాశాన్ని కోల్పోయి మాయమవుతాడు.

🌹చంద్రుడికి శివానుగ్రహం🌹

🌸అలా మాయమైన చంద్రుడు తర్వాత బ్రహ్మ సూచన మేరకు ప్రభాస తీర్థానికి చేరుకుని శివుడిని వేడుకుంటాడు. తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారించుకోవడానికి చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రాంతమే ఈ ప్రభాస తీర్ధము.

🌸ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలందరిని సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు.

🌹ఆలయ నిర్మాణం, పురాణాలు🌹

🌸పురాణాల ప్రకారం ఆలయాన్ని రకరకాలుగా నిర్మించినట్లు తెలుస్తోంది. చంద్రుడు సోమనాథ్ ఆలయాన్ని బంగారంతో, తర్వాత రావణుడు వెండితో, తర్వాత శ్రీకృష్ణుడు గంధపు చెక్కతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

🌸మొదట జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్ ఆలయానికి ప్రాణ ప్రతిష్ట 10వ త్రేతాయుగం సమయంలో శ్రావణమాసంలో ప్రారంభమైందట.
అంటే మొదటగా ఈ ఆలయం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైనదనే సందర్భాన్ని స్కంద పురాణంలోని ప్రభాస ఖండం వివరిస్తోంది.

🌹వేదాలు, పురాణాలు🌹

🌸గుజరాత్ లోని నెలకొని ఉన్న సోమనాథ్ ఆలయంలో పురాణ, ఇతిహాసాలు దర్శనిమిస్తాయి. పురాతన ఆలయమైన ఇందులో అనేక పురాణగాధలు కళ్లకు కడతాయి.
భాగవతం, స్కంద పురాణం, శివ పురాణం వంటి ఆనవాళ్లు ఈ ఆలయంలో కనిపిస్తాయి.

🌹శాశ్వత పుణ్యక్షేత్రం🌹


🌸ఈ పురాతన ఆలయాన్ని అనేక సార్లు కూలగొట్టారు.. మళ్లీ పునర్ నిర్మించారు. ఇస్లాం రాజులు ఈ ఆలయాన్ని కూలగొడితే.. హిందూ రాజులు మళ్లీ పునర్ నిర్మించారు.
చివరిసారిగా 1947లో ఈ ఆలయాన్ని వల్లభాయ్ పటేల్ సందర్శించి.. మళ్లీ నిర్మించాలని నిర్ణయించారు. పటేల్ మరణం తర్వాత ఈ ఆలయ నిర్మాణం భారత ప్రభుత్వం చొరవతో పూర్తయింది.

🌹మహమ్మద్ గజిని🌹

🌸క్రీ. శ 1024 గజనీ మహమ్మద్ ధార్ ఎడారిగుండా ఈ ఆలయానికి చేరుకుని తన దండయాత్రలో భాగంగా మరోసారి సోమనాథ్ ధ్వంసం చేసాడు.
ఆలయం తిరిగి గుర్జర్ పరమకు చెందిన మాల్వా రాజైన భోజి, అన్‌హిల్వారాకు చెందిన చోళంకి రాజైన భీమ్‌దేవ్‌ లు క్రీ. శ 1026 నుంచి 1042ల మధ్య ఆలయ పునర్ నిర్మాణం జరిగింది.

🌸క్రీ.శ 1296 సోమనాథ్ ఆలయాన్ని మరోసారి సుల్తాన్ అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యాలు కూల్చేశాయి. మళ్లీ క్రీ శ 1308లో సౌరాష్ట్రా రాజైన మహీపాదావ సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు.

🌹ఔరంగజేబ్ 🌹

🌸క్రీ.శ. 1375లో సోమనాథ్ ఆలయాన్ని గుజరాత్ సుల్తాన్ మొదటి ముజాఫర్ షాహ్ కూల్చేశాడు. తర్వాత క్రీ శ 1451లో గుజరాత్ సుల్తాన్, క్రీ శ 1701లో మరోసారి ఈ ఆలయం కూల్చబడింది.

🌸క్రీ శ 1701లో ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ రాళ్లతో మసీదు నిర్మించాడు. తర్వాత క్రీ.శ 1783లో పూనా పేష్వా, నాగపూరుకు చెందిన భోన్స్‌లే, ఖోలాపూరుకు చెందిన చత్రపతి భోన్‌స్లే.. ఇండోరుకు చెందిన హోల్కార్ రాణి అహల్యాభాయి, గ్వాలియరుకు చెందిన శ్రీమంత్ పతిభువా అందరూ కలిసి ఆలయాన్ని మళ్లీ పునర్ నిర్మించారు.

🌹ఆలయ ప్రవేశానికి ప్రత్యేక అనుమతి🌹

🌸హిందువులు సోమనాథ ఆలయంలో ప్రవేశించడానికి ఎలాంటి నిబంధన లేదు. కానీ.. హిందువులు కాకుండా వేరే
మతస్థులు ఆలయంలో ప్రవేశించాలంటే.. ప్రత్యేక అనుమతి అవసరం. నిజమే.. ఇతర మతస్థులు ఆలయంలోకీ వెళ్లాలంటే.. ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి, వెళ్లడానికి సరైన కారణాలు చెప్పాలి, అలాగే అధికారులను ఒప్పిస్తేనే ఆలయ ప్రవేశానికి అర్హులవుతారు.

🌹ఆలయంలో నోటీస్🌹

🌸సోమనాథ్ ఆలయంలోని జ్యోతిర్లింగం హిందువులకు ప్రత్యేకమైనది. ఇటీవలే ఆలయం బయట నోటీస్ పెట్టారు. హిందువులు కాకుండా ఇతర మతస్థులు ఆలయంలో ప్రవేశించాలంటే.. ఆలయ జనరల్
మేనేజర్ తో పర్మిషన్ తీసుకోవాలని వివరిస్తూ ఈ నోటీస్ ఏర్పాటు చేశారు.
అనేకసార్లు ఈ ఆలయం మహమ్మదీయుల చేత కూల్చబడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.

🌹నిర్మాణ శైలి🌹

🌸చాళుక్యుల నిర్మాణ శైలిలో ప్రస్తుతం ఆలయ నిర్మాణం జరిగింది. 150 అడుగల ఎత్తులో ఆలయ శిఖరం ఉంటుంది. సోమనాథ్ ఆలయానికి ఉన్న కలశం బరువు 10 టన్నులు. 27 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభానికి ఉన్న జెండాను రోజుకి మూడు సార్లు మారుస్తారు.

🌹బాణ స్తంభం, మరో అద్భుతం🌹

🌸సోమనాథ్ ఆలయం నిర్మించిన
స్థలానికీ, దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ ఖండానికీ మధ్య భూభాగమన్నదే లేదు. ఈ విశేషాన్ని సంస్కృత భాషలో తెలియజేస్తున్న ఒక శాసనం అక్కడి బాణ స్తంభం లేదా యారో పిల్లర్ మీద చెక్కబడింది.

🌸వెయ్యి ఏళ్ల క్రితం ఈ బాణ స్తంభం అక్కడి సముద్రతీరాన ఉన్న రక్షణ కుడ్యముపై నిర్మించారు. ఈ బాణ స్థంభం ఉత్తర దక్షిణ
ధృవాల కేంద్ర బిందువుగా భావిస్తారు. 
చూశారుగా.. ఇది సోమనాథ్ ఆలయం వెనక ఉన్న ఆశ్చర్యకర, అంతుచిక్కని విషయాలు.


నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి,  కూర్చుని త్రాగండి.
2➕ వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా A. C.లో పడుకుంటే శరీరం పెరిగి లావై పోతారు.          
 3➕ 70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు నొప్పి తగ్గించే మాత్రలు ఏవీ కూడా అంతగా చేయవు.
4➕ కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.
5➕ అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలని అనారోగ్యం పాలు చేయటానికి వాడేవారు.
6➕ షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు త్రాగితే అమృతం వలే పనిచేస్తాయి.
7➕ పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో  బాగవుతారు.
8➕ దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు.
9➕ ఈ మంచి మాటలు, మంచివారికి, తమకు ఇష్టమైన మిత్రులకు, బంధువులకు మరియు గ్రూపులో తప్పక షేర్ చేయండి. ఈ విధంగా నైనా మనం ఒకరి జీవితం రక్షించిన వారమవుతాం. ......
         ధన్యవాదములు మీ శ్రేయోభిలాషి*


కాశి ఆలయ చరిత్ర*
 👉 కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం. 
👉 కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.
👉 క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం
👉 క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన
👉 క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం
👉 క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు
👉 క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి     👉 క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్   👉 క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం👉 క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు    👉 శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి    👉 క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు      👉 క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం       👉 క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం      👉 క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు  👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్  👉 కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం👉 ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు   👉 కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం    ల👉 184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.   👉 12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.  👉 కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.   👉 మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.     👉 కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.     👉 విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.
👉 ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.    👉 ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.    👉 2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి, కారణజన్ముడు, యుగపురుషుడు, మన హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.    శ్రీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభం అయిన తరువాత రోజూ 60 వేల మంది పైగా భక్తులు దర్శనానికి వస్తున్నారు.
🙏 ఈ మెసేజ్ చదివి ఊరుకోవడం కాకుండా మీకు వీలైనంత వరకు తప్పకుండా అందరికీ ఫార్వర్డ్ మరియు షేర్ చేయగలరు.




శివుని కి ఏ అభిషేకం వలన ఏం ఫలితములు ?

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును 
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును. 
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
 7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును  
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును. 
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
 11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. 
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
 14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.
 15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము తొలగుతుంది.
 16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
 17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న      లింగార్చనకు        ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది  (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన  అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా  బాగుంటుంది అన్న లింగార్చన).
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు. 
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది. 
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును. 
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవ byర్తివ్తము లభించును. 
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని  కలిగించును. 
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. 
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

సర్వేజనా సుఖినోభవంతు...









భస్మం ...!! 🎻🌹🙏 *

🌿కైలాసం నుండి శంకరుడు బ్రాహ్మణుని వేషములో ఒకనాడు రాముడి వద్దకు వెళ్లెను. రాముడు మీ యొక్క నామమును నివాసమును తెలుపుమని అడుగగా...

🌸 " నా పేరు శంభుడు నేను  కైలాసం నా యొక్క నివాసము అని రాముడికి చెప్పగా గ్రహించి అతనిని శంకరునిగా గ్రహించి రాముడు వీభూతి యొక్క మహిమ ను తెలుపవలసినదని అని అడుగగా శివుడు చెప్పసాగెను.  

      🌿 " రామా ! భస్మమహత్యమును చెప్పుటకు బ్రహాదులకు కూడా శక్యము కాదు. బట్టమీది చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచి వేయగలిగే శక్తి భస్మంనకు ఉన్నది. 

🌸 విభూతిని మూడు రేఖలుగా పెట్టుకున్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లగును.    
       
🌿 ముఖమున భస్మమును ధరించిన నోటి పాపములను (తిట్టుట, చెడు మాటలు పలుకుట, అభక్ష్యములను తినకూడదని పధార్థములను తినడం  అనుపాపములు). 

 🌸 చేతులపై ధరించిన చేతి పాపములను ( కొట్టటం మొ") హ్రదయముపై ధరించిన మనఃపాతకములను (దురాలోచనాలు మొదలైనవి) నాభిస్తానమున ధరించుట వలన వ్యబిచారది దోషములనూ.. 

🌿 పక్కలందు ధరించుటవలన పరస్త్రి స్పర్ష దోషములను పోగొట్టును పాపములను భర్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది. 

 🌸 కావున భస్మము అని పేరు దీనికి కలిగెను. భస్మము మీద పడుకొన్నను, తిన్ననూ, ఒంటికి పూసుకున్ననూ పాపములన్ని భస్మీభూతములు అగును. 

🌿 ఆయువు పెరుగును. గర్భిణి స్త్రీలకు సుఖ ప్రసవం కలిగించును సర్ప వృశ్చికాదీ దోషములను హరించును భూత పిశాదులను పారద్రోలును."            

🌸వశిష్ట వంశములో ధనంజయుడను  ఒక విప్రుడు ఉండెను అతనికి వందమంది భార్యలు  వందమంది కొడుకులు వారందరికి తన ధనాన్ని అంతా సమానంగా పంచిఇచ్చి..

🌿ఆ బ్రాహ్మణుడు గతించెను కొడుకులు అసూయతోను దురాశతోను ఒకరి ధనము కోసం  ఒకరు ఆశపడుచు తన్నుకోసాగిరి. 

🌸వారిలో కరణుడను కొడుకు శత్రు విజయము సాధించవలెనని గంగా తీరమునకు వెళ్లి స్నానం చేసి తపము చేయవలెననుకొని మునులసేవ చేయుచుండగా...

🌿 ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతియని ఒక నిమ్మపండుని తెచ్చి అక్కడ పెట్టెను.  దానిని వీడు వాసన చూసేను.అoదుకు మునులు గ్రహించి ఈగవై పొమ్మని శపించిరి.

🌸 వీడు వేడుకొనగా పూర్వస్మృతిని ఇచ్చిరి. అంతటా ఏడ్చుచు వెళ్లి జరిగిన విషయం భార్యకు చెప్పెను. 

🌿అతని భార్య పతివ్రత చాల విచారించెను. ఒకనాడు  ఈ సంగతి తెలిసి వాని సోదరులు పట్టి చంపిరి. అతని భార్య ఈగ దేహమును తీసుకోని అరుంధతి దగ్గరికి వెళ్లి ప్రార్ధింపగా ....

🌸 ఆమె మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని చల్లి కరుణుని బ్రతికించెను. 

🌿మరొకసారి దాయాదులు కరణుని చంపి యింటి ముందు పారవేసిరి. అతని భార్యయైన శుచిస్మిత భర్త దేహముతో వనములో తిరుగుచుండగా దధీచి ముని కనపడెను.  ఆమె ఆ మునికి విషయమంతా తెలిపి ప్రార్ధింపగా...

🌸 ఆయన భస్మముతో ఆ బ్రహ్మహత్యా పాపమును పరమశివుడు పోగొట్టెను. దానినే ఇతనిపై చల్లుచున్న అని చెల్లెను అతడు శాప విముక్తుడయి జీవించెను.

🌿 దేవతలు  కూడా భస్మ ప్రభావమును పొగిడిరి కరుణ దంపతులు దధీచి మునిని తమ ఇంటికి పిలిచి భోజనం పెట్టిరి.

🌸 అతడు వారిని దీవించి వెడలిపోయెను. ఆవుపేడ పిడుకలను శతారుద్రీయ (నమకము) మంత్రము చెప్పుచూ కాల్చి భస్మము చేయవలెను. మంత్రములు రాకున్నచో ప్రణవము ఉచ్చరించుచు ధరింపవలెను.

ఏ మంత్రము రానీ వారు 
 ఓం నమశ్శివాయ మంత్రముచే భస్మమును ధరించుట శ్రేష్టం  అని ''పద్మ పురాణము లో చెప్పబడినది...
          🚩🌞🙏🌹🎻




ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏

జగన్మాత చిరునామా..🙏

గుళ్లో విగ్రహానికి, ఇంట్లో పటానికి పూజలు చేస్తాం, నివేదనలు సమర్పిస్తాం. 
అంతే తప్ప అమ్మవారి అసలు రూపురేఖలేంటో, 
ఆ చల్లనితల్లి జాడేమిటో మనకు తెలీదు. 

భక్తిగా అర్చిస్తూ, కష్టాన్నీ సుఖాన్నీ చెప్పుకునే మన ఆరాధ్యదైవం అమ్మ చిరునామా ఎక్కడో, 
ఆ తల్లి తత్వమేంటో తెలుసుకుందాం...

మేరుపర్వతం మధ్యశిఖరంపై గల శ్రీమన్నగరానికి నాయకురాలిగా చింతామణి గృహంలో, 
పంచ బ్రహ్మాసనంపై అమ్మ ఆసీనురాలై ఉంటుందని ‘దేవీ భాగవతం’ చెబుతోంది. 

బ్రహ్మాండ పురాణంలోని లలితా సహస్రనామ స్తోత్రంలో సుమేరు శృంగ మధ్యస్థా, 
శ్రీమన్నగర నాయికా, చింతామణి గృహాంతస్థా, 
పంచ బ్రహ్మాసన స్థితా, మహా పద్మాటవీ సంస్థా, కదంబ వన వాసినీ, సుధా సాగర మధ్యస్థా- నామాలలో ఈ ప్రదేశాలన్నీ దేవీ నివాస స్థానాలుగా వర్ణించారు వ్యాసులవారు.

లలితాదేవి శరన్నవరాత్రుల వేళ మణిద్వీపంలో కొలువై ఉంటుంది. 
ఆ ద్వీపం ఎక్కడంటారా?! 
మనం ఉంటున్న ఈ భూమినుంచి వరుసగా 
ఏడు ఊర్ధ్వ లోకాలున్నాయి. 
వాటిలో సత్యలోకం అన్నిటికంటే పైనుంది. 
ఆ పైన వైకుంఠ కైలాసాలు, 
అంతకంటే పైన గోలోకం, 
ఆపైన మణిద్వీపం. 
ఇది అమృత సముద్రం మధ్యలో ఉంది. 
ఈ ద్వీపంలో ఉన్న చింతామణి గృహం అమ్మకు నివాస స్థానం. 
గొప్ప గొప్ప పద్మాలున్న అడవిలో, 
కడిమిచెట్ల తోటలో చింతామణులతో కట్టిన ఇల్లది. ఆ ఇంట్లో ఐదు శక్తులతో ఏర్పాటైన ఒక ఆసనంపై లలితాదేవి దర్శనమిస్తుందట. 
అమ్మని దర్శించుకోవాలంటే, ఈ ప్రదేశాలన్నీ దాటి వెళ్లాలి.

ఇంటిపక్కనున్న గుడికి వెళ్లడానికే అలసిపోయే మనం అంతదూరం ప్రయాణించడం కొంచెం 
కష్టమైన వ్యవహారమే. 
అయితే లలితా సహస్రనామ స్తోత్రంలోని 
️‘అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా’ ️నామాలు దారి చూపిస్తాయి. 

మనం అనుసరించే మార్గం బహిర్ముఖమైతే, 
అమ్మను చేరుకోవటం దుర్లభం. 
కానీ సాధకులు అంతర్ముఖులైతే మాత్రం తనలోనే అమ్మను దర్శించి, సేవించగలుగుతారు. 
చిత్తశుద్ధితో సాధనచేస్తే మనసులో లేనిపోని ఆలోచనలేవీ రావు. 
అప్పుడు ఆ మనసే అమృత సముద్రమై, 
అమ్మకు నివాసం అవుతుంది.

మేరుపర్వత మధ్యశిఖరాన అమ్మ ఉందనుకున్నాం కదా! ‘మేరు’ పదంలో- ‘మ- అ- ఈ- ర- ఉ’ అక్షరాలున్నాయి. 
వీటిలో మధ్యనున్న ‘ఈ’ అక్షరం అమ్మ నివాసం. 
‘ఈం’ అనే ఈ అక్షరమే ఐం, శ్రీం, హ్రీం, క్రీం, క్లీం మొదలైన  బీజాక్షరాలకు మూలం. 
దేవీ మంత్రం దీక్షగా జపిస్తే, 
అమ్మదర్శనం కోసం పరితపిస్తే.. 
అప్పుడు హృదయాలు బంగారు కొండలవుతాయి. కల్మషంలేని పవిత్ర హృదయమే మేరు పర్వతం. 
అది అమ్మకు నివాసం.

ఆ మణిద్వీపంలోని శ్రీమన్నగరానికి నాయకురాలు లలితాదేవి. 
‘శ్రీ’ అంటే శోభ, సంపద, శ్రేయస్సు, ఆనందం. 
మన శరీరంలోని ఐదు కర్మేంద్రియాలూ, 
ఐదు జ్ఞానేంద్రియాలకూ అధిదేవతలున్నారు. 
కనుకనే ‘దేహమే దేవాలయం’ అన్నారు పెద్దలు. నిత్యమూ ధార్మిక చింతన, ఆధ్యాత్మిక సాధన సాగినప్పుడు అందాకా నిద్రాణంగా ఉన్న శక్తులన్నీ మేలుకుంటాయి. 
అప్పుడు శరీరమనే శ్రీమన్నగరంలోనే భక్తులకు 
అమ్మ దర్శనమిస్తుంది.

మణిద్వీపంలో పద్మాలు విరబూసిన అడవి, 
కదంబ వనము ఉన్నాయి. 
లోకంలోని పద్మాలన్నీ సూర్యోదయంతో వికసించి, సూర్యాస్తమయంతో ముడుచుకుంటాయి. 
కానీ అవి మాత్రం ఎప్పుడూ వికసించే ఉంటాయి. 
ఆ విశిష్ట పద్మాల్లోనే నివాసం ఏర్పరచుకుంది అమ్మ. మన దేహంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న పద్మాలు యోగ సాధనవల్ల వికాసం పొందుతాయి. 
ఆనందమనే మకరందంతో ఉప్పొంగుతాయి. 
ఆ వికసిత మనసుల్లో లలితాదేవి కొలువుతీరి ఉంటుంది.

కడిమిచెట్టుకు ‘నీపము’ అని ఇంకో పేరుంది. 
అంటే అది జీవుడికి దేవుడితో తాదాత్మ్యం కలిగిస్తుందన్నమాట. 
కడిమిచెట్టు మేఘాలను ఆకర్షించి, వర్షాలను కురిపిస్తుందని విజ్ఞాన శాస్త్రం చెప్తోంది. 
నింగినుంచి నేలకు దిగివచ్చే దైవానుగ్రహానికి 
సంకేతం వర్షం. 
సన్మార్గంలో జీవించే వారికి దైవానుగ్రహం సిద్ధంగా ఉంటుందనే సత్యాన్ని కదంబవనం సూచిస్తోంది. 
ఈ సత్యాన్ని గుర్తించి, ప్రవర్తించేవారి మానస కదంబవనం అమ్మ నివాసం.

కల్పవృక్షం, కామధేనువుల్లానే కోరినవన్నీ ప్రసాదించేది చింతామణి. 
అలాంటి చింతామణులతో కట్టిన ఇల్లు అమ్మది. భక్తులకు కావలసినవన్నీ ఇచ్చే అమ్మవారి గుణమే 
ఆ తల్లి నివసించే ఇంటికి కూడా అబ్బింది. 
ఆ గుణాన్ని అలవరచుకుంటే, చింతామణీ మంత్రజప సాధన ఫలిస్తుంది. 
భక్తుల దివ్య దేహమే చింతామణి గృహమై అంతర్ముఖంగా అమ్మదర్శనం లభిస్తుంది. 

ఆ గృహంలో పంచబ్రహ్మాసనంపై కూర్చుని దర్శనమిస్తుంది లలితాదేవి. 
బ్రహ్మ అంటే శక్తి. 
ఐదు శక్తులతో ఏర్పాటైన ఆసనం అది. 
సృష్టి, స్థితి, లయం, తిరోధానం, (కనిపించకుండా ఉండటం) అనుగ్రహం- అనే ఐదు పనులను ఐదుపేర్లతో నిర్వహిస్తోంది అమ్మ. 
అందుకు సంకేతం పంచబ్రహ్మాసనం. 
సాధనవల్ల ఈ సత్యాన్ని గుర్తించిన భక్తుణ్ణి కామక్రోధాలు మొదలైన అరిషడ్వర్గాలు 
ఏమీ చేయలేవు.

మనకు అందకుండా ఎక్కడో దూరంగా ఉన్నదనిపించే అమ్మ నివాసం ఇక్కడే మనకు అందుబాటులోనే మనలోనే  ఉంది. 
సాధన వల్ల అది అనుభవానికి వస్తుంది. 
నిర్మలమైన మనసే అమ్మవారి అసలైన చిరునామా.
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
(సేకరణ)
💐#శుభమస్తు💐

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..🙏
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః..


బిల్వ వృక్షానికి నమస్కరిస్తూ చదువుకోవలసిన శ్లోకం 🙏

బిల్వవృక్ష నమస్తేస్తు సాధన! 
మూలతో భవరూపాయ మధ్యతో మృడరూపిణే!
అగ్రతః శివరూపాయ పతైర్వేదస్స్వరూపిణే!
స్కందే వేదాంతరూపాయ తరురాజాయ తే నమః!! 
నమస్తే బిల్వతరయే భానుసోదరతే నమః! 
శివపూజోద్యతాభీష్ట సాధనాయ నమోనమః!!

🌿 బిల్వవృక్షం మూలంలో శివుడు భవుడు అనే పేరుతోను, - మధ్యంలో మృడ అనే పేరుతోను, - అగ్రము నందు శివ అనే పేరుతోను, - పత్రములందు వేదరూపం గాను, కాండము నందు వేదాంతరూపునిగాను, సూర్యునికి, సోదరస్వరూపము గాను ఉన్నటువంటి బిల్వవృక్షరాజమునకు నమస్కారము అని రెండు చేతులూ దోయిలించి నమస్కరించి ప్రదక్షిణ చేయాలి.


🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏















0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్