25, ఫిబ్రవరి 2018, ఆదివారం

COLLECTIONS OF FB


" సాక్షి మాత్రంగా సంసారజీవనం "
దుకాణానికి వెళతాము. ఒక్కడే యజమాని ఉంటాడు. రాకరకాల వస్త్రాలను గుమాస్తాలు చూపిస్తారు. విసుగు లేకుండా వర్ణిస్తారు . చివరకు ఒక్క వస్త్రం తీసుకుంటాం. బిల్లు ఇస్తారు. చెల్లించిన తరువాత," అయ్యా వెళ్ళండి ఇంకా కొనేవారు వస్తున్నారు చోటివ్వండి" అని అంటారు. ఆమాదిరి మానవుడు కూడా పని అయ్యేవరకూ అంటే వేద విహిత ధర్మం ఆచరించడం కోసం, సుఖలాభం కోసం, పుత్రా మిత్రులయందు, మమకారం ఉండవచ్చు. ఆ పనియ్యాక మమకారాన్ని ఆదరాన్ని వదులుకోవాలి మన ఇల్లు మన తల్లి మన కుక్క అనుకుంటే కుక్క చచ్చిపోయినా బాధ పడతాం. కాబట్టి అంతా ఈశ్వరరూపం అనుకోని తాను సాక్షిగా ఉంటే, క్రమంగా మనస్సు భగవంతుని పై లగ్నమైపోతుంది. బట్టల కొట్టుకు వచ్చిన జనుల మీద, యజమానికి ఎంత ఆదరం ఉందొ, అంతవరకే మనమూ సంసారం మీద ఆదరం పెట్టుకోవాలి. క్రమంగా ఈశ్వరుడు నేను ఒక్కటే అన్న ఐదవరకం భక్తీ మనకు సిద్దిస్తుంది .


------ శ్రీ కంచి పరమాచార్య. (collected from FB OF GRS post on 250218
సూర్య స్తోత్రం !
సంస్కృత వ్యాసభారతంలోని వేయి నామాలు కలిగిన సూర్యసహస్రనామస్తోత్రాన్ని నన్నయ గారు ఆంధ్రమహాభారతంలో కేవలం ఒక లయగ్రాహివృత్తంలో క్లుప్తీకరించి వ్రాసి, ఎల్లరూ నిత్యం పారాయణ చేసేందుకు వీలుగా, అరణ్యపర్వంలో నిక్షేపించారు. సూర్యపారాయణ వల్ల ఆయుర్ వృద్ధి కాగలదని ఆదిత్యహృదయం చెబుతున్నది.

లయగ్రాహి: 
"వారిరుహమిత్రు, నమరోరగ మునిద్యుచరచారణగణ ప్రణుత చారుగణు, లోకా
ధారు, అఖిలశ్రుతిశరీరు హరి, శంకర సరోరుహభవ ప్రతిమున్ దారుణతమిస్రా
వారణ మరీచి పరిపూరిత దిగంతరున్, భూరికరుణానిరతున్, సూరు, త్రిజగద్ర
క్షారతున్, సహస్రకరున్ కోరి భజియింపుము మనోరథఫలంబులగు భూరమణ నీకున్"
ధౌమ్యమహర్షి ధర్మరాజుతో, ఓ మహారాజా, పద్మాలకు మిత్రుడు, దేవతలు, పాములు, మునులు, ఆకాశంలో చరించేవారు, దేవ గాయకులైన చారణులు మొదలైనవారి చేత పూజింపబడేవాడు, సమస్త లోకాలకు ఆధారభూతుడు, సమస్తవేదరూపుడు, విష్ణువుతో, శివుడితో, బ్రహ్మదేవుడితో సమానుడు, ఘోరమైన చిమ్మచీకట్లను తన వేవెలుగులతో పోగొట్టి దిగంతరాలను ప్రకాశింపజేసేవాడు, గొప్ప దయాస్వరూపుడు, విజ్ఞాని, మూడులోకాలను రక్షించటానికి పూనిక గలవాడు, వేయికిరణాలు గలవాడైన సూర్యదేవుని, నీ మనోసిద్ధి కొరకై ప్రార్ధించుము అని చెబుతాడు.collected from FB OF Jajisarma  post on 250218
శివానందలహరి
7 వ శ్లోకం
(25-02-18)
" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:
పైశ్లోకాలలో చెప్పినట్లు శంకరులు తమ బుద్ధి ని శివ భక్తి యందు లగ్నం
చేసి, తమ మనస్సు, వాక్కు మొదలయిన ఇంద్రియాలకు కూడా ఇతర
విషయాలపై ఆసక్తి లేకుండా పరమ శివుని సేవాసక్తిని కల్పింౘుమని
ఈశ్వరుని ఈ శ్లోకంలో ప్రార్థించారు.
శ్లో". మనస్తే పాదాబ్జే - నివసతు వచః స్తోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం - శ్రుతిరపికథాకర్ణనవిధౌ,
తవధ్యానే బుద్ధి - ర్నయనయుగళం మూర్తి విభవే
పరగ్రంథాన్ కైర్వా - పరమశివ ! జానే పరమతః !!
పదవిభాగం:
మనః,తే,పాదాబ్జే - నివసతు - వచః - స్తోత్రఫణితౌ - కరః - - చ -
అభ్యర్చాయామ్ - శ్రుతిః , అపి ,కథాకర్ణనవిధౌ, తవ, ధ్యానే, బుద్ధిః
నయనయుగళం - మూర్తి విభవే - పరగ్రంథాన్ - కైః - వా - పరమశివ -
జానే - పరమ్ - అతః.
తాత్పర్యము:
ఓ పరమశివా ! నామనస్సు నీ పాద పద్మము నందూ, నావాక్కు
నీ స్తోత్రాలు పాఠమునందూ, నా చేయి నీ సేవయందూ , నాచెవి నీ కథలను
వినుటయందూ , నా బుద్ధి నిన్ను ధ్యానింౘుటయందూ, నా కన్నులు నీ
దివ్య మంగళ విగ్రహాన్ని దర్శింౘుటయందూ, లగ్నమై యుండు గాక.
ఈ విధంగా,నామనస్సు, వాక్కు, హస్తము, చెవి, నేత్రము, బుద్ధి అనే
ఇంద్రియాలు ఆరూనూ, నీ సేవా కథాకర్ణన ధ్యాన ము లందే లగ్నములై
యుండగా,నేను ఇంక వేటితో ఇతర గ్రంథాలను తెలుసుకోడానికి
ప్రయత్నిస్తాను ? ఆ ఇతర గ్రంథాలలో సైతం , నీ తత్వమే ప్రతిపాదింప
బడి వుంటుంది. కాబట్టి ఇతర గ్రంథాలను ౘూడవలసిన అవసరమే నాకు
ఉండదని భావము.
వివరణ:
ఆరు ఇంద్రియాలనూ శంకరుని కైంకర్యానికి వినియోగిస్తే , ఇతర గ్రంథాలను
ౘూడవలసిన పనిలేదని శంకరులవారి కృపాభి భాషణం.
భాగవతంలో ప్రహ్లాదుడు కూడా ,మన శరీరం లోని సర్వేంద్రియాలూ
భగవత్సేవలో పాలు పంౘుకోవాలనీ, అప్పుడే అవి సార్థకము లవుతాయనీ
ఇలా చెప్పాడు.సూది లాంటి పర్వతం పై శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం...


భక్తుల రక్షణార్ధం, వారి కోరిక మీద భగవంతుడు అర్చామూర్తిగా అనేక చోట్ల వెలిశాడని అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వరస్వామి వెలిసిన జమలాపురం క్షేత్రం. ఈ ప్రాంతాన్ని ఇదివరకు సూచీగిరి అనేవారు. అంటే సూదిలాగా వున్న పర్వతం. నిటారుగా వుండే ఈ చిన్ని కొండని ఎక్కటానికి చాలా కష్టపడాల్సి వచ్చేదిట. పూర్వం జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారని, ఆయన కోరిక మీద శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ వెలిశాడనీ అంటారు. స్ధల పురాణం ప్రకారం జాబాలి మహర్షి దశరధ మహారాజు కొలువులో గురు స్ధానంలో వున్నారు. ఆయనకి శ్రీరాముడంటే అత్యంత ప్రేమ.



సూది లాంటి పర్వతం పై శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం…

సీ". కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీ నాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
తే" దేవదేవుని చింతించు దినము దినము

క్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి హరిఁ జేరుమనియెడి తండ్రి తండ్రి!!


collected from FB OF munneswara enamundrum  post on 250218

సూది లాంటి పర్వతం పై శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం...
భక్తుల రక్షణార్ధం, వారి కోరిక మీద భగవంతుడు అర్చామూర్తిగా అనేక చోట్ల వెలిశాడని అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వరస్వామి వెలిసిన జమలాపురం క్షేత్రం. ఈ ప్రాంతాన్ని ఇదివరకు సూచీగిరి అనేవారు. అంటే సూదిలాగా వున్న పర్వతం. నిటారుగా వుండే ఈ చిన్ని కొండని ఎక్కటానికి చాలా కష్టపడాల్సి వచ్చేదిట. పూర్వం జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారని, ఆయన కోరిక మీద శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ వెలిశాడనీ అంటారు. స్ధల పురాణం ప్రకారం జాబాలి మహర్షి దశరధ మహారాజు కొలువులో గురు స్ధానంలో వున్నారు. ఆయనకి శ్రీరాముడంటే అత్యంత ప్రేమ.
collected from FB OF OUR CULTURE AND TRADITION post on 250218

తస్మై శ్రీ గురవే నమః పూజ్యగురుదేవులు షణ్ముఖుల భాగవత ప్రవచన మకరందాలు 24 th ఫిబ్రవరి.
దేవకీ వసుదేవలకు కృష్ణుడు బ్రహము మరియు పుత్రుడు అనే భావం,నంద యశోద లకు మాత్రం పుత్రుడనే భావం మాత్రమే.ఇరువురూ ముక్తి పొందారు.
భాగవత శైలి యోగశైలి.నందయశోదలు మొత్తం వ్రేపల్లె వారు కృష్ణుని మన వాడు అనుకోని ముక్తిని పొందారు.
ఒకసారి నందుడు మధుర కు కప్పం కట్టడానికి వెళ్లారు.అక్కడ ఆయన వచ్చారని తెలిసి వసుదేవుడు కలిశారు వీరు ఇరువురూ మంచి స్నేహబంధవ్యాలు ఉన్నవారు ఆనందం తో నీకు కుమారుడు కలిగాడు ట కదా అని నందుణ్ణి అడుగారు.అవును నాకు మంగళమే. నీ వార్తలు విన్నాను నీ సంతానం మొత్తము గతించారు అని కడపటి గా ఆడశిశువు కూడా పోయింది అని దిగులు పడకు ప్రారభ్డాలు ఇవన్నీ అని నందుడు అంటుంటే బయటపడకుండా వసుదేవుడు విన్నాడు.నా పిల్లాడు రోహిణీ ఎలా ఉన్నారు అని అడిగితే బాగున్నారు అని నందుడు అన్నారు .వెంటనే నందుడు నువ్వు బాధ పడకు నా సంతానం మన అందరికే సంతానమే అన్నాడు. ఇక్కడి నుంచి మీరు తొందరగా వెళ్లిపోవాలని దుష్ట శక్తులు ని కంసుడు అన్ని ప్రాంతాల్లో పంపాడు అని చెప్తాడు వసుదేవుడు.
సరే అని నందుడు బయలుదేరారు ఆయన వెళ్ళేటప్పటికే అక్కడ ఘోరం జరిగింది ఇది కృష్ణలీలల్లో మొదటి లీల
పూతన పిల్లల్ని హతమార్చే ఒకానొక దుష్టశక్తి ఈవిడ కి బాలఘాతిని అని పేరు.ఈవిడ ఇప్పటికే చాలా మంది పిల్లలుని భక్షించింది. కానీ శ్రీకృష్ణుని దగ్గరకు మాత్రం రూపం మార్చుకుని వెళ్ళింది ఎలా అంటే భగవంతుడు దగ్గరకు వెళ్ళినప్పుడు మడి కట్టుకున్నట్లు.అందంగా తయారయ్యింది అన్ని ఇళ్లు వెతుక్కుంటూ వెళ్తోంది.నన్దవ్రజం వారు కూడా ఈమె ఎవరో కొత్తఆవిడ లా ఉండే అనుకుంటున్నారు.సరిగ్గా కృష్ణ గృహానికి వచ్చేటప్పటికి నాదం లా ఏడ్చారు శ్రీకృష్ణులవారు.
నందగృహమున బాలుని నాద మొకటి
విని ప్రమోదించి సుందరీవేష
యగుచు.
ఆమె ను చూడంగానే బాలికలను మట్టుపెట్టే ఒకానొక దుష్టశక్తి లా గ్రహించారు.నిద్రిస్తున్నట్లు నటిస్తున్న పిల్లవాడిని ఉయ్యాలలో తీసి ఒళ్ళో పెట్టుకుంది.చక్కగా అలంకరించుకున్న ఆమె ఎవరా అని ఆలోచించే లోపలే స్తన్యం ఇవ్వడం మొదలు పెట్టింది.ఆ స్తన్యం తో పాటుగా ఆమె ప్రాణాలు కూడా తాగటము మొదలు పెట్టారు.ఆ పాలు తాగే విధానం ఎలా అంటే ఆమె శరీరంలో నాడులన్ని లాగపడుతున్నాయి.అది తట్టుకోలేక ఆమె అసలు శరీరం గ్రహించింది.యోజనమ్మున్నర శరీరం గల ఆమె పడిపోయే సరికి అనేక వృక్షాలు పైన పడిపోయింది ఆ చప్పుడు కి అందరూ వచ్చారు.రోహిణీ, యశోద లు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో అని ఆందోళన పడి వచ్చేటప్పటికి ఆమె పైన ఆడుకుంటూ కనిపించారు.అమ్మయ్య అనుకోని యశోద.ఎత్తుకొని ఉన్న కృష్ణునికి గండం గడిచింది అని దిష్తి తీసి నారాయణ లీల అనుకుంటున్నారు.
ఈ దిష్తి తీసే సందర్భంగా 8 శ్లోకాలు వస్తాయి మంత్ర సమానమయినవి. అవి పిల్లలకు తీసేటప్పుడు చదివితే మంచిది.ఆ నామాలు రక్షించుగాక అంటారు నారాయణ భట్టాద్రి.
*కృష్ణుడు విషాన్ని పుచ్చుకున్న లీలలు వింటే మన బాధలు పోతాయి*
ఈ విధంగా స్వామి కి గోవు తోక తో ను ,గోమాత గిట్టల వల్ల వచ్చే ధూళి తో,గోమూత్రం తో,గోవు పీడకల ను కాల్చినప్పుడు వచ్చే భస్మం తో దిష్తి తీశారు.
గోభక్తుడు గోవిందుని అనుగ్రహానికి పాత్రుడు.
ఈ నామాలు చెప్తూ తీశారు
*ఇవి విష్ణు నామ మంత్రరాసి.

పుట్టుక లేని శ్రీహరి నీ పాదాలు రక్షించు గాక
కౌస్తుభదారి నీ మోకాళ్ళు రక్షించు గాక
యజ్ఞరూపుడు నీ వూరువులు రక్షించు గాక
అచ్యుతుడు నీ నడుము ను రక్షించు గాక
హాయగ్రీవుడు నీ ఉదరాన్ని రక్షించు గాక
సర్వశక్తి మంతు డైన శ్రీహరి నీ హృదయాన్ని రక్షించు గాక
సర్వాతర్యామీ నీ వకఃస్థలం ని రక్షించు గాక
సూర్యరూపుడైన నారాయణస్వామి నీ కంఠాన్ని రక్షించు గాక
సర్వవ్యాపాకమైన విష్ణువు నీ చేతులు రక్షించు గాక
త్రివిక్రముడు నీ నోటి ని రక్షించు గాక
సర్వనియామకుడు నీ శిరస్సు ను రక్షించు గాక
చక్రపాణి నీ ముందు రక్షించు గాక
గదాదారి నీ వెనుక రక్షించు గాక
ధనుర్ధారి మధుసూదనుడు ఒక పక్క నిన్ను రక్షించు గాక
ఖడ్గము పట్టుకున్న విష్ణువు మరోపక్క రక్షించు గాక
శంకదారి అయిన శ్రీహరి దిక్కులమూలలలో నిన్ను రక్షించు గాక
వామనుడు పైన రక్షించు గాక
గరుడవాహనుడు అయిన హరి నిన్ను నెల పై రక్షించు గాక
పరిపూర్ణుడయిన హరి నిన్ను సర్వత్రా రక్షించు గాక
ఆడుకుంటున్న నిన్ను గోవిందుడు రక్షించు గాక
నిద్రిస్తున్న నిన్ను మాధవుడు రక్షించు గాక
పరిగెడుతున్న నిన్ను వైకుంఠవాసి రక్షించు గాక
కూర్చున్న నిన్ను శ్రీయహ్పతి రక్షించు గాక
తింటున్న నిన్ను యజ్ఞభోక్త రక్షించు గాక

సర్వాగ్రహ భయంకరుడైన నారాయణ స్వామి నిన్ను ఎల్లవేళలా రక్షించు గాక
ఒకటి నుంచి 14 దాకా వచ్చే బాల బాధల్ని బాలాగ్రహదోషములంటారు
*బడికి పంపే పిల్లలకు విష్ణు నామాలు చెప్పించండి వారి బ్రతుకులు బాగుపడతాయి*
ఇలా అందరూ దిష్టి తీసి కవచ భావన చేశారు.ఈ లోపల నందుడు వచ్చి వసుదేవుడు చెప్పింది నిజమే ఆయన కి గొప్ప శక్తులు వచ్చ్హాఏమో అనుకున్నాడు
ఇప్పుడు సమస్య అంత పెద్ద శరీరం ఎక్కడ తగలెయ్యాలి అనుకోని చివరికి గొడ్డళ్లతో ఆ శరీరాన్ని నరికి అన్ని కలిపి దహనం చేశారు.ఆశ్చర్యం గా సుగంధద్రవ్యాల వాసనలు ఆ శరీరం నుంచి వస్తున్నాయి.ఎందుకంటే శరీరం పవిత్రమైపోయింది.స్వామి స్పర్శ మాత్రము చేత ఆ పూతన పాపము మొత్తం పోయింది.చిన్నికృష్ణ పాదాలు చేతులు తగిలాయి.
లోకం లో ఎవరికి నమస్కారం చేస్తారో వారు నమస్కరించే పాదాలు.అవి ఎప్పుడు భక్తుల హృదయాల్లో ఎప్పుడూ చెక్కు చెదరకుండా వుంటాయి.
అలాంటి స్వామి కి స్తన్యమిచ్చిన తల్లు ఎంత సద్గతి పొందుతుందో ఆ రాక్షసి కూడా సద్గతి పొందుతుంది
ఇదంతా విష్ణు అనుగ్రహం అని ఎవరి పనిలో వారు వుంటున్నారు.
కృష్ణ లీలలు ఇంకా చెప్పమని పరీక్షిన్మహారాజు శుకయోగేంద్రుడు ని అడుగగా
ఒక రోజు కృష్ణుడు బోర్లపడినప్పుడు జరిగేటప్పుడు జరిగే వేడుక చేస్తున్నారు.అన్నీ చెయ్యాల్సినవి చేసి ఉయ్యాల లో పడుకోబెట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.ఆ ఉయ్యాల కి దగ్గరలో బరువైన పదార్థాలు కల బండి ఉంది.తనమెత్తనైన బుజ్జిపాదాల తో ఆ బండి ని తన్నారు.పెద్దపెద్ద పాత్రలు ఇతరము ల తో ఉంది ఆ బండి.ఇటు వచ్చిన వారి అతిధి సత్కారాలు తో ఉన్ననందుడు మొదలు వారు ఆ చప్పుడు వినంగానే వచ్చి పిల్లాడికి ఏమైందో చూస్తున్నారు.అమ్మయ్య ఇంకో గండం గడిచింది పిల్లాడికి ఏమి అవ్వలేదు అనుకుంటూ ఉంటే అక్కడ ఉన్న పిల్లలు మాకు తెలుసు ఏమి అయిందో కృష్ణుడే ఆ బండి ని తన్నాడు అని చెప్పారు.
పిల్లలు కదా చిన్నదాన్ని పెద్దింతలు గా చెప్తారు వాడు అలా ఎలా చేస్తాడు లే అని యశోదా దేవి వాళ్ళు అనుకున్నారు.

శా. బాలుండెక్కడ ? బండి యెక్కడ ? నభోభాగంబుపై( జేడ్పడం
గాలం దన్నుట యెక్క ? డ

ఇంతలో స్వామి ఏడవడం మొదలు పెట్టారు.అప్పుడు యశోదా దేవి
అలసితివి కదన్న! యా కొంటివి కదన్న మంచి అన్న! ఏడ్పు మనుమన్న అని ఆమె స్తన్యమిచ్చినది ఏమి ఎరగనట్లే వున్నాడు పిల్లవాడు.
ఒకసారి యశోద కృష్ణుని ఒళ్ళో పెట్టుకొని ఆడిస్తో౦ది.
ఒక్కసారిగా బరువు అయిపోయాడు.పర్వత బరువులా ఉన్న స్వామి ని కింద పరుపు మీద పడుకోబెట్టినది యశోదా. అప్పుడు సుడిగాలి ఒకళ్లకు ఒకళ్ళు కనపడనంత గా దుమ్ము తో.గాలి తెరిపికి రాంగానే పిల్లాడు కనపడపోయే సరికి అందరూ ఆందోళన తో గాలి పిల్లాన్ని ఎక్కడికి అయినా తీసుకెళ్లిందేమో అని అనుకుంటుండగా పెద్ద శబ్దం వచ్చింది.అక్కడ కి వెళ్ళ౦గానే పెద్దరాయి మీద రాక్షసుడు శవం ఉంది.త్రునావృత్తుడనే రాక్షసుడు సుడిగాలి రూపం లో వచ్చి పిల్లాణ్ణి తీసుకెల్దామనుకుంటే గట్టి గా మెడ పట్టుకొని ఆ రాక్షసుడు ని స్వామి ఉంటే ఆ బరువు కు ఆ రాక్షసుడు కింద పడిపోయాడు.గరిమ సిద్ధి ఇది
ఎప్పుడయితే అతని ప్రాణాలు పోయాయో అతను ది పెద్ద శరీరం పక్కన స్వామి చిన్న గా ఇక్కడ నారాయణ భట్టాద్రి ఒక నల్లని కొండ మీద నీలమణి ని ఎలా తీసారో అలా స్వామి ని తీశారు అని వర్ణించారు.అమ్మయ్య మృత్యువు నుంచి బయటపడ్డాడు అని అందరూ అనుకున్నారు.
ఇప్పటి వరకు మూడు అసురసంహార లీలలు అయ్యాయి.
ఒక్కసారి స్వామి కి పాలు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆవాలిస్తాడు అప్పుడు ఆ నోటి లో సమస్త బ్రహ్మాన్దాలు గోచరించాయి ఇది బ్రమ అనుకుంది.యశోదమ్మ.
కృష్ణుని విశ్వరూపావతారం
పరిమితము గా ఉండటం ఆయన యోగమాయ.అపరిమితము గా ఉండడం ఆయన విశ్వరూపం.పరిమితము గా ఉన్న అపరిమితమును ఎప్పుడు తగ్గించలేదు.అర్జునునికి విశ్వరూపం చూపించినప్పుడు కూడా నీ దృష్టి ని మార్చుకో అని అన్నారు.భగవంతుడు రూపు మార్చుకోలేదు చూసే వాడి చూపు మార్చారు.
వసుదేవుడు గర్గుని ని నామకరణ సంస్కారం చెయ్యమని నన్దవ్రజానికి పంపారు.గర్గభాగవతము కూడా చాలా బాగుంటుంది.
బాలుడయి ఉన్న ఆ పరంజ్యోతి ఎక్కడ ఉన్నాడో అని వెతుక్కుంటూ వస్తున్నారు.నందుడు ఆయన రాకకు సంతోషించి మీరు జ్యోతిష్యం లో మీరు దిట్ట మా పిల్లలకు నామకరణం చేయండి అని అడిగాడు.పేరు పెట్టాలి అనే సంకల్పం పెట్టించుకోవాలనే స్వామి దే.
ఆడుకుంటున్న పిల్లల్లో నల్లనయ్య ను ఎత్తుకొని ముద్దులాడుతుంటే నందుడు పేరు పెట్టాలి అని గుర్తుచేసాడు. వసుదేవుడు కూడా నన్దవ్రజం లొనే పేరు పెడితే మంచిది అన్నట్లు గర్గునకు చెప్పి పంపుతాడు.
పేరు పెట్టేముందు ఇలా అబతున్నాడు.ఇతడు తెలుపు,ఎరుపు,పసుపు వర్ణాలు తో పూర్వము వున్నాడు ఇప్పుడు నల్లని వర్ణము తో వున్నాడు.
*కలియుగము లో తరింపిజేటానికి కృష్ణావతము లో వస్తున్నారు*
మీ అబ్బాయి కి అనేకనామాలు అనేక రూపాలు ఉంటాయి.అవి నాకు తెలుసు.
నామార్థవిచారణ చేస్తే ఇది అంతా పరబ్రహ్మ కు తెలిసిన నామమే అని తెలిసి మనకు బ్రహ్మ జ్ఞానం నామస్మరణ వల్ల జరుగుతుంది.

అనేక నామాలు గల తనకి ఏ పేరు కావాలో స్ఫురింప చేశారు.వెంటనే కృష్ణా అని నామకరణం చేశారు గర్గ్లుల వారు.
కృష్ణా అంటే సచ్చిదానంద స్వరూపం.

కృష్ణా అంటే తనవైపుకు లాగేవాడు.అంటే తనవైపుకి ఆకర్షించే వాడు ఎలా అంటే ఆకర్షింపబడే వాడు మళ్ళీ బైటకి రాలేడు అంటే ముక్తి పొందుతాడు.
కర్షకుడు పని చెయ్యాలంటే ముందు కలుపుమొక్కలు లాగేస్తాడు.తర్వాత పండిస్తాడు.
మన దగ్గర నిస్సారవంతమైన ఒక పంట ఇంకోటి బండతనం,కలుపుమొక్కలు.వాటిని తీసేసి మృదువు చేసి అప్పుడు పంటపండించాలి.ఇలాంటి పంట మనలో ఉంటే ముందు బండతన్నాన్ని తీసేసి,కలుపు మొక్కలు ఏరి,జ్ఞాన బీజాలు వేసి బ్రతుకు ను పండిస్తాడు.

కృష్ణుడు అంటే కాల స్వరూపుడు.
కోట్లకొలది విష్ణు నామాలు పలికితే ఎంత పుణ్యమో కృష్ణ అని ఒకసారి పలికితే అంత పుణ్యం.
*మంత్రశాస్త్ర నామాల్లో ముఖ్యమైనది శ్రీకృష్ణశరణం మమ*

నారాయణుని ఆశ్రయించిన వారిని,దేవతల్ని ఆసురులు ఏమి చెయ్యలేకపోయారు ఎలాగో ఈ కృష్ణపరమాత్మ పై ఎవరు ప్రీతి పొందుతారో వారిని ఎవరూ బాధించలేరు.
కృష్ణ స్వామి పెద్దవాడు అవుతున్నారు.
తల్లులకి కూడా ఒక చోట ఉండకుండా అడవుల్లోకి ,వీధుల్లోకి వెళ్లిపోతున్నాడు
ఇప్పుడు తోటిపిల్లల తోఆడుకునే వయస్సు వచ్చింది.వెన్న మీగడలు దొంగిలించి తమతో పాటుగా కోతులకి కూడా పంచుతున్నాడు
ఒకసారి గోపకాంతలు కృష్ణుడు అల్లరి తట్టుకోలేక వాళ్ళమ్మ గారి దగ్గరకు వెళ్లారు.బాగా అల్లర్జ్ చేస్తున్నాడు అని. ఆవిడ నవ్వి ఊరుకుంది.ఏంటి నవ్వు
తున్నావు మా ఇంట్లో పాలు ,వెన్న దొంగిలిస్తు౦టే అంటే నేనెలానమ్మను అంది యశోదా.పోనీ వచ్చాడే అనుకోండి పిల్లలకి అందేట్లు ఎట్లా పెడుతున్నారు అని
మళ్ళీ అన్నమయ్య ప్రస్తావన
|| కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని ||

చ|| బాయిట బారవేసిన పాలు వెన్నలును | చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు |
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక | పాయక దూరేరేల ప్రతిలేని బిడ్డను 

ఇలా కృష్ణలీలలు కొన్ని చెప్పారు.
ఒకసారి బలరాముడు వచ్చి అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అని అంటే కృష్ణుని యశోద. ఎందుకు తిన్నావని నిలదీయగా అప్పుడు కృష్ణుడు
అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాఁ కొంటినో వెఱ్ఱినో
నమ్మంజూడకు వీరి మాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ

రిమ్మాగ్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీ యాస్య గం
ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.!

వీళ్ళందరి మాటలు న మ్మద్దని కృష్ణుడంటే నోరు తెరవమని అమ్మ అంటే నోరు తెరిచాడు.
స్వామి నోటిలో ఉన్న భువనభణ్డంములు చూసింది మహాయోగి కి లభించాల్సిన యోగం లభించింది.బ్రహ్మని ఒకే రకమైన స్థితి లో ఉంది యశోదా దేవికి.యశోదా దేవి స్తోత్రం చేస్తుంది.ఆమె కి విశ్వరూప దర్శనమయ్యింది.ఆ నోట్లో అన్ని చూసినప్పుడే ఆమె కి పరిస్థితి అర్ధం అయ్యింది.వెంటనే ఆమె కు మళ్ళీ మాయ ఆవహింపచేశారు కృష్ణ స్వామి.సత్యాన్ని తట్టుకొనే స్థితి రావాలి కదా ఆమె కు.మళ్ళీ పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకొని లాలించడం మొదలు పెట్టింది.
ఇది విన్న పరీక్షిన్మహారాజు భాష్పములతో బ్రహ్మము ను ఒళ్ళో పెట్టుకుంది ఏమి చేసింది అయ్యా అని అంటే
వసువుల్లోఒకడైన ద్రోణుడు, ఆయన భార్య ధరా వారిని భూలోకానికి వెళ్ళండి అని బ్రహ్మ అంటే పరమాత్మ ని తల్లిదండ్రులు గా లాలించే భాగ్యం వస్తే మేము భూలోకానికి వెళ్తాము అన్నారు ట .మీకు ఆ భాగ్యం లభిస్తుంది అని అన్నారు ట వాళ్ళే నంద,యశోద లు.
రేపు ఇంకా ఎన్ని లీలలు చూపిస్తారో కృష్ణుడు అని అంటూ గురువు గారు ప్రవచనము ముగించారు.
సర్వము శ్రీ గురుచరణారవిందార్పణ మస్తూ

collected from blog of samavedam shanmukha sarma post on 250218

తస్మై శ్రీ గురవే నమః పూజ్యగురుదేవులు షణ్ముఖుల భాగవత ప్రవచన మకరందాలు 23 rd ఫిబ్రవరి.
*ఈ కలి లో జీవులకు ఒకే ఒక దిక్కు కృష్ణకధ .దానివల్ల మనం తరించగలం*
కృష్ణావతార లక్ష్యం ఏమిటి ఈ అవతారం ఒక లక్ష్యం తో రాలేదు .అనేక లక్ష్యాల సమాహారం అయిన పరిపూర్ణ అవతారం.
భూమి గర్వించి రాజుల రూపంలో ఉన్న రాక్షసుల యొక్క భారాన్ని తట్టుకోలేకపోయింది.బ్రహ్మ తో భూదేవి అధర్మాన్ని భరించలేను అని చెప్పగా బ్రహ్మ,రుద్రాది దేవతలు క్షీరసాగరం దగ్గరకు వెళ్ళి ప్రార్ధించారు.జగన్నాథుని పురుషసూక్తం మంత్రముల తో స్తుతించారు.బ్రహ్మ స్తుతించి సమాధిస్థితి కి వెళ్లారు.ఆ స్థితిలో నారాయణ వచనం వినపడింది.ఆ వచనాన్ని దేవతలందరికీ చెప్తున్నారు బ్రహ్మదేముడు.భూదేవి ఎందుకు వచ్చింది అన్నవిషయం నారాయణునికి ముందే తెలుసు.ఇప్పుడు ఆయన జగతి ని ఉద్ధరించడానికి ఉద్భవిస్తున్నారు.నారాయణ స్వామి పుట్టే యదువంశం లో దేవతలు కూడా భిన్న భిన్న అంశలు పుట్టాలి.నారాయణుడు వసుదేవ గృహం లో అవతరిస్తారు.ఆ విషయం తో భూమాత సంతోషిస్తుంది.బ్రహ్మ కూడా తన నెలవుకు వెళ్తారు.
యాదవులకు రాజధాని మధుర.ఇది మోక్షపట్టణం ఎందుకంటే నారాయణుడు నిత్య సన్నిహితుడు కనుక.నారాయణ స్వామి అవతరించె ముందు కూడా హరిధామం మరియ మోక్ష ధామం.
*కంచీ, అయోధ్యా ,మధుర , మాయా ,కాశీ , అవంతికా , ఇవి నగరములు మరియు మోక్షపట్టణములు*
ఆ మధుర లో సూరసేనుని పుత్రుడు వసుదేవుడు.ఆయన దేవకుని కుమార్తె దేవకి ని వివాహమాడాడు.దేవకుని సోదరుడు ఉగ్రసేనుడి పుత్రుడు కంసుడు.తను స్వయంగా రధం నడుపుతూ ఒక ఆకాశవాణీ వినపడింది.
ఓ అవివేకి ఎవరి అష్టమ గర్భ సంతానం వల్ల నీకు చావు రాసిపెట్టి ఉందొ ఆమె ను కూర్చోబెట్టి రథాన్ని తోలుతున్నావు.అది విన్నవెంటనే ఆమెను జుట్టు పట్టుకుని ఖడ్గం తో చంపబోతుంటే వసుదేవుడు కంసుడు తో చూసావా ఆ అమ్మాయి ని ఇప్పుడే పెళ్లి అయ్యింది .పెళ్లి పచ్చదనం ఆ శరీరంలో కనపడుతోంది.
వావిఁ జెల్లెలు గాని పుత్రికవంటి దుత్తమురాలు; సం
భావనీయచరిత్ర; భీరువు; బాల; నూత్నవివాహ సు
శ్రీవిలాసిని; దీన; కంపితచిత్త; నీ కిదె మ్రొక్కెదన్;
కావవే; కరుణామయాత్మక; కంస! మానవవల్లభా
నీకు ఈమె వల్ల మరణం అని ఆకాశ వాణి చెప్పలేదు.అష్ఠ్డ సంతానం వల్ల కదా అందుకని తొలిచూలు నుంచి సంతానం ని నీకప్పజెప్తాము అని అనగానే ఇది ఔచిత్యం గానే ఉందని విడిచి పెట్టి ఎవరి మానాన వాళ్ళువుంటుండగా ప్రధమ సంతానాన్ని వసుదేవుడు కంసునికి ఇచ్చారు సత్యనీతి గల ఉత్తముడు.ఆ సత్యనిష్ఠ కి కంసుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈయన పుట్టినప్పుడు దేవతలు కుసుమవృష్తీ కురిపించారు ఎందుకంటే నారాయణ స్వామి ఈయన కి సంతానం అవుతారని.
సమత్వం,సత్యానిష్ఠఉన్న వాడు వసుదేవుడు. ఆతని సత్యానిష్ఠ కి ఆశ్చర్య పోయి పెద్దగా నవ్వి ఆ అబ్బాయి ని ఇచ్చి నాకు 8 వ సంతానం వల్ల కదా తీసుకో అని
ఇక్కడ నారాయణ భట్టాద్రి దుష్థానామపి ధీర అంటే దుష్టులకు కూడా అప్పుడప్పుడు కరుణ వస్తుంటుంది.
ఆరుగురు మేనల్లుళ్ల తో ఆడుకుంటూ హాయిగా ఉంటున్న కంసుడు దగ్గరకు నారదుడు వచ్చి నందవ్రజం లో అందరూ దేవాంశ సంభూతులు ట అందులో నీ ఆరుగురు మేనల్లుళ్లు కూడా ట.మీరు రాక్షసులు .వాళ్ళందరూ నిన్ను మట్టుపెట్టడానికి ప్రణాళికలు వేస్తున్నారు.నీవాళ్లందరూ రాక్షస సంభూతులు వాళ్ళందరూ దేవాంశసంభూతులు.ఆ మాట వినంగానే వెంటనే ఉగ్రసేనుణ్ణి బంధించి తాను రాజు అయ్యాడు.యాదవులను మట్టుపెట్టసాగాడు.
యాదవ,భోజ,అందక వంశీయుల రాజ్యాలకు ప్రభువు అయ్యాడు.అప్పుడు దేవకి ని వసుదేవుని చెరసాలలో బందించాడు.అంతే కాదు తన ఆరుగురు మేనల్లుళ్లను నిర్దయగా సంహరించాడు.

నారాయణ స్వామి తనదయిన ప్రణాళిక మొదలు పెట్టారు.మాయ ని పిలిచి నా అంశ అయిన ఆదిశేషుడు దేవకి గర్భం లో సప్తమ గర్భం గా వున్నాడు ఆ తేజాన్ని జాగ్రత్తగా తీసి వ్రజం లో ఉన్న వసుదేవ పత్నుల్లో ఒకరైన రోహిణి దేవి గర్భం లో ప్రవేశపెట్టాలి.ఇంకోటి నువ్వు యశోద గర్భం లో ఉద్భవించాలి.అదే సమయంలో నేను దేవకి గర్భం లో ఉద్భవిస్తాను.
నువ్వు నా సోదరివి యోగమాయ *పద్మనాభ సహోదరి*నిన్ను అందరూ కొలుస్తుంటారు.నీకు అనేక శక్తి పీఠాలు ఉంటాయి.నీ దివ్య నామాలు కొన్ని ఉన్నాయి *ఇవి స్మరించే వారిని నువ్వు కాపాడతావు దుర్గేతి భద్రకాలెతి,విజయా విష్ణావేతి చ కుముదా చండికా కృష్ణా మాధవి కన్యకేతిచ మాయ నారాయనీ,ఈశాని శారదేతి అంబికేతి చ*

ఇలా చెప్పారు ప్రణాళిక జరిగింది.యోగమాయ రోహిణి గర్భాన ఆ గర్భాన్ని ప్రవేశ పెట్టింది.కంసుని ఆక్రమణ లో చెల్లాచెదురు అయిన వాళ్లలో రోహిణి ఒకరు.అందరూ దేవకి కి గర్భవిచ్చిన్నం అయింది అనుకున్నారు.తర్వాత కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చింది డేవదేవుని గర్భం లోమొస్తోంది కనుక తేజస్సు తో మెరిసి పోతూఉంది .అది చూసి కంసుడు కూడా భయపడ్డారు.ఆయనకు సింహం ప్రవేశించిన గుహ ని చూస్తున్నట్లు గా అనిపిస్తోంది.ఆయన నిద్ర లేని వాడు లా ఉంటున్నాడు.అష్టమ గర్భం అని విష్ణువు అని ఆలోచనలతో .ఏ పని చేస్తున్న ప్రపంచం విష్ణుమయం గా కనపడుతోంది.
అంతన బ్రహ్మాది దేవతలు చెరసాలలో వచ్చి గర్భం లో ఉన్న స్వామి ని చూడడానికి విచ్చేశారు .బ్రహ్మా గారు స్తుతి చేశారు అది అవతార స్తుతి .
*దేవకి గర్భ గుడి లో ఉన్న కృషునకు నమస్కారం చేశారు*

*సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం
సత్యస్య యోనిం నిహితంచ సత్యే
సత్యస్య సత్యమ్‌ ఋత సత్య నేత్రం
సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాహ*
సత్యనారాయణ రూపం ఉన్న మహిమాన్వితమైన స్తుతి.
ఆయన్ని పొందటానికి మార్గం సత్యమే.సత్యమే గొప్ప ప్రాప్తి గా కలవాడు.నిష్కపటత్వమే సత్యం.మూడు కాలాల్లోను ఏ మార్పు లేని వాడు.సత్యమునకు కారణమైనటువంటి వాడు.అనగా పంచభూతాలకు కారణమైనటు వంటి వాడు.వీటికంటే పరమార్థ స్వరూపంగా ఉన్నటువంటి వాడు.ఈ వర్ణించిన సత్యమే తన ఆత్మ రూపం గా గల్గిన వాడు.అటువంటి నిన్ను శరణువేడుతున్నామయ్యా..
ఈ శ్లోకంలో ఆయన్నగురించి ఆయన్ని పొందటానికి కావాల్సినవి చెప్పిన బ్రహ్మదేమునకు నమస్కారం.
ఇది నిత్యపారాయణ యోగ్యం అయిన శ్లోకం.
నీ అవతారం సత్పురుషులకు ఆనందం కలుగజేస్తుంది.
దుర్మార్గులకు అమంగళము కలుగజేయును.
*ఇప్పుడు కూడా ఆ అవతారం సత్పురుషులకి ఆనందం దుర్మార్గులకు అమంగళం కలుగజేస్తుంది*
నీ అవతార మూర్తి పాదాలు ఎవరు ఆశ్రయిస్తారో వారు సంసార బాధలనుండి విముక్తి పొందుతారు.
ఈ సంసారాన్ని దూడ కాలిగిట్ట ఎంత ఉందో ఆ మేర దాటేస్తారు.
*ప్రకృతి కి లొంగిన జన్మలు జీవుడివి .ప్రకృతి ని లొంగదీసుకున్నజన్మ ఈశ్వరావతారం*
మాయాకాలాలకు లొంగిపోని ఈశ్వర అవతారం నువ్వు.ఆ అవతారాలకు నమస్కరిస్తున్నాను.అని బ్రహ్మ స్తుతి చేశారు.అలా అదృశ్య దేహాలతో దేవతలు నమస్కరించి స్తుతించి వాళ్ళు వెళ్లిపోయారు.
ఇంక సమయం సమీపించినది. శ్రావణబహుళ అష్ఠమి.అర్ధరాత్రి సమయం ఒక్కసారి వాతావరణ మార్పు ప్రకృతి నిర్మలం గా ఉంది.అప్పుడే కాదు శ్రద్హ పెడితే మన హృదయం లో అవతరిస్తాడు.దుష్టుల్ని శిక్షించి శిష్టులను రక్షిస్తాడు.
సంభవామి యుగే యుగే..
మళ్ళీ త్యాగరాజు ప్రస్తావన
ఎవరీకయ్య ఈ అవతారము.
మంగళకరమైన కాలము వచ్చింది.పుట్టుక లేని వాడి పుట్టిన నక్షత్రం అంటే బ్రహ్మ అధిష్ఠాన దేవత గా ఉన్న రోహిణీ నక్షత్రం.దిక్కులు ప్రసన్నమైపోయాయి.గగనం నిర్మలం గా ఉంది.సమస్త ప్రాణకోటి అపరిమితమైన ఆనందం తో ఉన్నాయి.సరస్సు లో కలువాలు వికసించినాయి.తుమ్మెదలు విహరిస్తున్నాయి.ఆ సమయంలో అగ్నిహోత్ర గృహాల్లో యజ్ఞఅగ్నిలు చక్కగా ప్రకాశిస్తూఉన్నాయి.ఒక్క రాక్షసులకు మాత్రం ఎదో తెలియని దిగులు గా ఉంది.అప్సరస నాట్యాలు,కిన్నెర గానాలు,దేవతలు మునులు పుష్పవానలు కురిపిస్తుంటే,మేఘాలు మంగళవాయిద్యాలు గా గర్జిస్తుంటే

స్వచ్ఛంబులై పొంగె జలరాసు లేడును;
గలఘోషణముల మేఘంబు లుఱిమె;
గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె;
దిక్కులు మిక్కిలి తెలివిఁ దాల్చెఁ;
గమ్మని చల్లని గాలి మెల్లన వీఁచె;
హోమానలంబు చెన్నొంది వెలిఁగెఁ;
గొలఁకులు కమలాళికులములై సిరి నొప్పెఁ;
బ్రవిమలతోయలై పాఱె నదులు;
వర పుర గ్రామ ఘోష యై వసుధ యొప్పె;
విహగ రుత పుష్ప ఫలముల వెలసె వనము;
లలరుసోనలు గురిసి ర య్యమరవరులు;
దేవదేవుని దేవకీదేవి గనఁగ.
అన్నమయ్య కీర్తన ప్రస్తావన..

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు
పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకి నందను గనియె॥
నవ్వుతూ చూసింది అయ్యా దేవకీ దేవి.జగత్తు ను ఆనందిపచేసే వాడు పుడుతున్నప్పుడు ఆ తల్లి ఆనందం గానే ఉంటుంది.తల్లి కి కూడా ప్రసవవేదన ఇవ్వ లేదు.

తమద్భుతం బాలకమమ్బుజేక్షణం చతుర్భుజం శఙ్ఖగదాద్యుదాయుధమ్
శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం పీతామ్బరం సాన్ద్రపయోదసౌభగమ్
ఆ బాలుడు చతుర్భుజాలతో శ౦కచక్ర
గథాధరములు ధరించి పాదములు మొదలుకొని శిరస్సు వరకు సర్వభరణములు ధరించి శ్రీవత్సము,కౌస్తుభము,వనమాల,వక్షస్థలం లో లక్ష్మీ తో సహా బాలుడు కనపడ్డాడు.
ఎంత చక్కగా వర్ణించారు శుక యోగేంద్రుడు
అలాంటి కృష్ణుని ఆవిర్భావం
సాధారణంగా నీలి వస్తువుల నుంచి తెల్లని వెన్నెల రాదు.కానీనీలి చంద్రుడు అయిన క్రిష్ణుని నుంచి తెల్లని చల్లని కాంతులొస్తున్నాయి.
శ్రీ కృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ
శ్రీకృష్ణ పరమాత్మ కీ జై.జై శ్రీ కృష్ణా🙏
నువ్వు ఎవరో నాకు తెలుసు.నేరుగా వచ్చిన పరమపురుషుడవు.నీ అసలు స్వరూపం కేవలం ఆనంద స్వరూపం.అటువంటి వాడవు మా ముందు గోచరించడం ఎంత అదృష్టమో స్వామి అని నమస్కరించాడు వసుదేవుడు.దేవకి దేవి చూస్తూ ఆనందపరవసురాలు అయి నువ్వు కంటి ముందు కనపడే ఆధ్యాత్మవిష్ణువు.కృష్ణుడంటేనే విష్ణువు.వున్నవాడు ఉన్నట్లు వస్తే నే కృష్ణుడు.నీది పరిమిత శరీరం కాదు.నిర్గుణ,నిర్వికారుడవు అలాంటి నువ్వు ఉద్భవించావు.
నీ రూపాన్నీ ఉపసంహరించుకో ఇది అలౌకికము.దీన్ని చూస్తే మా పుత్రుడనిపించట్లేదు.చేతులు ఎత్తి నమస్కరించి స్తుతించాలనిపిస్తోంది.కాబట్టి ప్రాకృత రూపం లో రా స్వామి అంటే వాళ్ళని ఆశీర్వదిస్తూ ఇదంతా మీకు గతజన్మ గుర్తు కోసం చేసాను.మీరు స్వయంభూ మన్వంతరం లో వసుదేవుడు ప్రజాపతి సుతకుడు ఆమె పేరు పృష్ణని.బ్రహ్మ అనతి చే తపస్సు చేస్తే ఆ ఫలితంగా నేను ప్రత్యేక్షము అయితే నన్ను సంతానం గా కోరుకున్నరు.అప్పుడు పృష్తీవ్రతుడు అనే పేరుతో మీకు సంతానం గా పుట్టాను.నన్ను సంతానం గా పొందాలి అనే మీ తీవ్రమైన కోరిక ఒక సారి తీరలేదు.రెండో జన్మ లో అదితి,కశ్యపులయ్యారు అపుడు నేను వామను నయ్యను.ఆ మీరే ఇప్పుడు దేవకి వసుదేవులయ్యారు.ఇంక కృష్ణావతారమొస్తే తర్వాత మీరు రారు .మీరు నా పై బ్రహ్మ భావన,ప్రేమ రెండు కలవారు అయి మోక్షము పొందుతారు అని చెప్పి ఏమి తెలియని చిన్న శిశువు గా మారిపోయారు.
పైగా ప్రణాళిక మొత్తం చెప్పారు నందవ్రజం లో మాయ శిశువు ను ఇక్కడ కి తీసుకు రావడం తనని యశోద తనయుడిగా అక్కడ ఉంచడం.
యోగమాయ ప్రభావం వల్ల ఆయన చేతులకు కాళ్లకు ఉన్నగొలుసులు తెగిపోయాయి.చెరసాల తాళాలు విడిపోయాయి.అప్పటివరకు కంటి మీద కునుకు లేని భటులు చివరకు కంసుడు తో సహా అందరూ నిద్రపోయారు.వసుదేముడు తట్టలో పిల్లాన్ని పెట్టుకుని వెళ్తుంటే ఆనందము తో మబ్బులు పట్టి పుష్పవృష్తీ కురిపిస్తున్నాయి.యమునా కూడా తీవ్రత తగ్గించి వసుదేవుని కాళ్ళు కదిగేంత మేరలో ఉంచింది ఎందుకంటే భగవానుని తీసుకొస్తున్నారు.వసుదేవుడు నన్దవ్రజంన్లో మాయ ని తీసుకొని కృష్ణపరమాత్మ ని అక్కడ యశోద పుత్రుని గా పెట్టి తిరిగి వచ్చారు.ఇక్కడ ఆడ శిశు జనన వార్త విని పుడతాడు అని చెప్పి ఆడ శిశువు గా పుట్టాడు మాయవి అని కోపించి కంసుడు చంపదానికి రాగా దేవకి ఆడపిల్లని వదిలెయ్యమని ప్రార్ధింపగా వినని కంసుడు ఆ పసిపిల్లను విసిరేయగా అష్ఠ్డ భుజాలతో ,ధనస్సు,సూలముయోగ మాయ ప్రత్యెక్షమయి నిన్ను మట్టుపెట్టే నీ శత్రువు ఇక్కడే ఎక్కడో పుట్టాడు అని చెప్పినది.
కంసుడు నిరంతర విష్ణు ధ్యానం చేసాడు కాబట్టే ముక్తి .
కంసుని ధ్యానం పైన యోగం కోసం ఇంక అన్వేషణ *అందుకే భయయోగి కంసుడు*
అప్పుడు కంసుడు దేవకి ,వసుదేవుడు తోఆ విష్ణు వు నన్ను మోసం చేశాడు .మీ గర్భం లో కాక వేరే చోట పుట్టాడు. నన్ను క్షమించండి అని చాల ప్రియమైన మాటలు అంటే ...వాళ్ళు కూడా క్షమించాము అని అన్నారు.తర్వాత కంసుడు అసురశక్తులని పిలిచి ఈ ప్రదేశం లో ఉన్నఅప్పుడే పుట్టిన పిల్లలను మట్టుపెట్టండి అన్నారు.అక్కడ మధుర లో పుట్టిన శిశువు యొక్క సంస్కారములు నందుడు విప్రులను పిలిచి చేయించారు .
*హిందూ మతం అంటే జీవుణ్ణి సంస్కరించే సాధన*
ఆ తర్వాత ఉత్సవం జరుగుతుంది వ్రేపల్లె మొత్తం
*అప్పుడు దేవకీ వసుదేవలకు ఉత్సవం ఇప్పుడు మన అందరికి మహోత్సవం*
అందరి ఇళ్లు శోభాయమనం గా ఉన్నాయి.ఆవులను అలంకారాలు చేశారు.ఆడ మగ వాళ్ళు అందరూ నందుని ఇంటికి బయలు దేరారు.అన్ని మంగళకరము గా ఉన్నాయి ఎందుకంటే అక్కడ హరి వున్నాడు కనుక హరి ఉన్న చోట సిరి ఉంటుంది కదా.నందవ్రజం లో అందరూ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది.
*కృషుడు ఉన్న హిందూమతం లో
చిరాకు, కోపాలు,ఏడుపులు వుండవు*
ఆడవాళ్ళు స్నానము చేయించి దిష్టి చుక్క పెట్టి హరిరక్ష అన్నారు. ఉయ్యాలలో వేసారు.

జోజో కమలదళేక్షణ!
జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా!
జోజో పల్లవకరపద!
జోజో పూర్ణేందువదన! జోజో యనుచున్
అలా జోలతో నిద్ర పోతున్నా రు.
అలా నిద్ర పోతున్న శ్రీకృష్ణ లీలలను రేపటి నుండి విందాం.పరమాత్మ తో ఆడుకుందాము అనటం తో ప్రవచనము ముగిసింది.

సర్వము శ్రీ గురుచరణారవిందార్పణ మస్తూ
జై శ్రీ కృష్ణ 🙏

గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం తస్మై శ్రీ గురవే నమః పూజ్యగురుదేవులు షణ్ముఖుల భాగవత ప్రవచన మకరందాలు 24
దేవకీ వసుదేవలకు కృష్ణుడు బ్రహము మరియు పుత్రుడు అనే భావం,నంద యశోద లకు మాత్రం పుత్రుడనే భావం మాత్రమే.ఇరువురూ ముక్తి పొందారు.
భాగవత శైలి యోగశైలి.నందయశోదలు మొత్తం వ్రేపల్లె వారు కృష్ణుని మన వాడు అనుకోని ముక్తిని పొందారు.
ఒకసారి నందుడు మధుర కు కప్పం కట్టడానికి వెళ్లారు.అక్కడ ఆయన వచ్చారని తెలిసి వసుదేవుడు కలిశారు వీరు ఇరువురూ మంచి స్నేహబంధవ్యాలు ఉన్నవారు ఆనందం తో నీకు కుమారుడు కలిగాడు ట కదా అని నందుణ్ణి అడుగారు.అవును నాకు మంగళమే. నీ వార్తలు విన్నాను నీ సంతానం మొత్తము గతించారు అని కడపటి గా ఆడశిశువు కూడా పోయింది అని దిగులు పడకు ప్రారభ్డాలు ఇవన్నీ అని నందుడు అంటుంటే బయటపడకుండా వసుదేవుడు విన్నాడు.నా పిల్లాడు రోహిణీ ఎలా ఉన్నారు అని అడిగితే బాగున్నారు అని నందుడు అన్నారు .వెంటనే నందుడు నువ్వు బాధ పడకు నా సంతానం మన అందరికే సంతానమే అన్నాడు. ఇక్కడి నుంచి మీరు తొందరగా వెళ్లిపోవాలని దుష్ట శక్తులు ని కంసుడు అన్ని ప్రాంతాల్లో పంపాడు అని చెప్తాడు వసుదేవుడు.

సరే అని నందుడు బయలుదేరారు ఆయన వెళ్ళేటప్పటికే అక్కడ ఘోరం జరిగింది ఇది కృష్ణలీలల్లో మొదటి లీల
పూతన పిల్లల్ని హతమార్చే ఒకానొక దుష్టశక్తి ఈవిడ కి బాలఘాతిని అని పేరు.ఈవిడ ఇప్పటికే చాలా మంది పిల్లలుని భక్షించింది. కానీ శ్రీకృష్ణుని దగ్గరకు మాత్రం రూపం మార్చుకుని వెళ్ళింది ఎలా అంటే భగవంతుడు దగ్గరకు వెళ్ళినప్పుడు మడి కట్టుకున్నట్లు.అందంగా తయారయ్యింది అన్ని ఇళ్లు వెతుక్కుంటూ వెళ్తోంది.నన్దవ్రజం వారు కూడా ఈమె ఎవరో కొత్తఆవిడ లా ఉండే అనుకుంటున్నారు.సరిగ్గా కృష్ణ గృహానికి వచ్చేటప్పటికి నాదం లా ఏడ్చారు శ్రీకృష్ణులవారు.

నందగృహమున బాలుని నాద మొకటి
విని ప్రమోదించి సుందరీవేష
యగుచు.
ఆమె ను చూడంగానే బాలికలను మట్టుపెట్టే ఒకానొక దుష్టశక్తి లా గ్రహించారు.నిద్రిస్తున్నట్లు నటిస్తున్న పిల్లవాడిని ఉయ్యాలలో తీసి ఒళ్ళో పెట్టుకుంది.చక్కగా అలంకరించుకున్న ఆమె ఎవరా అని ఆలోచించే లోపలే స్తన్యం ఇవ్వడం మొదలు పెట్టింది.ఆ స్తన్యం తో పాటుగా ఆమె ప్రాణాలు కూడా తాగటము మొదలు పెట్టారు.ఆ పాలు తాగే విధానం ఎలా అంటే ఆమె శరీరంలో నాడులన్ని లాగపడుతున్నాయి.అది తట్టుకోలేక ఆమె అసలు శరీరం గ్రహించింది.యోజనమ్మున్నర శరీరం గల ఆమె పడిపోయే సరికి అనేక వృక్షాలు పైన పడిపోయింది ఆ చప్పుడు కి అందరూ వచ్చారు.రోహిణీ, యశోద లు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో అని ఆందోళన పడి వచ్చేటప్పటికి ఆమె పైన ఆడుకుంటూ కనిపించారు.అమ్మయ్య అనుకోని యశోద.ఎత్తుకొని ఉన్న కృష్ణునికి గండం గడిచింది అని దిష్తి తీసి నారాయణ లీల అనుకుంటున్నారు.
ఈ దిష్తి తీసే సందర్భంగా 8 శ్లోకాలు వస్తాయి మంత్ర సమానమయినవి. అవి పిల్లలకు తీసేటప్పుడు చదివితే మంచిది.ఆ నామాలు రక్షించుగాక అంటారు నారాయణ భట్టాద్రి.
*కృష్ణుడు విషాన్ని పుచ్చుకున్న లీలలు వింటే మన బాధలు పోతాయి*
ఈ విధంగా స్వామి కి గోవు తోక తో ను ,గోమాత గిట్టల వల్ల వచ్చే ధూళి తో,గోమూత్రం తో,గోవు పీడకల ను కాల్చినప్పుడు వచ్చే భస్మం తో దిష్తి తీశారు.
గోభక్తుడు గోవిందుని అనుగ్రహానికి పాత్రుడు.
ఈ నామాలు చెప్తూ తీశారు
*ఇవి విష్ణు నామ మంత్రరాసి.
పుట్టుక లేని శ్రీహరి నీ పాదాలు రక్షించు గాక
కౌస్తుభదారి నీ మోకాళ్ళు రక్షించు గాక
యజ్ఞరూపుడు నీ వూరువులు రక్షించు గాక
అచ్యుతుడు నీ నడుము ను రక్షించు గాక
హాయగ్రీవుడు నీ ఉదరాన్ని రక్షించు గాక
సర్వశక్తి మంతు డైన శ్రీహరి నీ హృదయాన్ని రక్షించు గాక
సర్వాతర్యామీ నీ వకఃస్థలం ని రక్షించు గాక
సూర్యరూపుడైన నారాయణస్వామి నీ కంఠాన్ని రక్షించు గాక
సర్వవ్యాపాకమైన విష్ణువు నీ చేతులు రక్షించు గాక
త్రివిక్రముడు నీ నోటి ని రక్షించు గాక
సర్వనియామకుడు నీ శిరస్సు ను రక్షించు గాక
చక్రపాణి నీ ముందు రక్షించు గాక
గదాదారి నీ వెనుక రక్షించు గాక
ధనుర్ధారి మధుసూదనుడు ఒక పక్క నిన్ను రక్షించు గాక
ఖడ్గము పట్టుకున్న విష్ణువు మరోపక్క రక్షించు గాక
శంకదారి అయిన శ్రీహరి దిక్కులమూలలలో నిన్ను రక్షించు గాక
వామనుడు పైన రక్షించు గాక
గరుడవాహనుడు అయిన హరి నిన్ను నెల పై రక్షించు గాక
పరిపూర్ణుడయిన హరి నిన్ను సర్వత్రా రక్షించు గాక
ఆడుకుంటున్న నిన్ను గోవిందుడు రక్షించు గాక
నిద్రిస్తున్న నిన్ను మాధవుడు రక్షించు గాక
పరిగెడుతున్న నిన్ను వైకుంఠవాసి రక్షించు గాక
కూర్చున్న నిన్ను శ్రీయహ్పతి రక్షించు గాక
తింటున్న నిన్ను యజ్ఞభోక్త రక్షించు గాక
సర్వాగ్రహ భయంకరుడైన నారాయణ స్వామి నిన్ను ఎల్లవేళలా రక్షించు గాక

ఒకటి నుంచి 14 దాకా వచ్చే బాల బాధల్ని బాలాగ్రహదోషములంటారు
*బడికి పంపే పిల్లలకు విష్ణు నామాలు చెప్పించండి వారి బ్రతుకులు బాగుపడతాయి*
ఇలా అందరూ దిష్టి తీసి కవచ భావన చేశారు.ఈ లోపల నందుడు వచ్చి వసుదేవుడు చెప్పింది నిజమే ఆయన కి గొప్ప శక్తులు వచ్చ్హాఏమో అనుకున్నాడు 
ఇప్పుడు సమస్య అంత పెద్ద శరీరం ఎక్కడ తగలెయ్యాలి అనుకోని చివరికి గొడ్డళ్లతో ఆ శరీరాన్ని నరికి అన్ని కలిపి దహనం చేశారు.ఆశ్చర్యం గా సుగంధద్రవ్యాల వాసనలు ఆ శరీరం నుంచి వస్తున్నాయి.ఎందుకంటే శరీరం పవిత్రమైపోయింది.స్వామి స్పర్శ మాత్రము చేత ఆ పూతన పాపము మొత్తం పోయింది.చిన్నికృష్ణ పాదాలు చేతులు తగిలాయి.
లోకం లో ఎవరికి నమస్కారం చేస్తారో వారు నమస్కరించే పాదాలు.అవి ఎప్పుడు భక్తుల హృదయాల్లో ఎప్పుడూ చెక్కు చెదరకుండా వుంటాయి.
అలాంటి స్వామి కి స్తన్యమిచ్చిన తల్లు ఎంత సద్గతి పొందుతుందో ఆ రాక్షసి కూడా సద్గతి పొందుతుంది
ఇదంతా విష్ణు అనుగ్రహం అని ఎవరి పనిలో వారు వుంటున్నారు.

కృష్ణ లీలలు ఇంకా చెప్పమని పరీక్షిన్మహారాజు శుకయోగేంద్రుడు ని అడుగగా
ఒక రోజు కృష్ణుడు బోర్లపడినప్పుడు జరిగేటప్పుడు జరిగే వేడుక చేస్తున్నారు.అన్నీ చెయ్యాల్సినవి చేసి ఉయ్యాల లో పడుకోబెట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.ఆ ఉయ్యాల కి దగ్గరలో బరువైన పదార్థాలు కల బండి ఉంది.తనమెత్తనైన బుజ్జిపాదాల తో ఆ బండి ని తన్నారు.పెద్దపెద్ద పాత్రలు ఇతరము ల తో ఉంది ఆ బండి.ఇటు వచ్చిన వారి అతిధి సత్కారాలు తో ఉన్ననందుడు మొదలు వారు ఆ చప్పుడు వినంగానే వచ్చి పిల్లాడికి ఏమైందో చూస్తున్నారు.అమ్మయ్య ఇంకో గండం గడిచింది పిల్లాడికి ఏమి అవ్వలేదు అనుకుంటూ ఉంటే అక్కడ ఉన్న పిల్లలు మాకు తెలుసు ఏమి అయిందో కృష్ణుడే ఆ బండి ని తన్నాడు అని చెప్పారు.

పిల్లలు కదా చిన్నదాన్ని పెద్దింతలు గా చెప్తారు వాడు అలా ఎలా చేస్తాడు లే అని యశోదా దేవి వాళ్ళు అనుకున్నారు.

శా. బాలుండెక్కడ ? బండి యెక్కడ ? నభోభాగంబుపై( జేడ్పడం
గాలం దన్నుట యెక్క ? డ
ఇంతలో స్వామి ఏడవడం మొదలు పెట్టారు.అప్పుడు యశోదా దేవి
అలసితివి కదన్న! యా కొంటివి కదన్న మంచి అన్న! ఏడ్పు మనుమన్న అని ఆమె స్తన్యమిచ్చినది ఏమి ఎరగనట్లే వున్నాడు పిల్లవాడు.
ఒకసారి యశోద కృష్ణుని ఒళ్ళో పెట్టుకొని ఆడిస్తో౦ది.

ఒక్కసారిగా బరువు అయిపోయాడు.పర్వత బరువులా ఉన్న స్వామి ని కింద పరుపు మీద పడుకోబెట్టినది యశోదా. అప్పుడు సుడిగాలి ఒకళ్లకు ఒకళ్ళు కనపడనంత గా దుమ్ము తో.గాలి తెరిపికి రాంగానే పిల్లాడు కనపడపోయే సరికి అందరూ ఆందోళన తో గాలి పిల్లాన్ని ఎక్కడికి అయినా తీసుకెళ్లిందేమో అని అనుకుంటుండగా పెద్ద శబ్దం వచ్చింది.అక్కడ కి వెళ్ళ౦గానే పెద్దరాయి మీద రాక్షసుడు శవం ఉంది.త్రునావృత్తుడనే రాక్షసుడు సుడిగాలి రూపం లో వచ్చి పిల్లాణ్ణి తీసుకెల్దామనుకుంటే గట్టి గా మెడ పట్టుకొని ఆ రాక్షసుడు ని స్వామి ఉంటే ఆ బరువు కు ఆ రాక్షసుడు కింద పడిపోయాడు.గరిమ సిద్ధి ఇది
ఎప్పుడయితే అతని ప్రాణాలు పోయాయో అతను ది పెద్ద శరీరం పక్కన స్వామి చిన్న గా ఇక్కడ నారాయణ భట్టాద్రి ఒక నల్లని కొండ మీద నీలమణి ని ఎలా తీసారో అలా స్వామి ని తీశారు అని వర్ణించారు.అమ్మయ్య మృత్యువు నుంచి బయటపడ్డాడు అని అందరూ అనుకున్నారు.
ఇప్పటి వరకు మూడు అసురసంహార లీలలు అయ్యాయి.
ఒక్కసారి స్వామి కి పాలు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆవాలిస్తాడు అప్పుడు ఆ నోటి లో సమస్త బ్రహ్మాన్దాలు గోచరించాయి ఇది బ్రమ అనుకుంది.యశోదమ్మ.
కృష్ణుని విశ్వరూపావతారం
పరిమితము గా ఉండటం ఆయన యోగమాయ.అపరిమితము గా ఉండడం ఆయన విశ్వరూపం.పరిమితము గా ఉన్న అపరిమితమును ఎప్పుడు తగ్గించలేదు.అర్జునునికి విశ్వరూపం చూపించినప్పుడు కూడా నీ దృష్టి ని మార్చుకో అని అన్నారు.భగవంతుడు రూపు మార్చుకోలేదు చూసే వాడి చూపు మార్చారు.
వసుదేవుడు గర్గుని ని నామకరణ సంస్కారం చెయ్యమని నన్దవ్రజానికి పంపారు.గర్గభాగవతము కూడా చాలా బాగుంటుంది.
బాలుడయి ఉన్న ఆ పరంజ్యోతి ఎక్కడ ఉన్నాడో అని వెతుక్కుంటూ వస్తున్నారు.నందుడు ఆయన రాకకు సంతోషించి మీరు జ్యోతిష్యం లో మీరు దిట్ట మా పిల్లలకు నామకరణం చేయండి అని అడిగాడు.పేరు పెట్టాలి అనే సంకల్పం పెట్టించుకోవాలనే స్వామి దే.
ఆడుకుంటున్న పిల్లల్లో నల్లనయ్య ను ఎత్తుకొని ముద్దులాడుతుంటే నందుడు పేరు పెట్టాలి అని గుర్తుచేసాడు. వసుదేవుడు కూడా నన్దవ్రజం లొనే పేరు పెడితే మంచిది అన్నట్లు గర్గునకు చెప్పి పంపుతాడు.
పేరు పెట్టేముందు ఇలా అబతున్నాడు.ఇతడు తెలుపు,ఎరుపు,పసుపు వర్ణాలు తో పూర్వము వున్నాడు ఇప్పుడు నల్లని వర్ణము తో వున్నాడు.
*కలియుగము లో తరింపిజేటానికి కృష్ణావతము లో వస్తున్నారు*
మీ అబ్బాయి కి అనేకనామాలు అనేక రూపాలు ఉంటాయి.అవి నాకు తెలుసు.
నామార్థవిచారణ చేస్తే ఇది అంతా పరబ్రహ్మ కు తెలిసిన నామమే అని తెలిసి మనకు బ్రహ్మ జ్ఞానం నామస్మరణ వల్ల జరుగుతుంది.
అనేక నామాలు గల తనకి ఏ పేరు కావాలో స్ఫురింప చేశారు.వెంటనే కృష్ణా అని నామకరణం చేశారు గర్గ్లుల వారు.
కృష్ణా అంటే సచ్చిదానంద స్వరూపం.
కృష్ణా అంటే తనవైపుకు లాగేవాడు.అంటే తనవైపుకి ఆకర్షించే వాడు ఎలా అంటే ఆకర్షింపబడే వాడు మళ్ళీ బైటకి రాలేడు అంటే ముక్తి పొందుతాడు.
కర్షకుడు పని చెయ్యాలంటే ముందు కలుపుమొక్కలు లాగేస్తాడు.తర్వాత పండిస్తాడు. 
మన దగ్గర నిస్సారవంతమైన ఒక పంట ఇంకోటి బండతనం,కలుపుమొక్కలు.వాటిని తీసేసి మృదువు చేసి అప్పుడు పంటపండించాలి.ఇలాంటి పంట మనలో ఉంటే ముందు బండతన్నాన్ని తీసేసి,కలుపు మొక్కలు ఏరి,జ్ఞాన బీజాలు వేసి బ్రతుకు ను పండిస్తాడు.
కృష్ణుడు అంటే కాల స్వరూపుడు.
కోట్లకొలది విష్ణు నామాలు పలికితే ఎంత పుణ్యమో కృష్ణ అని ఒకసారి పలికితే అంత పుణ్యం.
*మంత్రశాస్త్ర నామాల్లో ముఖ్యమైనది శ్రీకృష్ణశరణం మమ*
నారాయణుని ఆశ్రయించిన వారిని,దేవతల్ని ఆసురులు ఏమి చెయ్యలేకపోయారు ఎలాగో ఈ కృష్ణపరమాత్మ పై ఎవరు ప్రీతి పొందుతారో వారిని ఎవరూ బాధించలేరు.
కృష్ణ స్వామి పెద్దవాడు అవుతున్నారు.
తల్లులకి కూడా ఒక చోట ఉండకుండా అడవుల్లోకి ,వీధుల్లోకి వెళ్లిపోతున్నాడు
ఇప్పుడు తోటిపిల్లల తోఆడుకునే వయస్సు వచ్చింది.వెన్న మీగడలు దొంగిలించి తమతో పాటుగా కోతులకి కూడా పంచుతున్నాడు
ఒకసారి గోపకాంతలు కృష్ణుడు అల్లరి తట్టుకోలేక వాళ్ళమ్మ గారి దగ్గరకు వెళ్లారు.బాగా అల్లర్జ్ చేస్తున్నాడు అని. ఆవిడ నవ్వి ఊరుకుంది.ఏంటి నవ్వు 
తున్నావు మా ఇంట్లో పాలు ,వెన్న దొంగిలిస్తు౦టే అంటే నేనెలానమ్మను అంది యశోదా.పోనీ వచ్చాడే అనుకోండి పిల్లలకి అందేట్లు ఎట్లా పెడుతున్నారు అని
మళ్ళీ అన్నమయ్య ప్రస్తావన
ప|| కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని ||

చ|| బాయిట బారవేసిన పాలు వెన్నలును | చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు |
మీయిండ్లు జతనాలు మీరుసేసికొనక | పాయక దూరేరేల ప్రతిలేని బిడ్డను 
ఇలా కృష్ణలీలలు కొన్ని చెప్పారు.
ఒకసారి బలరాముడు వచ్చి అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అని అంటే కృష్ణుని యశోద. ఎందుకు తిన్నావని నిలదీయగా అప్పుడు కృష్ణుడు

అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాఁ కొంటినో వెఱ్ఱినో

నమ్మంజూడకు వీరి మాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ

రిమ్మాగ్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీ యాస్య గం
ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.!
వీళ్ళందరి మాటలు న మ్మద్దని కృష్ణుడంటే నోరు తెరవమని అమ్మ అంటే నోరు తెరిచాడు.

స్వామి నోటిలో ఉన్న భువనభణ్డంములు చూసింది మహాయోగి కి లభించాల్సిన యోగం లభించింది.బ్రహ్మని ఒకే రకమైన స్థితి లో ఉంది యశోదా దేవికి.యశోదా దేవి స్తోత్రం చేస్తుంది.ఆమె కి విశ్వరూప దర్శనమయ్యింది.ఆ నోట్లో అన్ని చూసినప్పుడే ఆమె కి పరిస్థితి అర్ధం అయ్యింది.వెంటనే ఆమె కు మళ్ళీ మాయ ఆవహింపచేశారు కృష్ణ స్వామి.సత్యాన్ని తట్టుకొనే స్థితి రావాలి కదా ఆమె కు.మళ్ళీ పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకొని లాలించడం మొదలు పెట్టింది.
ఇది విన్న పరీక్షిన్మహారాజు భాష్పములతో బ్రహ్మము ను ఒళ్ళో పెట్టుకుంది ఏమి చేసింది అయ్యా అని అంటే 
వసువుల్లోఒకడైన ద్రోణుడు, ఆయన భార్య ధరా వారిని భూలోకానికి వెళ్ళండి అని బ్రహ్మ అంటే పరమాత్మ ని తల్లిదండ్రులు గా లాలించే భాగ్యం వస్తే మేము భూలోకానికి వెళ్తాము అన్నారు ట .మీకు ఆ భాగ్యం లభిస్తుంది అని అన్నారు ట వాళ్ళే నంద,యశోద లు.
రేపు ఇంకా ఎన్ని లీలలు చూపిస్తారో కృష్ణుడు అని అంటూ గురువు గారు ప్రవచనము ముగించారు.
సర్వము శ్రీ గురుచరణారవిందార్పణ మస్తూ
Image may contain: 2 people
Image may contain: 9 people, people smiling
Like
మధురమ్ |
రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్